ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా సొంత పార్టీ బీజేపీ నేతలపై కా మెంట్లు కుమ్మరించారు. “మా వోళ్లే గ్రూపులు కట్టి.. పార్టీని సర్వనాశనం చేసిన్రు. లేకుంటే అధికారంలోకి ఎప్పు డో వచ్చేటోళ్లం“ అని వ్యాఖ్యానించారు. గ్రూపులు కట్టే నాయకులను ప్రోత్సహించరాదని బీజేపీ అధిష్టానా నికి తాను ఎప్పుడో లేఖ రాసినట్టు చెప్పారు. త్వరలోనే బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎంపిక ఉంటుందన్నా రు. అయితే.. ఈ ఎంపిక రాష్ట్ర స్థాయిలో జరిగితే.. ప్రయోజనం లేదన్నారు.
రాష్ట్రంలో నాయకులు తమకు భజనచేసే బృందాన్ని ఎంపిక చేసుకుంటున్నారని.. దీనివల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు ధైర్యంగా ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. చేతులు కాళ్లు కట్టేసినట్టు ఉందన్నారు. అందుకే.. కేంద్రంలోని సెంట్రల్ కమిటీనే రాష్ట్రానికి అధ్యక్షుడిని ఎంపికచేయాలని కోరుతున్నట్టు చెప్పా రు. పైగా ధర్మాన్ని రక్షించే నాయకుడిని.. ధర్మం కోసం జైలుకు వెళ్లాల్సి వస్తే.. అందుకు సిద్ధపడే నాయ కుడిని ఎంపిక చేయాలని రాజా సింగ్ సూచించారు.
ముఖ్యంగా గ్రూపులు కట్టే నాయకులు వద్దన్నారు. గతంలో చేసిన బీజేపీ అధ్యక్షులు అందరూ గ్రూపు రాజకీయాలు చేశారని రాజా సింగ్ దుయ్యబట్టారు. అందుకే రాష్ట్రంలో పార్టీ ఎదగలేకపోయిందన్నారు. కొత్త అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ గానే ఉంటే ప్రయోజనం లేదని.. ఇప్పటికే అనేక రబ్బర్ స్టాంపులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ బీజేపీ నేతలు.. లాబీయింగ్లను కొరుకుంటున్నారని విమర్శించారు. కార్యకర్తల కోసం జైలుకెళ్లిన వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేశారని దుయ్యబట్టారు.
This post was last modified on March 22, 2025 3:07 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…