శాసన మండలిలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదా? వైసీపీ తరఫున గతంలో మండలిలో చక్రం తిప్పిన నాయకులు.. తర్వాత రాజీనామాలు సమర్పించినా.. వీటిని ఆమోదించాల్సిన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఇప్పటికీ వాటిని అనుమతించలేదు. దీంతో రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీ లు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికి నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. వీరు తమ పదవులను వదులుకుని.. నాలుగు మాసాలు కూడా దాటింది.
అయితే.. వీరు అటు ఇటు ఎటూ కాకుండా పోవడం గమనార్హం. రాజీనామాలు ఆమోదిస్తే.. వేరే పార్టీలోకి వెళ్లి.. అక్కడ నామినేటెడ్ పదవులు అయినా దక్కించుకోవాలని వీరు చూస్తున్నారు. కానీ, చైర్మన్ మాత్రం వీటిపై సంతకాలు చేయడం లేదు. పోనీ.. సభకు వెళ్లాలి.. కాసేపు ఏదో ఒక రకంగా.. సభలో ఉండాలని అనుకుంటే.. అలా కూడా అవకాశం కోల్పోయారు. “మీరు మీ పదవులకు రాజీనామా చేసినందున.. మండలి కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేదు” అని అధికారులు తేల్చి చెబుతున్నారు.
దీంతో ప్రస్తుతం వైసీపీకి రాజీనామాలు చేసిన నలుగురు ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణలు గ్యాలరీలకే పరిమితం అవుతున్నారు. ఇదిలావుంటే.. రాజీనామాలు చేసిన వారికి నిర్ణీత సమయంలోగా.. నిర్ణయం వెలువరించాల్సిన బాధ్యత మండలి చైర్మన్ పై ఉన్నప్పటికీ.. అది ఆయన స్వేచ్ఛకు పరిమితమైన వ్యవహారం. దీంతో ఎవరూ కొశ్చన్ చేయాల్సిన అవకా శం లేకుండా పోయింది.
అయితే.. న్యాయపోరాటం చేయొచ్చు. కానీ, ఆదిశగా అడుగులు వేస్తే.. ఇబ్బంది తప్పదన్నఆలోచనతో వైసీపీ రిజైన్డ్ ఎమ్మెల్సీలు ఉన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు కూడా ఫిల్ అవుతున్నా యి. దీంతో మరింత గందరగోళంలోనే ఉన్నారు. వీరు రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరినా.. తిరిగి వారికి ఆయా స్థానాలు దక్కుతాయా? దక్కవా? అనేది మరో కీలక సందేహంగా మారింది. దీంతో వీరంతా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 24, 2025 10:48 am
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన…
తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన…
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…