దేశంలో డీలిమిటేషన్ జరిగితే(పార్లమెంటు స్థానాల పునర్విభజన) అది దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ లకు తీవ్ర నష్టం తెస్తుందని మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయకుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన తన ఫేస్ బుక్లో సుదీర్ఘ పోస్టు చేశారు. ప్రపంచ దేశాల్లో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియను కూడా ఉదహరించారు. పొరుగున ఉన్న పాకిస్థాన్, అమెరికా దేశాలు సహా ఇతర దేశాల్లో జరిగిన డీలిమిటేషన్ కారణంగా.. ఆయా దేశాల్లోని రాష్ట్రాలు ఎలా నష్టపోయిందీ వివరించారు. ఇదే విధానం పాటిస్తే.. దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు కూడా నష్టపోతాయన్నారు.
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సరికాదన్న నాని.. ఈ విధానమే గతంలోనూ అవలంబించారు కాబట్టి.. ఇప్పుడు దీనిని మార్చి నూతన విధానాన్ని అనుసరించాలని సూచించారు. ప్రాంతాల వారీగా డిలిమిటేషన్ను అమలు చేయాలని మాజీ ఎంపీ సూచించారు. తద్వారా.. నియోజకవర్గాలపై ప్రభావం పడకుండా చూసుకోవచ్చన్నారు. జనాభా నియంత్రణ విషయానికి వస్తే..ఉత్తరాది రాష్ట్రాలు అసలు పట్టించుకోలేదన్నారు. కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో పలు పథకాలుపెట్టి మరీ.. జనాభా నియంత్రణను అమలు చేశారని.. తెలిపారు. ఇది ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు శరాఘాతంగా మారిందని చెప్పారు.
ఈ సమస్యను పరిష్కారం చేసేందుకు కొన్నాళ్లు వెయిట్ చేయడం.. లేదా జనాభా ప్రాతిపదికన కాకుండా నియోజకవర్గాలను పునర్విభజన చేయాల్సి ఉండడం వంటి రెండే మార్గాలు అందుబాటులో ఉన్నాయని కేశినేని నాని తెలిపారు. అధిక జనాభా ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు అధిక సీట్లు పొందే అవకాశం ఉందని, ఇది న్యాయం కాదని చెప్పారు. జనాభా నియంత్రణ, సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారించిన దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడాలా? అని ప్రశ్నించారు. దీనిపై అన్ని పక్షాలు కలిసి రాకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ అజెండాగా కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాల అజెండాగా మార్చుకుని.. ప్రభుత్వాలు, పార్టీలు వ్యూహాత్మక అడుగులు వేయాలని ఆయన సూచించారు.
వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత…
విదేశాలకు వెళ్లాలన్నా, మన జాతీయతను నిరూపించుకోవాలన్నా పాస్పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. అయితే ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన…
వారణాసి మళ్ళీ వార్తల్లోకి వచ్చేసింది. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పిన కొన్ని విషయాలు…
కొన్నేళ్ల ముందు వరకు తెలుగులో రాశి ఖన్నా కెరీర్ మంచి ఊపులో ఉండేది. జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు స్టార్…
గాయని సునీత అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర, జానకి లాంటి సీనియర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న టైంలో…
కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన దాదాపు ఖరారైన నేపథ్యంలో ఏపీ నుంచి మరో ఇద్దరు ఎంపీలకు మంత్రి యోగం పట్టనుందని టీడీపీ…