మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర పెద్దలను కలిసేందుకు మంగళవారం రాత్రికే ఢిల్లీ చేరిన చంద్రబాబు… బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బిల్ గేట్స్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బాబుతో పాటుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీశ్ కుమార్, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు పాలుపంచుకున్నారు. ఈ సమావేశం దాదాపుగా 40 నిమిషాల పాటు కొనసాగింది.
బిల్ గేట్స్ తో భేటీ ముగిసిన తర్వాత… ఆ భేటీ గురించి చంద్రబాబే స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశారు. గేట్స్ తో భేటీ ఫలప్రదంగా ముగిసిందని ఈ ప్రకటనలో ఆయన తెలిపారు. ఏపీ ప్రలజకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఏ తరహా చర్యలు చేపట్టాలన్న విషయంపై సుదీర్గంగా చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, వంటి కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వానికి గేట్స్ ఫౌండేషన్ సహాకారంపై చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. అందివచ్చిన శాస్త్ర సాంకేతికతతో ప్రజల జీవన విధానాన్ని మరింత మెరుగు చేసే దిశగా ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందన్న విషయంపైనా కీలక చర్చలు జరిగినట్లు చంద్రబాబు వెల్లడించారు.
స్వర్ణాంధ్రప్రదేశ్-2047 సాకారం దిశగా ముందుకు సాగుతున్నామన్న చంద్రబాబు..ఇందులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వినియోగంపై గేట్స్ లో చర్చలు సాగించామని తెలిపారు. ఈ అధునాతన సాంతకేక పరిజ్ఞానాల సాయంతో ఏ మేర ఫలితం సాధించవచ్చన్న దిశగా లోతైన సమీక్షలు జరిపామని తెలిపారు. ఏపీ ప్రజల బాగోగుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం గేట్స్ తన విలువైన సమయాన్నికేటాయించడం పట్ల చంద్రబాబు హర్షం ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం తమ ప్రభుత్వం చేస్తున్న కృషికి గేట్స్ మద్దతుగా నిలిచిన తీరు కూడా ఆహ్వానించదగ్గదని కూడా చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…