Political News

వైసీపీ దొంగ సంతకాలపై బాబు మార్కు సెటైర్లు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ అధినేత వైైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన 11 మంది సభ్యులు సభకు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే సభ నుంచి వెళ్లిపోయారు. పోతూపోతూ సభకు హాజరైనట్టుగా రిజిష్టర్లలో సంతకాలు చేసి మరీ వెళ్లిపోయారు. అంతే..ఆ తర్వాత వారెవరూ సభకే రాలేదు. అయినా కూడా వారిలో కొందరు సభకు హాజరైనట్లుగా రిజిష్టర్లలో సంతకాలు ఉండటం గురువారమే బయటపడింది. దీనిపై సభా నాయకుడి స్థానంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలి సెటైర్లు సంధించారు.

గురువారం సభ ప్రారంభం అయిన వెంటనే అసెంబ్లీ స్పీకర్ వైైసీపీ ఎమ్మెల్యేల దొంగ సంతకాల విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత సభ ముగిసే సమయానికి కాస్తంత ముందుగా చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. రిజిష్టర్ వివరాలు తెప్పించుకుని మరీ ఆయన వైసీపీ బండారాన్ని బయటపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే… ”24వ తారీఖున వైసీపీ వారు 11 మంది వచ్చారు. 25న ఐదు మంది వచ్చారు.18.3.2023న ఒకరు వచ్చారు. 19.3.2025న నలుగురు వచ్చారు. అయితే లోపల ఎక్కడా వారు వచ్చినట్లు కనిపించలేదు. మీరు రానివ్వలేదా? మాకు ఐడియా లేదు. మీరు రానివ్వలేదేమోనని మా అనుమానం” అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు వ్యాఖ్యలతో సభలో నవ్వులు విరియగా… ఆ తర్వాత చంద్రబాబు వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే బాధ్యతను స్పీకర్ అయ్యన్నపాత్రపుడు తీసుకున్నారు. ప్రజా ప్రతినిదులుగా ఎన్నికైన వారు ఎమ్మెల్యేలుగా ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటున్నారని తెలిపారు. అలా సర్కారీ వేతనాలు తీసుకుంటూ సభకు రాకుంటే ఎలాగంటూ ఆయన ప్రశ్నించారు. ఈ తరహా వ్యవహారంపైనా చర్చించి కఠిన దండన ఉండేలా చర్యలు చేపట్టక తప్పదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఓ సభ్యుడు ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేద్దామనగా.. ఆ విషయాన్ని కూడా పరిశీలిద్దామని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా చంద్రబాబు చమక్కులు, అయ్యన్న హెచ్చరికలతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.

This post was last modified on March 20, 2025 8:08 pm

Share

Recent Posts

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

1 hour ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

2 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

2 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

2 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

5 hours ago

బండ్ల కూతురి పెళ్లికి రానిది పవన్ ఒకరే

బండ్ల గ‌ణేష్ అనే న‌టుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్ర‌లు చేసింది లేదు. న‌టుడిగా అత‌డిది గొప్ప కెరీర్ కాదు.…

6 hours ago