Political News

డీలిమిటేష‌న్‌.. ద‌క్షిణాదికి న‌ష్ట‌మే: కేశినేని నాని

దేశంలో డీలిమిటేష‌న్ జ‌రిగితే(పార్ల‌మెంటు స్థానాల పున‌ర్విభ‌జ‌న‌) అది ద‌క్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ ల‌కు తీవ్ర న‌ష్టం తెస్తుంద‌ని మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయ‌కుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న త‌న ఫేస్ బుక్‌లో సుదీర్ఘ పోస్టు చేశారు. ప్ర‌పంచ‌ దేశాల్లో జ‌రిగిన డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ‌ను కూడా ఉద‌హ‌రించారు. పొరుగున ఉన్న పాకిస్థాన్‌, అమెరికా దేశాలు స‌హా ఇత‌ర దేశాల్లో జ‌రిగిన డీలిమిటేష‌న్ కార‌ణంగా.. ఆయా దేశాల్లోని రాష్ట్రాలు ఎలా న‌ష్ట‌పోయిందీ వివ‌రించారు. ఇదే విధానం పాటిస్తే.. దేశంలోని ద‌క్షిణాది రాష్ట్రాలు కూడా న‌ష్ట‌పోతాయ‌న్నారు.

జ‌నాభా ప్రాతిప‌దిక‌న డీలిమిటేష‌న్ చేయ‌డం స‌రికాద‌న్న నాని.. ఈ విధాన‌మే గ‌తంలోనూ అవ‌లంబించారు కాబ‌ట్టి.. ఇప్పుడు దీనిని మార్చి నూత‌న విధానాన్ని అనుస‌రించాల‌ని సూచించారు. ప్రాంతాల వారీగా డిలిమిటేష‌న్‌ను అమ‌లు చేయాల‌ని మాజీ ఎంపీ సూచించారు. త‌ద్వారా.. నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌భావం ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చ‌న్నారు. జ‌నాభా నియంత్ర‌ణ విష‌యానికి వ‌స్తే..ఉత్త‌రాది రాష్ట్రాలు అస‌లు ప‌ట్టించుకోలేద‌న్నారు. కానీ, ద‌క్షిణాది రాష్ట్రాల్లో ప‌లు ప‌థ‌కాలుపెట్టి మ‌రీ.. జ‌నాభా నియంత్ర‌ణను అమ‌లు చేశార‌ని.. తెలిపారు. ఇది ఇప్పుడు ఆయా రాష్ట్రాల‌కు శ‌రాఘాతంగా మారింద‌ని చెప్పారు.

ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్కారం చేసేందుకు కొన్నాళ్లు వెయిట్ చేయ‌డం.. లేదా జ‌నాభా ప్రాతిప‌దిక‌న కాకుండా నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జ‌న చేయాల్సి ఉండ‌డం వంటి రెండే మార్గాలు అందుబాటులో ఉన్నాయ‌ని కేశినేని నాని తెలిపారు. అధిక‌ జనాభా ఉన్న బీహార్‌, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు అధిక సీట్లు పొందే అవకాశం ఉందని, ఇది న్యాయం కాద‌ని చెప్పారు. జ‌నాభా నియంత్ర‌ణ‌, సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారించిన ద‌క్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడాలా? అని ప్ర‌శ్నించారు. దీనిపై అన్ని ప‌క్షాలు క‌లిసి రాక‌పోవ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు. ఇది రాజ‌కీయ అజెండాగా కాకుండా.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల అజెండాగా మార్చుకుని.. ప్ర‌భుత్వాలు, పార్టీలు వ్యూహాత్మ‌క అడుగులు వేయాల‌ని ఆయ‌న సూచించారు.

This post was last modified on March 24, 2025 10:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

37 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago