ఏపీలో విపక్షం వెనుక ఓ పక్కా ప్రణాళికతో వేసే ప్రతి అడుగును ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ వేయించే సంస్థ ఒకటి ఉండేది. అదే మనమంతా ఐ ప్యాక్ గా పిలుచుకునే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటి. ప్రశాంత్ కిశోర్ చేతుల్లో పురుడు పోసుకున్న ఈ సంస్థ నుంచి ఆయనే బయటికి వెళ్లిపోగా… ఆ తర్వాత కూడా ఈ సంస్థ సేవలను వైసీపీ వినియోగించుకుంది. దాదాపుగా పదేళ్లకు పైగా ఐ ప్యాక్, వైసీపీల మధ్య బంధం సాగింది. ఐ ప్యాక్ సేవలతోనే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి ఎదురు కాగానే… ఐ ప్యాక్ సేవలను వైసీపీ వద్దనుకుంది. ఇప్పుడు ఆ సంస్థ సేవలను వైసీపీ రద్దు చేసుకుంది. ఇకపై వైసీపీ ఏ సంస్థ సేవలను తీసుకుంటుందో తెలియదు గానీ…ఐ ప్యాక్ ను అయితే తన కాంపౌండ్ నుంచి గెంటేసింది.
గడప గడపకు వైసీపీ, కావాలి జగన్- రావాలి జగన్, ఒక్క ఛాన్స్, సిద్ధం, సిద్దమేనా?… ఇలా వైసీపీకి లెక్కలేనన్ని నినాదాలను ఐప్యాక్ అందించింది. గడప గడపకు వైసీపీ అనే నినాదం ఏపీలోని ప్రతి ఇంటికి ఆ పార్టీని దగ్గర చేసింది. తన సిద్ధాంతాలేమిటన్న దానిపై ప్రతి ఇంటిలో చర్చ జరిగేలా చేసింది. హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్తలను వదిలేస్తే…కాంగ్రెస్, న్యూట్రల్ జనాన్ని వైసీపీకి దగ్గర చేసింది. ఇక కావాలి జగన్- రావాలి జగన్ అనే నినాదం అయితే పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ ను నింపితే…2019 ఎన్నికల్లో జనమంతా గంపగుత్తగా వైసీపీకి ఓటేసేలా చేసింది. వైసీపీని అదికారంలోకి తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత సిద్ధమేనా? అన్న పోస్టర్లు కూడా ఓ రేంజిలో క్లిక్ అయినా కూడా… ఎందుకనో గానీ టీడీపీ ప్రచారం ముందు అంతగా ప్రచారం చూపలేకపోయాయి.
వాస్తవానికి వైసీపీతో పాటు టీడీపీకి కూడా ఐ ప్యాక్ నుంచి వచ్చిన వారే వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అయితే అపజయం ఎదురైనా కూడా టీడీపీ రాబిన్ శర్మ సేవలను కొనసాగిస్తుంటే… వైసీపీ మాత్రం పరాజయం దక్కిందన్న ఒకే ఒక్క కారణంతో ఐ ప్యాక్ సేవలకు వైసీపీ వీడ్కోలు పలికేసింది. మరి ఇప్పుడు ఐ ప్యాక్ లేని సమయంలో పార్టీ ప్రచారం మొత్తం పార్టీ సోషల్ మీడియా విభాగమే చూసుకోవాల్సి ఉంటుంది కదా. మరి ఆ విభాగం ప్రచారం ఇంకెంత మంది పార్టీ కార్యకర్తలను అడ్డంగా బుక్ చేసి పారేస్తుందోనన్న అంశంపై అప్పుడే ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on March 22, 2025 10:54 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…