Political News

ఏపీలో క్రిష్టియానిటీ పెరిగింది…మోడీకి రఘురామ లేఖ

ఏపీలో వైసీపీకి స్వపక్షంలో విపక్షంలా మారిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సొంతపార్టీపైనే సందర్భానుసారంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల తిరుమల డిక్లరేషన్ వ్యవహారంలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను రఘురామ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిష్టియానిటీ పెరుగుతోందని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.

రికార్డుల ప్రకారం ఏపీలో 1.8 శాతం క్రిష్టియానిటీ ఉందని, కానీ, వాస్తవానికి అది 25 శాతం ఉందని రఘురామ అన్నారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు క్రిష్టియన్లని, కానీ,ఎన్నికలలో గెలిచేందుకు హిందువులమని చెప్పుకుంటూ నిరంతరం చర్చిల్లో తిరుగుతున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ వివరాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లీగల్ ప్రొటెక్షన్ ఫోరం వారు సమర్పించారని,, త్వరలో ఆ వివరాలల్నీ బయటకు వస్తాయని రఘురామ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా రఘురామ ఈ వ్యవహారంపై తాజాగా లేఖ రాశారు.

ఏపీలో యథేచ్ఛగా మత మార్పిడులు జరుగుతున్నాయని, 2011లో 1.8 శాతంగా ఉన్న క్రిష్టియన్ల జనాభా 2020 నాటికి 25 శాతానికి పెరిగిందని రఘురామ లేఖలో పేర్కొన్నారు. కానీ, ఆ గణాంకాలు ప్రభుత్వ రికార్డుల్లో లేవని, అనధికారికంగా ఉన్నాయని అన్నారు. ఏపీలో ప్రజాధనాన్ని క్రిస్టియన్ మత వ్యాప్తికి ఉపయోగిస్తున్నారని,ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనేనని అన్నారు.

ఏపీలో 30 వేల మంది చర్చి పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు ఇచ్చేలా జీవో వచ్చిందని, ఇటీవల ఏపీలో 33 వేల చర్చిలు ఏర్పాటైనట్టు సమాచారం ఉందని అన్నారు. గుళ్లకు సమాన సంఖ్యలో చర్చిలను ఏర్పాటు చేశారని, 2021 జనాభా లెక్కల్లో మత మార్పిడి చేసుకున్న వారిని గుర్తించి అర్హులకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. తాజాగా రఘురామ రాసిన లేఖపై మోడీ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on October 28, 2020 6:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

10 minutes ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

1 hour ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

2 hours ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

2 hours ago

సింగర్ చిన్మ‌యిపై కేసు

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే త‌మిళ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యిపై కేసు న‌మోదైంది. ఎక్స్‌లో ఆమె చేసిన…

3 hours ago

అన్నయ్య రూటులోనే బేబీ హీరో రిస్కు

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ దేవరకొండని సక్సెస్ వరించడానికి టైం అయితే పట్టింది. బేబీ…

3 hours ago