Political News

‘విశాఖ’ కూడా వైసీపీ చేజారిపోయింది!

ఏపీలో విపక్షం వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు దక్కడం, ఆ తర్వాత పార్టీలో కీలక నేతలంతా క్యూ కట్టి బయటకు వెళ్లిపోతుండటం… అప్పటిదాకా తమ పాలనలో ఉన్న స్థానిక సంస్థలన్నీ ఒక్కొక్కటిగానే చేజారుతుండటంతో అసలు వైసీపీకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. ఇలాంటి నేపథ్యంలో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కూడా వైసీపీ చేజారిపోయేందుకు రంగం సిద్ధమైంది. జీవీఎంసీ పాలక వర్గంలో వైసీపీకి పెద్దగా మెజారిటీ లేకున్నా…ఎలాగోలా నెట్టుకువస్తోంది. అయితే శనివారం జీవీఎంసీ మేయర్ పై కూటమి పక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి.

జీవీఎంసీకి 2021లో ఎన్నికలు జరగగా… మొత్తం 98 సీట్లకు నాడు అధికారంలో ఉన్న వైసీపీ 59 సీట్లను గెలిచింది. నగరంలో గట్టి పట్టున్న టీడీపీ 29 సీట్లకు పరిమతం కాగా… జనసేన 3 సీట్లు…బీజేపీ, సీపీఐ, సీపీఎంలు ఒక్కో సీటు, స్వతంత్రులు 4 సీట్లలో విజయం సాదించారు. వెరసి వైసీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని దానిపై గొలగాని హరి వెంకట కుమారిని కూర్చోబెట్టింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడికక్కడ వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమి పార్టీలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిపోతున్నారు. జీవీఎంసీ పరిదిలోనూ ఇదే జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీల బలం నాడు 33 సీట్లకే పరిమితం కాగా ఇప్పుడు ఆ బలం ఏకంగా 70కి చేరిపోయింది.

ఇంకేముంది…ఆ 70 మంది కార్పొరేటర్లు, ఎక్స్ అఫీసియో సభ్యులతో కలిసి శనివారం జీవీఎంసీ ఇంచార్జీ కమిషనర్ గా ఉన్న విశాఖ జిల్లా కలెక్టర్ ను కలిశారు. మేయర్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలనుకుంటున్నామని వారు ఓ అర్జీని ఆయనకు అందించారు. దానిపై 70 మంది కార్పొరేటర్ల సంతకాలు, ఎక్ష్ అఫీసియో సభ్యుల సంతకాలు పెట్టి మరీ అందించారు. ఈ వినతి పత్రాన్ని పరిశీలించిన కలెక్టర్.. త్వరలోనే దానిని పరిశీలించి అందుకు అనుగుణమైన చర్యలు చేపడతామని తెలిపారు. జీవీఎంసీలో మొత్తం సభ్యుల సంఖ్య 98 కాగా… 70 మంది అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే… దానిని తిరస్కరించే ఛాన్సే లేదు. అంటే… తీర్మానం ప్రవేశపెట్టడం, వైసీపీ నుంచి జీవీఎంసీ పగ్గాలు కూటమికి దక్కడం ఖాయమేనన్నమాట.

This post was last modified on March 23, 2025 11:10 am

Share
Show comments
Published by
Satya
Tags: Vizag YCP

Recent Posts

మార్కో అంద‌రినీ చెడగొట్టేసాడా?

గ‌త ఏడాది మ‌ల‌యాళంలో ఎవ్వ‌రూ ఊహించ‌ని స్థాయిలో భారీ హిట్ అయింది మార్కో మూవీ. తెలుగులో జ‌న‌తా గ్యారేజ్, భాగ‌మ‌తి…

52 minutes ago

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…

6 hours ago

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

12 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

15 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

17 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

18 hours ago