వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు మరోమారు పోలీసు కస్టడీకి సిద్ధం కాక తప్పలేదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వంశీని విచారించాల్సి ఉందని… ఈ కారణంగా వంశీని తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ అధికారులు విజయవాడలోని సీఐడీ కోర్టులో ఇదివరకే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. సీఐడీ అధికారుల వాదనతో ఏకీభవించింది. వంశీని మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఇటీవలే వంశీని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి వంశీ బెజవాడలోని జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఓ దఫా వంశీ పోలీసు కస్టడీని ఎదుర్కొన్నారు. ఆ విచారణలో వంశీ పెద్దగా విచారణకు సహకరించలేదన్న వాదనలు వినిపించాయి. కనీసం తన ఫోన్లు ఎక్కడ ఉన్నాయన్న విషయాన్ని కూడా వంశీ పోలీసులకు చెప్పలేదట. అయితే తాడేపల్లి వెళ్లిన విషయాన్ని ఒప్పేసుకున్న వంశీ.. జగన్ ను మాత్రం కలవలేదని చెప్పారు.
తాజాగా 3 రోజుల పాటు సీఐడీ కస్టడీలోకి వెళ్లనున్న వంశీ… ఈ విచారణలో ఏఏ అంశాలను వెల్లడిస్తారన్నవిషయంపై ఆసక్తి నెలకొంది. లా అండ్ ఆర్డర్ పోలీసుల కంటే సీఐడీ పోలీసుల విచారణ ఒకింత వెరైటీగా ఉంటుందనే చెప్పాలి. నిందితుడిని ఇబ్బంది పెట్టకుండానే… లాఘవంగా వారి నుంచి సమాధానాలు రాబట్టే విషయంలో సీఐడీ పోలీసులకు మంచి పట్టే ఉందని చెప్పక తప్పుదు. అంతేకాకుండా ఆయా అంశాలకు సంబంధించి పక్కా ఆధారాలను ముందు పెట్టి మరీ సీఐడీ అదికారులు నిందితులను ప్రశ్నిస్తారు. ఫలితంగా వంశీ కూడా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి దారి తీసిన అసలు వాస్తవాలను బయటపెట్టక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 20, 2025 4:30 pm
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…