Political News

కుట్రలు, కుతంత్రాలు… ఏసీబీ కేసుపై రజినీ ఫైరింగ్

వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజినీ ఇప్పుడు పెను కష్టాల్లో చిక్కుకున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడులోని ఓ స్టోన్ క్రషింగ్ కంపెనీని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై రజినీ, ఆమె మరిది గోపి, ఈ దందాలో ఆమెకు సహకరించిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, వ్యవహారాన్ని గుట్టుగా నడిపిన రజినీ పీఏలపై ఏసీబీ శనివారం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై తాజాగా రజినీ ఘాటుగా స్పందించారు.

కేసు గురించి ఆదివారం ఉదయం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్బంగా తనపై కూటమి సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని రజినీ ఆరోపించారు. బీసీ వర్గానికి చెందిన ఓ మహిళను అయిన తాను రాజకీయంగా ఎదుగుతూ ఉంటే… కూటమి నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని కూడా ఆమె ఆరోపించారు. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండానే ఏసీబీ కేసులు నమోదు చేశారంటూ ఆమె ఆరోపించారు. ఇలాంటి వంద కేసులు పెట్టినా భయపడేది లేదన్న రజినీ… ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు.

అనంతరం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి రజినీ… ఆదివారం మధ్యాహ్నం ఓ ఆసక్తికర పోస్టును పెట్టారు. ఈ పోస్టులో ఒకింత కవితాత్మకతను జోడించిన రజినీ… కూటమి సర్కారుపై ప్రత్యక్ష యుద్ధాన్నే ప్రకటించారని చెప్పక తప్పదు. ”మనో ధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు… వ్యక్తిత్వాన్ని హరించాలని కుయుక్తులు.. ఒక మహిళనైన నాపై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే… అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి సిద్ధం. నా ధైర్యం నా నిజాయితీ. నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం. నేను ఎదురుచూస్తూ ఉంటా. నిజం బయటపడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి…” అంటూ సదరు పోస్టులో ఆమె పేర్కొన్నారు.

This post was last modified on March 23, 2025 3:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

21 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago