విశాఖపట్టణంలోని సుందర తీరం రిషికొండ బీచ్ కు తిరిగి బ్లూఫాగ్ గుర్తింపు దక్కింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఈ బీచ్ కు బ్లూఫాగ్ గుర్తింపును పునరుద్ధరించడంలో ఏపీలోని కూటమి సర్కారు వేగంగా చర్యలు చేపట్టిందని చెప్పక తప్పదు. బ్లూఫాగ్ సర్టిఫికెట్ అంటేనే… అదో ప్రత్యేక గుర్తింపు కిందే లెక్క. ఈ గుర్తింపు ఉన్న బీచ్ లకు విదేశీ పర్యాటకుల తాకిడి భారీగా ఉంటుంది. ఫలితంగా ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. మరి విదేశీ, సంపన్న పర్యాటకులను రాబట్టాలంటే… ఆ బీచ్ లను ఏ రీతిన నిర్వహించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.
గతంలో రిషికొండ బీచ్ లో ఏపీ సర్కారు చేపట్టిన పరిశుభ్రత, ఇతర భద్రతా చర్యలను పరిశీలించిన డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఏఏ)… బీచ్ కు బ్లూఫాగ్ గుర్తింపును కేటాయించింది. ఈ గుర్తింపు కింద ఆ సంస్థ అందజేసే ఓ బ్లూ జెండాను బీచ్ ఎంట్రెన్స్ లోనే ప్రదర్శిస్తారు. అయితే ఇటీవల బీచ్ నిర్వహణలో స్థానిక పర్యాటక శాఖ అధికారులు అంతగా దృష్టి సారించినట్లు లేరు. బీచ్ లో పరిశుభ్రత కనిపించకపోగా.. మరుగు దొడ్ల నిర్వహణ కూడా సరిగా లేదట. అంతేకాకుండా బీచ్ లో వీధి కుక్కల స్వైర విహారం బాగా పెరిగిపోయిందట. దీంతో ఈ పరిసరాల ఫొటోలను తీసి ఎఫ్ఏఏకు కొందరు వ్యక్తులు పంపారట.
సదరు ఫొటోలను చూసిన వెంటనే ఎఫ్ఏఏ వేగంగా స్పందించింది. పరిసరాలు పరిశుభ్రంగా లేని బీచ్ లకు బ్లూఫాగ్ ను కొనసాగించలేమని చెబుతూ రిషికొండ బీచ్ ఎంట్రెన్స్ లో ఉన్న తన జెండాను ఈ నెల 2న తొలగించింది. దీంతో మీడియా అంతా ఒక్కసారిగా రిషికొండకు బ్లూఫాగ్ తొలగిన విధానంపై పెద్ద ఎత్తన వార్తాకథనాలను ప్రసారం చేసింది. దీంతో వెంటనే స్పందించిన సీఎం నారా చంద్రబాబునాయుడు, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. రిషికొండకు బ్లూఫాగ్ తొలగడం, దానికి దారి తీసిన పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటుగా సత్వరంగా బీచ్ కు బ్లూఫాగ్ పునరుద్ధరణ జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఎఫ్ఏఏ చేత బ్లూఫాగ్ ను పునరుద్ధరించేలా చేసింది.
This post was last modified on March 23, 2025 5:24 am
తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టిన చాలామంది ఉత్తరాది హీరోయిన్లు ఇక్కడి అమ్మాయిల్లా మారిపోయిన వారే. అందరికీ నమస్కారం అని కష్టపడి…
మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. ఎల్-2: ఎంపురాన్. ఆ ఇండస్ట్రీలో అత్యధిక హైప్ తెచ్చుకున్న సినిమా కూడా…
ఏపీలోని కూటమి ప్రభుత్వం.. త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన చేస్తుందా? లేక.. మంత్రివర్గంలో కూర్పు వరకు పరిమితం అవుతుందా? అంటే..…
అగ్ర రాజ్యం అమెరికాలో డబ్బులిచ్చి పౌరసత్వం కొనుక్కొనే వెసులుబాటు అప్పుడే మొదలైపోయింది. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే... గోల్డ్ కార్డ్…
పీకే.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటి. 2014లో వచ్చిన ఈ చిత్రం ఆల్ టైం బ్లాక్…
కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల రాజకీయాలు చేస్తున్నారా? లేక ఎండ వేడిమి తట్టుకోలేక.. ఇంటి పట్టునే ఉంటున్నారా? అంటే..…