వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మర్రి రాజశేఖర్ మరో బారీ షాకిచ్చారు. బుధవారం వైసీపీకి, ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి… జగన్ కు ఊహించని షాకే ఇచ్చారు. తాజాగా తాను టీడీపీలో చేరుతున్నానని గురువారం ప్రకటించిన మర్రి.. జగన్ కు మరో బారీ షాకిచ్చారు. వైైసీపీకి మర్రి రాజీనామానే జీర్ణించుకోలేకపోతున్న జగన్… మర్రి నేరుగా టీడీపీలోకి వెళుతున్నానని ప్రకటించడాన్ని తట్టుకోలేరన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
మర్రి రాజీనామా చేసిన బుధవారం కూడా అసెంబ్లీ ప్రాంగణంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మర్రి పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారని తెలిసినంతనే జగన్ అప్రమత్తమయ్యారు. మర్రి తన రాజీనామా నిర్ణయాన్ని నిలవరించేలా జగన్ పార్టీ నేతలను రంగంలోకి దించారు. జగన్ ఆదేశాలతో బొత్స సత్యనారాయణతో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు మర్రిని లాబీల్లోనే ఆపేశారు. జగన్ తో మాట్లాడాలంటూ ప్రతిపాదించగా.. రాజీనామాపై తాను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని… అందులో మార్పు ఉండబోదని మర్రి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన సందర్బంగా మర్రి రాజశేఖర్ మరింత ఆసక్తికర కామెంట్లు చేశారు. వైసీపీని వీడటానికి జగనే కారణమని ఆయన సంచలన ఆరోపించారు. తనకు ఇచ్చిన మాట మీద జగన్ నిలబడలేకపోయారని మర్రి ఆరోపించారు. 2019లోనే తనకు మంత్రి పదవి ఇస్తానని జగన్ చెప్పారని.. ఈ కారణంగానే తనను కాదని విడదల రజనీకి టికెట్ ఇచ్చినా సర్దుకుపోయానని అన్నారు. అయితే రజనీకి మంత్రి పదవి ఇచ్చిన జగన్…తనకు కేవలం ఎమ్మెల్సీ పదవితోనే సరిపెట్టారన్నారు.
2024లో అయినా తనకు న్యాయం జరుగుతుందని భావిస్తే..గుంటూరు మేయర్ ను తీసుకువచ్చి చిలకలూరిపేటలో నిలిపారని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అటు గుంటూరు వెస్ట్, చిలకలూరిపేటల్లో రెండు చోట్లా పార్టీ ఓడినా.. మళ్లీ రజనీని చిలకలూరిపేట ఇంచార్జీగా నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో ఇక తనకు వైసీపీలో న్యాయం జరిగే పరిస్థితి లేదని అర్థమైందని.. అందుకు జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని కూడా ఆయన ఆరోపించారు మొత్తంగా జగన్ కారణంగానే తాను వైసీపీని వీడానని మర్రి తేల్చి పారేశారు.
This post was last modified on March 20, 2025 6:04 pm
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…
యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…
చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి…
ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140…
వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకుని, వినాయకుడిని…