Political News

జగన్ కారణంగానే వైసీపీని వీడా.. టీడీపీలో చేరుతున్నా: మర్రి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మర్రి రాజశేఖర్ మరో బారీ షాకిచ్చారు. బుధవారం వైసీపీకి, ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి… జగన్ కు ఊహించని షాకే ఇచ్చారు. తాజాగా తాను టీడీపీలో చేరుతున్నానని గురువారం ప్రకటించిన మర్రి.. జగన్ కు మరో బారీ షాకిచ్చారు. వైైసీపీకి మర్రి రాజీనామానే జీర్ణించుకోలేకపోతున్న జగన్… మర్రి నేరుగా టీడీపీలోకి వెళుతున్నానని ప్రకటించడాన్ని తట్టుకోలేరన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

మర్రి రాజీనామా చేసిన బుధవారం కూడా అసెంబ్లీ ప్రాంగణంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మర్రి పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారని తెలిసినంతనే జగన్ అప్రమత్తమయ్యారు. మర్రి తన రాజీనామా నిర్ణయాన్ని నిలవరించేలా జగన్ పార్టీ నేతలను రంగంలోకి దించారు. జగన్ ఆదేశాలతో బొత్స సత్యనారాయణతో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు మర్రిని లాబీల్లోనే ఆపేశారు. జగన్ తో మాట్లాడాలంటూ ప్రతిపాదించగా.. రాజీనామాపై తాను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని… అందులో మార్పు ఉండబోదని మర్రి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇక టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన సందర్బంగా మర్రి రాజశేఖర్ మరింత ఆసక్తికర కామెంట్లు చేశారు. వైసీపీని వీడటానికి జగనే కారణమని ఆయన సంచలన ఆరోపించారు. తనకు ఇచ్చిన మాట మీద జగన్ నిలబడలేకపోయారని మర్రి ఆరోపించారు. 2019లోనే తనకు మంత్రి పదవి ఇస్తానని జగన్ చెప్పారని.. ఈ కారణంగానే తనను కాదని విడదల రజనీకి టికెట్ ఇచ్చినా సర్దుకుపోయానని అన్నారు. అయితే రజనీకి మంత్రి పదవి ఇచ్చిన జగన్…తనకు కేవలం ఎమ్మెల్సీ పదవితోనే సరిపెట్టారన్నారు.

2024లో అయినా తనకు న్యాయం జరుగుతుందని భావిస్తే..గుంటూరు మేయర్ ను తీసుకువచ్చి చిలకలూరిపేటలో నిలిపారని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అటు గుంటూరు వెస్ట్, చిలకలూరిపేటల్లో రెండు చోట్లా పార్టీ ఓడినా.. మళ్లీ రజనీని చిలకలూరిపేట ఇంచార్జీగా నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో ఇక తనకు వైసీపీలో న్యాయం జరిగే పరిస్థితి లేదని అర్థమైందని.. అందుకు జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని కూడా ఆయన ఆరోపించారు మొత్తంగా జగన్ కారణంగానే తాను వైసీపీని వీడానని మర్రి తేల్చి పారేశారు.

This post was last modified on March 20, 2025 6:04 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

37 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

57 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago