Political News

మండ‌లి ముచ్చ‌ట‌: వారికి మోక్షం ఎప్పుడు ..!

శాస‌న మండ‌లిలో ఏం జ‌రుగుతోందో ఎవ‌రికీ తెలియ‌డం లేదా? వైసీపీ త‌ర‌ఫున గతంలో మండ‌లిలో చ‌క్రం తిప్పిన నాయ‌కులు.. త‌ర్వాత రాజీనామాలు స‌మ‌ర్పించినా.. వీటిని ఆమోదించాల్సిన మండ‌లి చైర్మ‌న్ కొయ్యే మోష‌న్ రాజు ఇప్ప‌టికీ వాటిని అనుమ‌తించ‌లేదు. దీంతో రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీ లు త్రిశంకు స్వ‌ర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్ప‌టికి న‌లుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. వీరు త‌మ ప‌ద‌వుల‌ను వ‌దులుకుని.. నాలుగు మాసాలు కూడా దాటింది.

అయితే.. వీరు అటు ఇటు ఎటూ కాకుండా పోవ‌డం గ‌మ‌నార్హం. రాజీనామాలు ఆమోదిస్తే.. వేరే పార్టీలోకి వెళ్లి.. అక్క‌డ నామినేటెడ్ ప‌ద‌వులు అయినా ద‌క్కించుకోవాల‌ని వీరు చూస్తున్నారు. కానీ, చైర్మ‌న్ మాత్రం వీటిపై సంత‌కాలు చేయ‌డం లేదు. పోనీ.. స‌భ‌కు వెళ్లాలి.. కాసేపు ఏదో ఒక ర‌కంగా.. స‌భ‌లో ఉండాల‌ని అనుకుంటే.. అలా కూడా అవ‌కాశం కోల్పోయారు. “మీరు మీ ప‌ద‌వులకు రాజీనామా చేసినందున‌.. మండ‌లి కార్య‌క్ర‌మాల్లో నేరుగా పాల్గొనే అవ‌కాశం లేదు” అని అధికారులు తేల్చి చెబుతున్నారు.

దీంతో ప్ర‌స్తుతం వైసీపీకి రాజీనామాలు చేసిన న‌లుగురు ఎమ్మెల్సీలు బ‌ల్లి క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, పోతుల సునీత‌, క‌ర్రి ప‌ద్మ‌శ్రీ, జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ‌లు గ్యాల‌రీల‌కే ప‌రిమితం అవుతున్నారు. ఇదిలావుంటే.. రాజీనామాలు చేసిన వారికి నిర్ణీత స‌మ‌యంలోగా.. నిర్ణ‌యం వెలువ‌రించాల్సిన బాధ్య‌త మండ‌లి చైర్మ‌న్ పై ఉన్న‌ప్ప‌టికీ.. అది ఆయ‌న స్వేచ్ఛ‌కు ప‌రిమిత‌మైన వ్య‌వ‌హారం. దీంతో ఎవ‌రూ కొశ్చ‌న్ చేయాల్సిన అవ‌కా శం లేకుండా పోయింది.

అయితే.. న్యాయ‌పోరాటం చేయొచ్చు. కానీ, ఆదిశ‌గా అడుగులు వేస్తే.. ఇబ్బంది త‌ప్ప‌ద‌న్నఆలోచ‌న‌తో వైసీపీ రిజైన్డ్ ఎమ్మెల్సీలు ఉన్నారు. మ‌రోవైపు.. రాష్ట్రంలో నామినేటెడ్ ప‌ద‌వులు కూడా ఫిల్ అవుతున్నా యి. దీంతో మ‌రింత గంద‌ర‌గోళంలోనే ఉన్నారు. వీరు రాజీనామాలు చేసి ఇత‌ర పార్టీల్లో చేరినా.. తిరిగి వారికి ఆయా స్థానాలు ద‌క్కుతాయా? ద‌క్క‌వా? అనేది మ‌రో కీల‌క సందేహంగా మారింది. దీంతో వీరంతా త్రిశంకు స్వ‌ర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on March 24, 2025 10:48 am

Share
Show comments
Published by
Satya
Tags: YCP MLCs

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

39 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago