దేశంలో డీలిమిటేషన్ జరిగితే(పార్లమెంటు స్థానాల పునర్విభజన) అది దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ లకు తీవ్ర నష్టం తెస్తుందని మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయకుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన తన ఫేస్ బుక్లో సుదీర్ఘ పోస్టు చేశారు. ప్రపంచ దేశాల్లో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియను కూడా ఉదహరించారు. పొరుగున ఉన్న పాకిస్థాన్, అమెరికా దేశాలు సహా ఇతర దేశాల్లో జరిగిన డీలిమిటేషన్ కారణంగా.. ఆయా దేశాల్లోని రాష్ట్రాలు ఎలా నష్టపోయిందీ వివరించారు. ఇదే విధానం పాటిస్తే.. దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు కూడా నష్టపోతాయన్నారు.
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సరికాదన్న నాని.. ఈ విధానమే గతంలోనూ అవలంబించారు కాబట్టి.. ఇప్పుడు దీనిని మార్చి నూతన విధానాన్ని అనుసరించాలని సూచించారు. ప్రాంతాల వారీగా డిలిమిటేషన్ను అమలు చేయాలని మాజీ ఎంపీ సూచించారు. తద్వారా.. నియోజకవర్గాలపై ప్రభావం పడకుండా చూసుకోవచ్చన్నారు. జనాభా నియంత్రణ విషయానికి వస్తే..ఉత్తరాది రాష్ట్రాలు అసలు పట్టించుకోలేదన్నారు. కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో పలు పథకాలుపెట్టి మరీ.. జనాభా నియంత్రణను అమలు చేశారని.. తెలిపారు. ఇది ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు శరాఘాతంగా మారిందని చెప్పారు.
ఈ సమస్యను పరిష్కారం చేసేందుకు కొన్నాళ్లు వెయిట్ చేయడం.. లేదా జనాభా ప్రాతిపదికన కాకుండా నియోజకవర్గాలను పునర్విభజన చేయాల్సి ఉండడం వంటి రెండే మార్గాలు అందుబాటులో ఉన్నాయని కేశినేని నాని తెలిపారు. అధిక జనాభా ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు అధిక సీట్లు పొందే అవకాశం ఉందని, ఇది న్యాయం కాదని చెప్పారు. జనాభా నియంత్రణ, సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారించిన దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడాలా? అని ప్రశ్నించారు. దీనిపై అన్ని పక్షాలు కలిసి రాకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ అజెండాగా కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాల అజెండాగా మార్చుకుని.. ప్రభుత్వాలు, పార్టీలు వ్యూహాత్మక అడుగులు వేయాలని ఆయన సూచించారు.
This post was last modified on March 24, 2025 10:33 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…