Political News

ఫైర్ బ్రాండ్స్ సైలెంట్‌.. వైసీపీలో కీల‌క ఆర్డ‌ర్ ..!

వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయ‌కుల‌కు కొద‌వ‌లేదు. ఎమ్మెల్యేల నుంచి నాయ‌కుల వ‌ర‌కు.. సినీరంగం నుంచి ఇత‌ర క‌ళాకారుల దాకా అనేక మంది వైసీపీకి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హరించారు. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. విదేశాల‌కు చెందిన ‘పంచ్‌’ ప్ర‌భాక‌ర్ వంటి వారు.. సైతం.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. తీవ్ర విమ‌ర్శ‌లు, దూష‌ణ‌ల‌కు దిగారు. ఇక‌, మంత్రులుగా ఉన్న కొడాలి నాని, రోజా.. వంటివారు కూడా తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఇప్పుడు వారంతా సైలెంట్ అయ్యారు. వీరితోపాటు.. అమెరికా స‌హా ఇత‌ర దేశాల‌కు చెందిన వైసీపీ మ‌ద్ద‌తు దారులు కూడా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. వారి మాట కూడా వినిపించ‌డం లేదు. దీంతో అస‌లు ఏం జ‌రిగింది? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. పోసాని కృష్ణ‌ముర‌ళి అరెస్టు, ఆయ‌న‌ను ప‌లు స్టేష‌న్ల చుట్టూ తిప్పిన ద‌రిమిలా.. అనేక మంది నాయ‌కులు భ‌య‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఒక కేసులో బెయిల్ వ‌చ్చాక‌.. మ‌రో కేసు న‌మోదు చేయ‌డం కూడా తెలిసిందే.

దీంతో వారు భ‌యానికి గుర‌య్యారు. అదేస‌య‌మంలో పార్టీ నుంచి వారికి స‌రైన మ‌ద్ద‌తు కూడా ల‌భించడం లేదు. అరెస్టయిన వారికి న్యాయ స‌హాయం చేయ‌డం.. సాధ్య‌మైనంత వేగంగా వారు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించ‌డం వంటివి పార్టీలు చేయాల్సిన ప‌ని. కానీ, ఈ విష‌యంలో వైసీపీ అధినేత చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హరించార‌న్న టాక్ పార్టీలోనే వినిపిస్తోంది. ముఖ్యంగా సామాజిక వ‌ర్గాల వారీగా కూడా.. ఇప్పుడు వివాదాలు చెల‌రేగుతున్న నేప‌థ్యంలో వైసీపీ పాత్ర త‌గ్గిపోయింది.

ఈ క్ర‌మంలో ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ అయ్యారు. లేక‌పోతే.. మీడియా ముందు నిరంత‌రం.. వారు అధికార ప‌క్షంపై విమ‌ర్శ‌లు చేసేవారు. కానీ.. ఇప్పుడు వైసీపీ త‌ర‌ఫున మాట్లాడితే..ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యం వెంటాడుతోంది. ఈ స‌మ‌యంలో వైసీపీ కీల‌క ఆదేశాలు జారీ చేసిందని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏమీ కాదు.. మేమున్నాం.. మీరు మీడియా ముందుకు రావాల‌ని కోరుతూ.. ఇటీవ‌ల పార్టీ త‌ర‌ఫున అంత‌ర్గ‌త వాట్సాప్ గ్రూప్‌ల‌లో స‌మాచారం వ‌చ్చిన‌ట్టు తెలిసింది. అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కులు మాత్రం మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ముందుగా వారి భ‌యాన్ని తొల‌గించేందుకు వైసీపీ అధినేత ప్ర‌య‌త్నిస్తారో లేదో చూడాలి.

This post was last modified on March 24, 2025 11:06 am

Share

Recent Posts

3,400 లిప్‌స్టిక్‌ ముద్దులు… చివరికి రూ.5,500 జరిమానా!

ముద్దుల గుర్తులతో మెరిసిపోయిన ఓ కారు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ వీధుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కారు మొత్తం దాదాపు 3,400…

26 minutes ago

నాకు యాక్టింగ్ నేర్పిస్తావా… ఇరుముడి పాపతో ధనుష్

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…

55 minutes ago

ఏకగ్రీవాలు జరిగితే MLA టికెట్ ఇవ్వను: జగన్!

స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…

1 hour ago

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

4 hours ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

4 hours ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

6 hours ago