ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయంటే… కూటమి సర్కారు పెట్టుబడులకు ఏ మేర ప్రాధాన్యం ఇస్తుందో ఇట్టే చెప్పేయొచ్చు. సోమవారం నాటి కేబినెట్ భేటీలోనూ పెట్టుబడులపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సోలార్ ప్లేట్ల తయారీ కోసం ఏపీలో భారీ పెట్టుబడులు పెడుతున్న శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అంశం ప్రస్తావనకు వచ్చింది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద ఈ కంపెనీకి ఏకంగా 8,365 ఎకరాల భూమిని కేటాయించారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ వైసీపీ కీలక నేతల బినామీ కంపెనీగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
కేబినెట్ బేటీలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన పలువురు మంత్రులు వైసీపీ నేతలకు చెందిన కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున భూములు కేటాయించడం సరికాదేమోనని అన్నారట. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమే మంచిదని కూడా వారు అభిప్రాయపడ్డారట. ఈ సందర్బంగా కలుగజేసుకున్న సీఎం చంద్రబాబు…పెట్టుబడుల విషయంలో రాజకీయాల గోల ఎందుకని ప్రశ్నించారట. ఆయా కంపెనీలు పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తున్నప్పుడు.. వాటి ప్రతిపాదనలను పరిశీలించి… అవసరమైన మేరకు ప్రోత్సాహం ఇద్దామని తెలిపారట. అంతేకాకుండా పార్టీల గోలను పక్కనపెట్టి…ఆయా కంపెనీలు నిబంధనలను పాటిస్తున్నాయా? లేదా? అన్నదానిని ఆధారంగా చేసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన తేల్చేశారట.
నిజమే మరి… చాలా కంపెనీలకు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండటమో… లేదంటే రాజకీయ నేతల ఆధ్వర్యంలోనే ఆయా కంపెనీలు నడుస్తుండటమో కొత్తేమీ కాదు. రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడేలా… రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలను రావొద్దని చెప్పడం కుదరదు. అలా చేస్తే.. ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ కూడా ఆ నిందను మోయాల్సి వస్తుంది. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు సమర్పించే ప్రతిపాదనలు సరిగా ఉంటే ఓకే… లేదంటే వాటికవే రిజెక్ట్ అవుతాయి కదా. ఇందులో రాజకీయాల గోల అవసరం లేదంటూ చంద్రబాబు తేల్చేశారు. ఎలాగూ ఆయా కంపెనీలు నిబంధనలు పాటించకున్నా కూడా ఆ ఒప్పందాలను మధ్యలోనే రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది కదా అన్న బాబు మాటతో మంత్రులు మిన్నకుండిపోయారట,.
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…