ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా సొంత పార్టీ బీజేపీ నేతలపై కా మెంట్లు కుమ్మరించారు. “మా వోళ్లే గ్రూపులు కట్టి.. పార్టీని సర్వనాశనం చేసిన్రు. లేకుంటే అధికారంలోకి ఎప్పు డో వచ్చేటోళ్లం“ అని వ్యాఖ్యానించారు. గ్రూపులు కట్టే నాయకులను ప్రోత్సహించరాదని బీజేపీ అధిష్టానా నికి తాను ఎప్పుడో లేఖ రాసినట్టు చెప్పారు. త్వరలోనే బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎంపిక ఉంటుందన్నా రు. అయితే.. ఈ ఎంపిక రాష్ట్ర స్థాయిలో జరిగితే.. ప్రయోజనం లేదన్నారు.
రాష్ట్రంలో నాయకులు తమకు భజనచేసే బృందాన్ని ఎంపిక చేసుకుంటున్నారని.. దీనివల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు ధైర్యంగా ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. చేతులు కాళ్లు కట్టేసినట్టు ఉందన్నారు. అందుకే.. కేంద్రంలోని సెంట్రల్ కమిటీనే రాష్ట్రానికి అధ్యక్షుడిని ఎంపికచేయాలని కోరుతున్నట్టు చెప్పా రు. పైగా ధర్మాన్ని రక్షించే నాయకుడిని.. ధర్మం కోసం జైలుకు వెళ్లాల్సి వస్తే.. అందుకు సిద్ధపడే నాయ కుడిని ఎంపిక చేయాలని రాజా సింగ్ సూచించారు.
ముఖ్యంగా గ్రూపులు కట్టే నాయకులు వద్దన్నారు. గతంలో చేసిన బీజేపీ అధ్యక్షులు అందరూ గ్రూపు రాజకీయాలు చేశారని రాజా సింగ్ దుయ్యబట్టారు. అందుకే రాష్ట్రంలో పార్టీ ఎదగలేకపోయిందన్నారు. కొత్త అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ గానే ఉంటే ప్రయోజనం లేదని.. ఇప్పటికే అనేక రబ్బర్ స్టాంపులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ బీజేపీ నేతలు.. లాబీయింగ్లను కొరుకుంటున్నారని విమర్శించారు. కార్యకర్తల కోసం జైలుకెళ్లిన వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేశారని దుయ్యబట్టారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…