Political News

‘అనంత’లో జేసీ… ‘గోదారి’లో ఆర్ఆర్ఆర్

రాజకీయాల్లో కొందరు నేతల తీరు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు అన్నింటా ముందుండాలని కోరుకోని నేత ఉండరు గానీ… ఆ దిశగా మనమే అడుగులు ఎందకు వేయకూడదు అని భావించే వారు మాత్రం అరుదే. అలాంటి వారిలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అందరికంటే ముందు ఉంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఉండి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణ రాజు కూడా చేరిపోయారు.

పల్లెలు పట్టణీకరణ దిశగా సాగుతున్నాయి. పల్లెల్లోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెరుగుతోంది. ఇందులో చెత్త సేకరణ అన్నది కీలక భూమిక పోషిస్తోంది. చెత్తను ఇష్టానుసారంగా పడేస్తే…పారిశుద్ధ్యం అన్నదే కనపడదు. ఇదే విషయాన్ని చాలా కాలం క్రితమే చెప్పిన జేసీ… తాడిపత్రిలో చెత్త సేకరణను ఆయన ఓ ఉద్యమంలా చేపట్టారు. చెత్త సేకరణతో పాటు మునిసిపల్ చట్టాలను పక్కాగా అమలు చేస్తూ… తాడిపత్రిని అభివృద్ధి బాటలో నడిపే దిశగా ఆయన కీలక చర్యలకే శ్రీకారం చుట్టారు. అందులో చెత్తను ఎక్కడ పడితే అక్కడ విసిరివేసే వారిపై జరిమానాలు వేస్తామంటూ కూడా ఆయన గతంలో ఓ కండీషన్ పెట్టారు.

తాజాగా రఘురామకృష్ణరాజు కూడా తన నియోజకవర్గం ఉండి పరిదిలో ఈ తరహాలోనే ఓ కొత్త నిబంధనను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉగాది నుంచి చెత్తను చెత్త సేకరణ వాహనాల్లో కాకుండా పంట కాలువల్లో పడేసే వారిని ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. తన మాటను ధిక్కరించి… చెత్తను పంట కాలువలో పడేసే వారిపై రూ.1,000 జరిమానాను విధిస్తామని ఆయన హెచ్చరించారు. ఇలా పోగయ్యే నిధులతో కెనాల్ డెవలప్ మెంట్ ఫండ్ పేరిట ఓ నిధిని ఏర్పాటు చేసి ఆ నిధులతో పంట కాలువలను శుభ్రం చేయడానికి వినియోగిస్తామని ఆయన తెలిపారు. అయితే ఏ ఒక్కరు కూడా పంట కాలువల్లో చెత్తను వేసి ఈ జరిమానాను కట్టాలని తాను కోరుకోవడం లేదని…పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న భావనతోనే ఈ నిబంధన పెడుతున్నట్లు ఆయన సెలవిచ్చారు.

This post was last modified on March 23, 2025 10:03 pm

Share

Recent Posts

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

3 hours ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

3 hours ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

3 hours ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

7 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

7 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

8 hours ago