వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు మరోమారు పోలీసు కస్టడీకి సిద్ధం కాక తప్పలేదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వంశీని విచారించాల్సి ఉందని… ఈ కారణంగా వంశీని తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ అధికారులు విజయవాడలోని సీఐడీ కోర్టులో ఇదివరకే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. సీఐడీ అధికారుల వాదనతో ఏకీభవించింది. వంశీని మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఇటీవలే వంశీని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి వంశీ బెజవాడలోని జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఓ దఫా వంశీ పోలీసు కస్టడీని ఎదుర్కొన్నారు. ఆ విచారణలో వంశీ పెద్దగా విచారణకు సహకరించలేదన్న వాదనలు వినిపించాయి. కనీసం తన ఫోన్లు ఎక్కడ ఉన్నాయన్న విషయాన్ని కూడా వంశీ పోలీసులకు చెప్పలేదట. అయితే తాడేపల్లి వెళ్లిన విషయాన్ని ఒప్పేసుకున్న వంశీ.. జగన్ ను మాత్రం కలవలేదని చెప్పారు.
తాజాగా 3 రోజుల పాటు సీఐడీ కస్టడీలోకి వెళ్లనున్న వంశీ… ఈ విచారణలో ఏఏ అంశాలను వెల్లడిస్తారన్నవిషయంపై ఆసక్తి నెలకొంది. లా అండ్ ఆర్డర్ పోలీసుల కంటే సీఐడీ పోలీసుల విచారణ ఒకింత వెరైటీగా ఉంటుందనే చెప్పాలి. నిందితుడిని ఇబ్బంది పెట్టకుండానే… లాఘవంగా వారి నుంచి సమాధానాలు రాబట్టే విషయంలో సీఐడీ పోలీసులకు మంచి పట్టే ఉందని చెప్పక తప్పుదు. అంతేకాకుండా ఆయా అంశాలకు సంబంధించి పక్కా ఆధారాలను ముందు పెట్టి మరీ సీఐడీ అదికారులు నిందితులను ప్రశ్నిస్తారు. ఫలితంగా వంశీ కూడా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి దారి తీసిన అసలు వాస్తవాలను బయటపెట్టక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…