Political News

ఐపాక్ సేవలకు వైసీపీ గుడ్ బై చెప్పేసిందా?

ఏపీలో విపక్షం వెనుక ఓ పక్కా ప్రణాళికతో వేసే ప్రతి అడుగును ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ వేయించే సంస్థ ఒకటి ఉండేది. అదే మనమంతా ఐ ప్యాక్ గా పిలుచుకునే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటి. ప్రశాంత్ కిశోర్ చేతుల్లో పురుడు పోసుకున్న ఈ సంస్థ నుంచి ఆయనే బయటికి వెళ్లిపోగా… ఆ తర్వాత కూడా ఈ సంస్థ సేవలను వైసీపీ వినియోగించుకుంది. దాదాపుగా పదేళ్లకు పైగా ఐ ప్యాక్, వైసీపీల మధ్య బంధం సాగింది. ఐ ప్యాక్ సేవలతోనే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి ఎదురు కాగానే… ఐ ప్యాక్ సేవలను వైసీపీ వద్దనుకుంది. ఇప్పుడు ఆ సంస్థ సేవలను వైసీపీ రద్దు చేసుకుంది. ఇకపై వైసీపీ ఏ సంస్థ సేవలను తీసుకుంటుందో తెలియదు గానీ…ఐ ప్యాక్ ను అయితే తన కాంపౌండ్ నుంచి గెంటేసింది.

గడప గడపకు వైసీపీ, కావాలి జగన్- రావాలి జగన్, ఒక్క ఛాన్స్, సిద్ధం, సిద్దమేనా?… ఇలా వైసీపీకి లెక్కలేనన్ని నినాదాలను ఐప్యాక్ అందించింది. గడప గడపకు వైసీపీ అనే నినాదం ఏపీలోని ప్రతి ఇంటికి ఆ పార్టీని దగ్గర చేసింది. తన సిద్ధాంతాలేమిటన్న దానిపై ప్రతి ఇంటిలో చర్చ జరిగేలా చేసింది. హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్తలను వదిలేస్తే…కాంగ్రెస్, న్యూట్రల్ జనాన్ని వైసీపీకి దగ్గర చేసింది. ఇక కావాలి జగన్- రావాలి జగన్ అనే నినాదం అయితే పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ ను నింపితే…2019 ఎన్నికల్లో జనమంతా గంపగుత్తగా వైసీపీకి ఓటేసేలా చేసింది. వైసీపీని అదికారంలోకి తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత సిద్ధమేనా? అన్న పోస్టర్లు కూడా ఓ రేంజిలో క్లిక్ అయినా కూడా… ఎందుకనో గానీ టీడీపీ ప్రచారం ముందు అంతగా ప్రచారం చూపలేకపోయాయి.

వాస్తవానికి వైసీపీతో పాటు టీడీపీకి కూడా ఐ ప్యాక్ నుంచి వచ్చిన వారే వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అయితే అపజయం ఎదురైనా కూడా టీడీపీ రాబిన్ శర్మ సేవలను కొనసాగిస్తుంటే… వైసీపీ మాత్రం పరాజయం దక్కిందన్న ఒకే ఒక్క కారణంతో ఐ ప్యాక్ సేవలకు వైసీపీ వీడ్కోలు పలికేసింది. మరి ఇప్పుడు ఐ ప్యాక్ లేని సమయంలో పార్టీ ప్రచారం మొత్తం పార్టీ సోషల్ మీడియా విభాగమే చూసుకోవాల్సి ఉంటుంది కదా. మరి ఆ విభాగం ప్రచారం ఇంకెంత మంది పార్టీ కార్యకర్తలను అడ్డంగా బుక్ చేసి పారేస్తుందోనన్న అంశంపై అప్పుడే ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on March 22, 2025 10:54 am

Share
Show comments
Published by
Kumar
Tags: IPACYS Jagan

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

36 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

1 hour ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago