టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపుగా నెల రోజులకు కాస్త అటుఇటుగా ఏపీలోని వివిధ జైళ్లలో కాలం వెళ్లదీయాల్సి వచ్చిన పోసాని… శనివారం సాయంత్రం బెయిల్ షరతుల మేరకు జామీన్లు సమర్పించి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన పోసానిని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా పోసాని తీవ్ర భావోద్వేగానాకి గురయ్యారు.
టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అసభ్యపదజాలంతో దూషించారంటూ ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పోసానిపై ఏకంగా 16 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో తొలుత అన్నమయ్య జిల్లా పోలీసులు తమ చర్యలను ప్రారంభించారు. పవన్ దూషించి తమ మనోభావాలను దెబ్బతీశారంటూ అందిన ఓ ఫిర్యాదు ఆదారంగా అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె పీఎస్ కేసు నమోదు కాగా… అదే కేసులో ఆయనను అన్నమయ్య జిల్లా పోలీసులు ఫిబ్రవరి 26న హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్టు చేశారు.
ఈ కేసులో కొన్నాళ్లు రాజంపేట జైలులో ఉన్న పోసానిని ఆ తర్వాత పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు, ఆ తర్వాత కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు… తదనంతరం గుంటూరులోని సీఐడీ పోలీసులు తమ అదుపులోకి తీసుకుని సవంబంధిత జైళ్లకు తరలించారు. అయితే కొన్ని కేసుల్లో బెయిల్, మరికొన్ని కేసుల్లో అరెస్టు కాకుండా మినహాయింపు పొందిన పోసాని రిలీజ్ అవుతారన్న సమయంలో అనూహ్యంగా సీఐడీ అదికారులు అరెస్టు చేశారు. ఈ కేసులోనూ శుక్రవారం బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో బెయిల్ షరతుల మేరకు జామీన్లు సమర్పించిన పోసాని శనివారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.
This post was last modified on March 22, 2025 5:49 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…