వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజినీ ఇప్పుడు పెను కష్టాల్లో చిక్కుకున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడులోని ఓ స్టోన్ క్రషింగ్ కంపెనీని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై రజినీ, ఆమె మరిది గోపి, ఈ దందాలో ఆమెకు సహకరించిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, వ్యవహారాన్ని గుట్టుగా నడిపిన రజినీ పీఏలపై ఏసీబీ శనివారం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై తాజాగా రజినీ ఘాటుగా స్పందించారు.
కేసు గురించి ఆదివారం ఉదయం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్బంగా తనపై కూటమి సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని రజినీ ఆరోపించారు. బీసీ వర్గానికి చెందిన ఓ మహిళను అయిన తాను రాజకీయంగా ఎదుగుతూ ఉంటే… కూటమి నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని కూడా ఆమె ఆరోపించారు. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండానే ఏసీబీ కేసులు నమోదు చేశారంటూ ఆమె ఆరోపించారు. ఇలాంటి వంద కేసులు పెట్టినా భయపడేది లేదన్న రజినీ… ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు.
అనంతరం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి రజినీ… ఆదివారం మధ్యాహ్నం ఓ ఆసక్తికర పోస్టును పెట్టారు. ఈ పోస్టులో ఒకింత కవితాత్మకతను జోడించిన రజినీ… కూటమి సర్కారుపై ప్రత్యక్ష యుద్ధాన్నే ప్రకటించారని చెప్పక తప్పదు. ”మనో ధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు… వ్యక్తిత్వాన్ని హరించాలని కుయుక్తులు.. ఒక మహిళనైన నాపై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే… అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి సిద్ధం. నా ధైర్యం నా నిజాయితీ. నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం. నేను ఎదురుచూస్తూ ఉంటా. నిజం బయటపడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి…” అంటూ సదరు పోస్టులో ఆమె పేర్కొన్నారు.
This post was last modified on March 23, 2025 3:24 pm
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…