టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి శుక్రవారం మరో భారీ ఊరట లభించింది. ఇప్పటిదాకా తనపై నమోదు అయిన కేసుల్లో కొన్నింటిలో బెయిల్, కొన్నింటిలో అరెస్టుల నుంచి మినహాయింపు పొందిన పోసానికి… తాజాగా సీఐడీ కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది. ఈ లెక్కన పోసానిపై నమోదు అయిన అన్ని కేసుల్లోనూ ఆయనకు ఊరట లబించినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టు ఆర్డర్లు జైలు అదికారులు అంది… పోసాని జైలు నుంచి విడుదలయ్యే దాకా ఇంకో కొత్త కేసేదీ నమోదు కాకపోతే ఆయన రిలీజ్ అయినట్టేనని చెప్పాలి.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పోసానిపై ఏపీలోని పలు జిల్లాల్లో ఏకంగా 16 కేసుల దాకా నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో తొలుత అన్నమయ్య జిల్లా పోలీసులు చర్యలు మొదలుపెట్టి… హైదరాబాద్ వెళ్లి మరీ పోసానిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పల్నాడ జిల్లా, కర్నూలు జిల్లా పోలీసులు వరుసబెట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుల్లో ఎలాగోలా బెయిల్ తెచ్చుకున్న పోసానిని… సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో గతంలో తమ వద్ద నమోదైన ఓ కేసు ఆధారంగా పోసానిని సీఐడీ అరెస్ట్ చేసింది.
ఈ కేసులో కోర్టు పోసానిని విచారించాల్సి ఉందని సీఐడీ అదికారులు పిటిషన్ దాఖలు చేస్తే… ఇప్పటికే బెయిల్ వచ్చిన కేసులోనే తనను అరెస్ట్ చేశారని చెప్పిన పోసాని… ఈ కేసులోనూ తనకు ఉపశమనం కల్పించాలని కోరుతూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిలో సీఐడీ పిటిషన్ ను తొలుత పరిష్క్రరించిన కోర్టు… పోసానికి ఒక్క రోజు సీఐడీ కస్టడీని విధించింది. అది కూడా ముగిసింది. తాజాగా పోసాని బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా… శుక్రవారం మద్యాహ్నం తర్వాత కోర్టు తన తీర్పును వెలువరించింది. పోసాని కోరినట్టుగా ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరి ఈ బెయిల్ ద్వారా అయినా ఆయన జైలు నుంచి విడుదల అవుతారా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 21, 2025 5:12 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…