ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా సొంత పార్టీ బీజేపీ నేతలపై కా మెంట్లు కుమ్మరించారు. “మా వోళ్లే గ్రూపులు కట్టి.. పార్టీని సర్వనాశనం చేసిన్రు. లేకుంటే అధికారంలోకి ఎప్పు డో వచ్చేటోళ్లం“ అని వ్యాఖ్యానించారు. గ్రూపులు కట్టే నాయకులను ప్రోత్సహించరాదని బీజేపీ అధిష్టానా నికి తాను ఎప్పుడో లేఖ రాసినట్టు చెప్పారు. త్వరలోనే బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎంపిక ఉంటుందన్నా రు. అయితే.. ఈ ఎంపిక రాష్ట్ర స్థాయిలో జరిగితే.. ప్రయోజనం లేదన్నారు.
రాష్ట్రంలో నాయకులు తమకు భజనచేసే బృందాన్ని ఎంపిక చేసుకుంటున్నారని.. దీనివల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు ధైర్యంగా ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. చేతులు కాళ్లు కట్టేసినట్టు ఉందన్నారు. అందుకే.. కేంద్రంలోని సెంట్రల్ కమిటీనే రాష్ట్రానికి అధ్యక్షుడిని ఎంపికచేయాలని కోరుతున్నట్టు చెప్పా రు. పైగా ధర్మాన్ని రక్షించే నాయకుడిని.. ధర్మం కోసం జైలుకు వెళ్లాల్సి వస్తే.. అందుకు సిద్ధపడే నాయ కుడిని ఎంపిక చేయాలని రాజా సింగ్ సూచించారు.
ముఖ్యంగా గ్రూపులు కట్టే నాయకులు వద్దన్నారు. గతంలో చేసిన బీజేపీ అధ్యక్షులు అందరూ గ్రూపు రాజకీయాలు చేశారని రాజా సింగ్ దుయ్యబట్టారు. అందుకే రాష్ట్రంలో పార్టీ ఎదగలేకపోయిందన్నారు. కొత్త అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ గానే ఉంటే ప్రయోజనం లేదని.. ఇప్పటికే అనేక రబ్బర్ స్టాంపులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ బీజేపీ నేతలు.. లాబీయింగ్లను కొరుకుంటున్నారని విమర్శించారు. కార్యకర్తల కోసం జైలుకెళ్లిన వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేశారని దుయ్యబట్టారు.
This post was last modified on March 22, 2025 3:07 pm
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే…
అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం అంతకంతకూ పెరుగుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గురువారం అర్ధరాత్రి నగరంలో జరుగుతున్న ఓ…