టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. దాదాపుగా 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ గురించి బుధవారం ఆ సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు స్పందించారు. బిల్ గేట్స్ తో తాను సమావేశం అయ్యానని.. ఏపీ ప్రగతిలో కీలకం కానున్న ఈ బేటీ తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా ఈ భేటీపై బిల్ గేట్స్ కూడా స్పందించారు. చంద్రబాబుతో భేటీ అద్భుతంగా సాగించని బిల్ గేట్స్ పేర్కొనడం గమనార్హం.
బుధవారం చంద్రబాబుతో జరిగిన భేటీ, ఆ తర్వాత సదరు భేటీపై చంద్రబాబు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను చూసిన తర్వాత గురువారం ఉదయం బిల్ గేట్స్ స్పందించారు. చంద్రబాబు ట్వీట్ ను రీపోస్ట్ చేసిన గేట్స్..దానికి తన ప్రతిస్పందనను జోడించారు. చంద్రబాబుతో బేటీ కావడం ఆనందంగా ఉందన్న బిల్ గేట్స్… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తమ ఫౌండేషన్ కీలక ఒప్పందంపై సంతకం చేసిందని గుర్తు చేశారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో అధునాతన సాంకేతికతను వినియోగించుకుని పురోభివృద్ధి సాధించే లక్ష్యంతో సాగుతున్న ఏపీకి సహకారం అందించనున్నామని ఆయన పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా తదుపరి చర్యలపై ఇప్పటికే దృష్టి సారించినట్లుగా ఆయన తెలిపారు.
వాస్తవానికి బిల్ గేట్స్, చంద్రబాబుల స్నేహ బంధం ఇప్పటిది కాదు. ఎప్పుడో 1995లో మొదలైన వీరి స్నేహం కాలంతో పాటుగా బలపడుతూ వచ్చింది. నాడు ఉమ్మడి రాష్ట్రానికి సీఎం హోదాలో చంద్రబాబు… అతికష్టం మీద గేట్స్ అపాయింట్ మెంట్ సంపాదించారు. వారి తొలి భేటీ ఢిల్లీలోనే జరిగింది. ఓ రాజకీయ నేతగా ఉండి టెక్నాలజీని ప్రభుత్వ పాలనలో వినియోగించే దిశగా మాట్లాడుతున్న చంద్రబాబును బిల్ గేట్స్ అలా చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు కోరినట్లుగానే హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం ఏర్పాటైంది. దానిని చూసి దిగ్గజ సంస్థలన్నీ హైదరాబాద్ బాట పట్టాయి. బాబు, గేట్స్ బంధం కూడా అంతకంతకూ బలపడింది. ఇటీవలే దావోస్ లో కలిసిన సందర్బంగా ఏపీకి సాయం చేయాలంటూ బాబు కోరితే… రెండు నెలలు తిరక్కుండానే గేట్స్ రంగంలోకి దిగిపోయారు.
వారణాసి విడుదల ఇంకో ఏడాది టైం ఉందని, పదే పదే మహేష్ బాబు రీ రిలీజులను క్యూ కట్టడం ఎంత…
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…