ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా సొంత పార్టీ బీజేపీ నేతలపై కా మెంట్లు కుమ్మరించారు. “మా వోళ్లే గ్రూపులు కట్టి.. పార్టీని సర్వనాశనం చేసిన్రు. లేకుంటే అధికారంలోకి ఎప్పు డో వచ్చేటోళ్లం“ అని వ్యాఖ్యానించారు. గ్రూపులు కట్టే నాయకులను ప్రోత్సహించరాదని బీజేపీ అధిష్టానా నికి తాను ఎప్పుడో లేఖ రాసినట్టు చెప్పారు. త్వరలోనే బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎంపిక ఉంటుందన్నా రు. అయితే.. ఈ ఎంపిక రాష్ట్ర స్థాయిలో జరిగితే.. ప్రయోజనం లేదన్నారు.
రాష్ట్రంలో నాయకులు తమకు భజనచేసే బృందాన్ని ఎంపిక చేసుకుంటున్నారని.. దీనివల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు ధైర్యంగా ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. చేతులు కాళ్లు కట్టేసినట్టు ఉందన్నారు. అందుకే.. కేంద్రంలోని సెంట్రల్ కమిటీనే రాష్ట్రానికి అధ్యక్షుడిని ఎంపికచేయాలని కోరుతున్నట్టు చెప్పా రు. పైగా ధర్మాన్ని రక్షించే నాయకుడిని.. ధర్మం కోసం జైలుకు వెళ్లాల్సి వస్తే.. అందుకు సిద్ధపడే నాయ కుడిని ఎంపిక చేయాలని రాజా సింగ్ సూచించారు.
ముఖ్యంగా గ్రూపులు కట్టే నాయకులు వద్దన్నారు. గతంలో చేసిన బీజేపీ అధ్యక్షులు అందరూ గ్రూపు రాజకీయాలు చేశారని రాజా సింగ్ దుయ్యబట్టారు. అందుకే రాష్ట్రంలో పార్టీ ఎదగలేకపోయిందన్నారు. కొత్త అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ గానే ఉంటే ప్రయోజనం లేదని.. ఇప్పటికే అనేక రబ్బర్ స్టాంపులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ బీజేపీ నేతలు.. లాబీయింగ్లను కొరుకుంటున్నారని విమర్శించారు. కార్యకర్తల కోసం జైలుకెళ్లిన వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేశారని దుయ్యబట్టారు.
This post was last modified on March 22, 2025 3:07 pm
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…