Political News

బిల్ గేట్స్ తో బాబు భేటీ…చర్చలు ఫలించాయన్న సీఎం

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర పెద్దలను కలిసేందుకు మంగళవారం రాత్రికే ఢిల్లీ చేరిన చంద్రబాబు… బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బిల్ గేట్స్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బాబుతో పాటుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీశ్ కుమార్, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు పాలుపంచుకున్నారు. ఈ సమావేశం దాదాపుగా 40 నిమిషాల పాటు కొనసాగింది.

బిల్ గేట్స్ తో భేటీ ముగిసిన తర్వాత… ఆ భేటీ గురించి చంద్రబాబే స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశారు. గేట్స్ తో భేటీ ఫలప్రదంగా ముగిసిందని ఈ ప్రకటనలో ఆయన తెలిపారు. ఏపీ ప్రలజకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఏ తరహా చర్యలు చేపట్టాలన్న విషయంపై సుదీర్గంగా చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, వంటి కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వానికి గేట్స్ ఫౌండేషన్ సహాకారంపై చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. అందివచ్చిన శాస్త్ర సాంకేతికతతో ప్రజల జీవన విధానాన్ని మరింత మెరుగు చేసే దిశగా ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందన్న విషయంపైనా కీలక చర్చలు జరిగినట్లు చంద్రబాబు వెల్లడించారు.

స్వర్ణాంధ్రప్రదేశ్-2047 సాకారం దిశగా ముందుకు సాగుతున్నామన్న చంద్రబాబు..ఇందులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వినియోగంపై గేట్స్ లో చర్చలు సాగించామని తెలిపారు. ఈ అధునాతన సాంతకేక పరిజ్ఞానాల సాయంతో ఏ మేర ఫలితం సాధించవచ్చన్న దిశగా లోతైన సమీక్షలు జరిపామని తెలిపారు. ఏపీ ప్రజల బాగోగుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం గేట్స్ తన విలువైన సమయాన్నికేటాయించడం పట్ల చంద్రబాబు హర్షం ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం తమ ప్రభుత్వం చేస్తున్న కృషికి గేట్స్ మద్దతుగా నిలిచిన తీరు కూడా ఆహ్వానించదగ్గదని కూడా చంద్రబాబు పేర్కొన్నారు.

This post was last modified on March 19, 2025 6:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

2 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

4 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

33 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago