టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపుగా నెల రోజులకు కాస్త అటుఇటుగా ఏపీలోని వివిధ జైళ్లలో కాలం వెళ్లదీయాల్సి వచ్చిన పోసాని… శనివారం సాయంత్రం బెయిల్ షరతుల మేరకు జామీన్లు సమర్పించి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన పోసానిని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా పోసాని తీవ్ర భావోద్వేగానాకి గురయ్యారు.
టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అసభ్యపదజాలంతో దూషించారంటూ ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పోసానిపై ఏకంగా 16 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో తొలుత అన్నమయ్య జిల్లా పోలీసులు తమ చర్యలను ప్రారంభించారు. పవన్ దూషించి తమ మనోభావాలను దెబ్బతీశారంటూ అందిన ఓ ఫిర్యాదు ఆదారంగా అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె పీఎస్ కేసు నమోదు కాగా… అదే కేసులో ఆయనను అన్నమయ్య జిల్లా పోలీసులు ఫిబ్రవరి 26న హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్టు చేశారు.
ఈ కేసులో కొన్నాళ్లు రాజంపేట జైలులో ఉన్న పోసానిని ఆ తర్వాత పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు, ఆ తర్వాత కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు… తదనంతరం గుంటూరులోని సీఐడీ పోలీసులు తమ అదుపులోకి తీసుకుని సవంబంధిత జైళ్లకు తరలించారు. అయితే కొన్ని కేసుల్లో బెయిల్, మరికొన్ని కేసుల్లో అరెస్టు కాకుండా మినహాయింపు పొందిన పోసాని రిలీజ్ అవుతారన్న సమయంలో అనూహ్యంగా సీఐడీ అదికారులు అరెస్టు చేశారు. ఈ కేసులోనూ శుక్రవారం బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో బెయిల్ షరతుల మేరకు జామీన్లు సమర్పించిన పోసాని శనివారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.
This post was last modified on March 22, 2025 5:49 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…