శాసన మండలిలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదా? వైసీపీ తరఫున గతంలో మండలిలో చక్రం తిప్పిన నాయకులు.. తర్వాత రాజీనామాలు సమర్పించినా.. వీటిని ఆమోదించాల్సిన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఇప్పటికీ వాటిని అనుమతించలేదు. దీంతో రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీ లు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికి నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. వీరు తమ పదవులను వదులుకుని.. నాలుగు మాసాలు కూడా దాటింది.
అయితే.. వీరు అటు ఇటు ఎటూ కాకుండా పోవడం గమనార్హం. రాజీనామాలు ఆమోదిస్తే.. వేరే పార్టీలోకి వెళ్లి.. అక్కడ నామినేటెడ్ పదవులు అయినా దక్కించుకోవాలని వీరు చూస్తున్నారు. కానీ, చైర్మన్ మాత్రం వీటిపై సంతకాలు చేయడం లేదు. పోనీ.. సభకు వెళ్లాలి.. కాసేపు ఏదో ఒక రకంగా.. సభలో ఉండాలని అనుకుంటే.. అలా కూడా అవకాశం కోల్పోయారు. “మీరు మీ పదవులకు రాజీనామా చేసినందున.. మండలి కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేదు” అని అధికారులు తేల్చి చెబుతున్నారు.
దీంతో ప్రస్తుతం వైసీపీకి రాజీనామాలు చేసిన నలుగురు ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణలు గ్యాలరీలకే పరిమితం అవుతున్నారు. ఇదిలావుంటే.. రాజీనామాలు చేసిన వారికి నిర్ణీత సమయంలోగా.. నిర్ణయం వెలువరించాల్సిన బాధ్యత మండలి చైర్మన్ పై ఉన్నప్పటికీ.. అది ఆయన స్వేచ్ఛకు పరిమితమైన వ్యవహారం. దీంతో ఎవరూ కొశ్చన్ చేయాల్సిన అవకా శం లేకుండా పోయింది.
అయితే.. న్యాయపోరాటం చేయొచ్చు. కానీ, ఆదిశగా అడుగులు వేస్తే.. ఇబ్బంది తప్పదన్నఆలోచనతో వైసీపీ రిజైన్డ్ ఎమ్మెల్సీలు ఉన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు కూడా ఫిల్ అవుతున్నా యి. దీంతో మరింత గందరగోళంలోనే ఉన్నారు. వీరు రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరినా.. తిరిగి వారికి ఆయా స్థానాలు దక్కుతాయా? దక్కవా? అనేది మరో కీలక సందేహంగా మారింది. దీంతో వీరంతా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 24, 2025 10:48 am
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…