Political News

కుట్రలు, కుతంత్రాలు… ఏసీబీ కేసుపై రజినీ ఫైరింగ్

వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజినీ ఇప్పుడు పెను కష్టాల్లో చిక్కుకున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడులోని ఓ స్టోన్ క్రషింగ్ కంపెనీని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై రజినీ, ఆమె మరిది గోపి, ఈ దందాలో ఆమెకు సహకరించిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, వ్యవహారాన్ని గుట్టుగా నడిపిన రజినీ పీఏలపై ఏసీబీ శనివారం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై తాజాగా రజినీ ఘాటుగా స్పందించారు.

కేసు గురించి ఆదివారం ఉదయం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్బంగా తనపై కూటమి సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని రజినీ ఆరోపించారు. బీసీ వర్గానికి చెందిన ఓ మహిళను అయిన తాను రాజకీయంగా ఎదుగుతూ ఉంటే… కూటమి నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని కూడా ఆమె ఆరోపించారు. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండానే ఏసీబీ కేసులు నమోదు చేశారంటూ ఆమె ఆరోపించారు. ఇలాంటి వంద కేసులు పెట్టినా భయపడేది లేదన్న రజినీ… ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు.

అనంతరం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి రజినీ… ఆదివారం మధ్యాహ్నం ఓ ఆసక్తికర పోస్టును పెట్టారు. ఈ పోస్టులో ఒకింత కవితాత్మకతను జోడించిన రజినీ… కూటమి సర్కారుపై ప్రత్యక్ష యుద్ధాన్నే ప్రకటించారని చెప్పక తప్పదు. ”మనో ధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు… వ్యక్తిత్వాన్ని హరించాలని కుయుక్తులు.. ఒక మహిళనైన నాపై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే… అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి సిద్ధం. నా ధైర్యం నా నిజాయితీ. నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం. నేను ఎదురుచూస్తూ ఉంటా. నిజం బయటపడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి…” అంటూ సదరు పోస్టులో ఆమె పేర్కొన్నారు.

This post was last modified on March 23, 2025 3:24 pm

Share

Recent Posts

అప్పుడు ప్రభాస్‌… ఇప్పుడు యష్!

బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత హీరో ప్రభాస్ ఒక ఇంట్రెస్టింగ్ కెరీర్ ఫేజ్ చూశాడు. ఒక టాప్ డైరెక్టర్ క్రియేట్ చేసిన…

2 hours ago

యానిమల్ పార్క్… ఇంకెంత దూరం?

రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…

7 hours ago

తమన్ సమాజ సేవకు 12 కోట్ల టార్గెట్

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…

7 hours ago

చివరి సిక్సర్ కోసం కనకరాజు పోరాటం

వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…

8 hours ago

గుజరాత్ ను వణికిస్తున్న చండీపుర…. 25 పిల్లలు బలి

గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…

9 hours ago

జనసేనలో వుండాలంటే బూతులు మానాలి

కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…

9 hours ago