Political News

‘విశాఖ’ కూడా వైసీపీ చేజారిపోయింది!

ఏపీలో విపక్షం వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు దక్కడం, ఆ తర్వాత పార్టీలో కీలక నేతలంతా క్యూ కట్టి బయటకు వెళ్లిపోతుండటం… అప్పటిదాకా తమ పాలనలో ఉన్న స్థానిక సంస్థలన్నీ ఒక్కొక్కటిగానే చేజారుతుండటంతో అసలు వైసీపీకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. ఇలాంటి నేపథ్యంలో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కూడా వైసీపీ చేజారిపోయేందుకు రంగం సిద్ధమైంది. జీవీఎంసీ పాలక వర్గంలో వైసీపీకి పెద్దగా మెజారిటీ లేకున్నా…ఎలాగోలా నెట్టుకువస్తోంది. అయితే శనివారం జీవీఎంసీ మేయర్ పై కూటమి పక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి.

జీవీఎంసీకి 2021లో ఎన్నికలు జరగగా… మొత్తం 98 సీట్లకు నాడు అధికారంలో ఉన్న వైసీపీ 59 సీట్లను గెలిచింది. నగరంలో గట్టి పట్టున్న టీడీపీ 29 సీట్లకు పరిమతం కాగా… జనసేన 3 సీట్లు…బీజేపీ, సీపీఐ, సీపీఎంలు ఒక్కో సీటు, స్వతంత్రులు 4 సీట్లలో విజయం సాదించారు. వెరసి వైసీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని దానిపై గొలగాని హరి వెంకట కుమారిని కూర్చోబెట్టింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడికక్కడ వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమి పార్టీలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిపోతున్నారు. జీవీఎంసీ పరిదిలోనూ ఇదే జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీల బలం నాడు 33 సీట్లకే పరిమితం కాగా ఇప్పుడు ఆ బలం ఏకంగా 70కి చేరిపోయింది.

ఇంకేముంది…ఆ 70 మంది కార్పొరేటర్లు, ఎక్స్ అఫీసియో సభ్యులతో కలిసి శనివారం జీవీఎంసీ ఇంచార్జీ కమిషనర్ గా ఉన్న విశాఖ జిల్లా కలెక్టర్ ను కలిశారు. మేయర్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలనుకుంటున్నామని వారు ఓ అర్జీని ఆయనకు అందించారు. దానిపై 70 మంది కార్పొరేటర్ల సంతకాలు, ఎక్ష్ అఫీసియో సభ్యుల సంతకాలు పెట్టి మరీ అందించారు. ఈ వినతి పత్రాన్ని పరిశీలించిన కలెక్టర్.. త్వరలోనే దానిని పరిశీలించి అందుకు అనుగుణమైన చర్యలు చేపడతామని తెలిపారు. జీవీఎంసీలో మొత్తం సభ్యుల సంఖ్య 98 కాగా… 70 మంది అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే… దానిని తిరస్కరించే ఛాన్సే లేదు. అంటే… తీర్మానం ప్రవేశపెట్టడం, వైసీపీ నుంచి జీవీఎంసీ పగ్గాలు కూటమికి దక్కడం ఖాయమేనన్నమాట.

This post was last modified on March 23, 2025 11:10 am

Share
Show comments
Published by
Satya
Tags: Vizag YCP

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

23 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago