దేశంలో డీలిమిటేషన్ జరిగితే(పార్లమెంటు స్థానాల పునర్విభజన) అది దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ లకు తీవ్ర నష్టం తెస్తుందని మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయకుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన తన ఫేస్ బుక్లో సుదీర్ఘ పోస్టు చేశారు. ప్రపంచ దేశాల్లో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియను కూడా ఉదహరించారు. పొరుగున ఉన్న పాకిస్థాన్, అమెరికా దేశాలు సహా ఇతర దేశాల్లో జరిగిన డీలిమిటేషన్ కారణంగా.. ఆయా దేశాల్లోని రాష్ట్రాలు ఎలా నష్టపోయిందీ వివరించారు. ఇదే విధానం పాటిస్తే.. దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు కూడా నష్టపోతాయన్నారు.
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సరికాదన్న నాని.. ఈ విధానమే గతంలోనూ అవలంబించారు కాబట్టి.. ఇప్పుడు దీనిని మార్చి నూతన విధానాన్ని అనుసరించాలని సూచించారు. ప్రాంతాల వారీగా డిలిమిటేషన్ను అమలు చేయాలని మాజీ ఎంపీ సూచించారు. తద్వారా.. నియోజకవర్గాలపై ప్రభావం పడకుండా చూసుకోవచ్చన్నారు. జనాభా నియంత్రణ విషయానికి వస్తే..ఉత్తరాది రాష్ట్రాలు అసలు పట్టించుకోలేదన్నారు. కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో పలు పథకాలుపెట్టి మరీ.. జనాభా నియంత్రణను అమలు చేశారని.. తెలిపారు. ఇది ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు శరాఘాతంగా మారిందని చెప్పారు.
ఈ సమస్యను పరిష్కారం చేసేందుకు కొన్నాళ్లు వెయిట్ చేయడం.. లేదా జనాభా ప్రాతిపదికన కాకుండా నియోజకవర్గాలను పునర్విభజన చేయాల్సి ఉండడం వంటి రెండే మార్గాలు అందుబాటులో ఉన్నాయని కేశినేని నాని తెలిపారు. అధిక జనాభా ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు అధిక సీట్లు పొందే అవకాశం ఉందని, ఇది న్యాయం కాదని చెప్పారు. జనాభా నియంత్రణ, సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారించిన దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడాలా? అని ప్రశ్నించారు. దీనిపై అన్ని పక్షాలు కలిసి రాకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ అజెండాగా కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాల అజెండాగా మార్చుకుని.. ప్రభుత్వాలు, పార్టీలు వ్యూహాత్మక అడుగులు వేయాలని ఆయన సూచించారు.
This post was last modified on March 24, 2025 10:33 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…