ఏపీలో విపక్షం వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు దక్కడం, ఆ తర్వాత పార్టీలో కీలక నేతలంతా క్యూ కట్టి బయటకు వెళ్లిపోతుండటం… అప్పటిదాకా తమ పాలనలో ఉన్న స్థానిక సంస్థలన్నీ ఒక్కొక్కటిగానే చేజారుతుండటంతో అసలు వైసీపీకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. ఇలాంటి నేపథ్యంలో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కూడా వైసీపీ చేజారిపోయేందుకు రంగం సిద్ధమైంది. జీవీఎంసీ పాలక వర్గంలో వైసీపీకి పెద్దగా మెజారిటీ లేకున్నా…ఎలాగోలా నెట్టుకువస్తోంది. అయితే శనివారం జీవీఎంసీ మేయర్ పై కూటమి పక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి.
జీవీఎంసీకి 2021లో ఎన్నికలు జరగగా… మొత్తం 98 సీట్లకు నాడు అధికారంలో ఉన్న వైసీపీ 59 సీట్లను గెలిచింది. నగరంలో గట్టి పట్టున్న టీడీపీ 29 సీట్లకు పరిమతం కాగా… జనసేన 3 సీట్లు…బీజేపీ, సీపీఐ, సీపీఎంలు ఒక్కో సీటు, స్వతంత్రులు 4 సీట్లలో విజయం సాదించారు. వెరసి వైసీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని దానిపై గొలగాని హరి వెంకట కుమారిని కూర్చోబెట్టింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడికక్కడ వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమి పార్టీలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిపోతున్నారు. జీవీఎంసీ పరిదిలోనూ ఇదే జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీల బలం నాడు 33 సీట్లకే పరిమితం కాగా ఇప్పుడు ఆ బలం ఏకంగా 70కి చేరిపోయింది.
ఇంకేముంది…ఆ 70 మంది కార్పొరేటర్లు, ఎక్స్ అఫీసియో సభ్యులతో కలిసి శనివారం జీవీఎంసీ ఇంచార్జీ కమిషనర్ గా ఉన్న విశాఖ జిల్లా కలెక్టర్ ను కలిశారు. మేయర్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలనుకుంటున్నామని వారు ఓ అర్జీని ఆయనకు అందించారు. దానిపై 70 మంది కార్పొరేటర్ల సంతకాలు, ఎక్ష్ అఫీసియో సభ్యుల సంతకాలు పెట్టి మరీ అందించారు. ఈ వినతి పత్రాన్ని పరిశీలించిన కలెక్టర్.. త్వరలోనే దానిని పరిశీలించి అందుకు అనుగుణమైన చర్యలు చేపడతామని తెలిపారు. జీవీఎంసీలో మొత్తం సభ్యుల సంఖ్య 98 కాగా… 70 మంది అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే… దానిని తిరస్కరించే ఛాన్సే లేదు. అంటే… తీర్మానం ప్రవేశపెట్టడం, వైసీపీ నుంచి జీవీఎంసీ పగ్గాలు కూటమికి దక్కడం ఖాయమేనన్నమాట.
This post was last modified on March 23, 2025 11:10 am
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…