Political News

జగన్ మారిపోయినట్టేనా

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు. 2019 ఎన్నికలకు ముందు నిత్యం జనంలోనే ఉండిపోయిన ఆయన… 2019 ఎన్నికల్లో అధికారం చేతికి అందడంతోనే జనానికి దూరమైపోయారు. ఫలితంగా ఐధేళ్లు తిరక్కుండానే… జగన్ అధికారం నుంచి దిగిపోయారు.151 సీట్లున్న వైసీపీ కేవలం 11 సీట్లకు పడిపోయిందంటే.. జగన్ పరాజయం ఏ రేంజిలో ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. రాజకీయాలన్నాక విజయం, పరాజయం కామనే కదా. మరి జగన్ తిరిరి లేచేదెలా? తిరిగి ప్రజలకు దగ్గరవడమే ఉత్తమం అన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. అందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ మాదిరిగా ప్రజా దర్బార్ నిర్వహణ దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు.

2019 ఎన్నికల్లో నారా లోకేశ్ మంత్రి హోదాలోనే ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి పరిధిలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలన్న దిశగా ఆయన మంగళగిరిని ఎంచుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో లోకేశ్ కు పరాజయం స్వాగతం చెప్పింది. అయినప్పటికీ… నిరాశ చెందని లోకేశ్ తనదైన శైలి వ్యూహంతో మంగళగిరి జనాల్లోకి చొచ్చుకుని వెళ్లారు. ప్రజా ప్రతినిధిగా లేకున్నా కూడా నిత్యం మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రతి గ్రామాన్ని సందర్శించారు. ప్రతి కుటుంబాన్నీ ఆయన కలిశారు. ఇందుకోసం ప్రజా దర్బార్ పేరిట లోకేశ్ చేపట్టిన ప్రజా ఫిర్యాదుల పరిష్కరణ ఆయనను జనానికి మరింతగా చేరువ చేసింది. ఇదే లోకేశ్ కు మొన్నటి ఎన్నికల్లో రికార్డు మెజారిటీ విజయాన్ని కట్టబెట్టింది. అధికారంలోకి వచ్చినా లోకేశ్ ప్రజా దర్బార్ ను కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇప్పుడు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద కొత్తగా కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను చూస్తుంటే.. ప్రజా దర్బార్ తరహా కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ మద్దతుదారులు కూడా ధ్రువీకరిస్తున్నారు. త్వరలోనే జగన్ ప్రజా దర్బార్ పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నారని… ఇందులో ప్రజల నుంచి జగన్ ఫిర్యాదులను స్వీకరిస్తారని, వాటి పరిష్కారంపై దృష్టి సారిస్తారని వారు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏదో కొన్ని రోజులకు మాత్రమే పరిమితం చేయకుండా జగన్ అందుబాటులో ఉన్న అన్ని రోజుల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం గతంలో తన నివాసం చుట్టూ భారీ కంచెను ఏర్పాటు చేసుకున్న మాదిరిగానే…ప్రజా దర్బార్ కు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్న ఫొటోలు వైరల్ గా మారిపోయాయి.

This post was last modified on March 18, 2025 10:28 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago