ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయంటే… కూటమి సర్కారు పెట్టుబడులకు ఏ మేర ప్రాధాన్యం ఇస్తుందో ఇట్టే చెప్పేయొచ్చు. సోమవారం నాటి కేబినెట్ భేటీలోనూ పెట్టుబడులపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సోలార్ ప్లేట్ల తయారీ కోసం ఏపీలో భారీ పెట్టుబడులు పెడుతున్న శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అంశం ప్రస్తావనకు వచ్చింది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద ఈ కంపెనీకి ఏకంగా 8,365 ఎకరాల భూమిని కేటాయించారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ వైసీపీ కీలక నేతల బినామీ కంపెనీగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
కేబినెట్ బేటీలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన పలువురు మంత్రులు వైసీపీ నేతలకు చెందిన కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున భూములు కేటాయించడం సరికాదేమోనని అన్నారట. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమే మంచిదని కూడా వారు అభిప్రాయపడ్డారట. ఈ సందర్బంగా కలుగజేసుకున్న సీఎం చంద్రబాబు…పెట్టుబడుల విషయంలో రాజకీయాల గోల ఎందుకని ప్రశ్నించారట. ఆయా కంపెనీలు పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తున్నప్పుడు.. వాటి ప్రతిపాదనలను పరిశీలించి… అవసరమైన మేరకు ప్రోత్సాహం ఇద్దామని తెలిపారట. అంతేకాకుండా పార్టీల గోలను పక్కనపెట్టి…ఆయా కంపెనీలు నిబంధనలను పాటిస్తున్నాయా? లేదా? అన్నదానిని ఆధారంగా చేసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన తేల్చేశారట.
నిజమే మరి… చాలా కంపెనీలకు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండటమో… లేదంటే రాజకీయ నేతల ఆధ్వర్యంలోనే ఆయా కంపెనీలు నడుస్తుండటమో కొత్తేమీ కాదు. రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడేలా… రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలను రావొద్దని చెప్పడం కుదరదు. అలా చేస్తే.. ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ కూడా ఆ నిందను మోయాల్సి వస్తుంది. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు సమర్పించే ప్రతిపాదనలు సరిగా ఉంటే ఓకే… లేదంటే వాటికవే రిజెక్ట్ అవుతాయి కదా. ఇందులో రాజకీయాల గోల అవసరం లేదంటూ చంద్రబాబు తేల్చేశారు. ఎలాగూ ఆయా కంపెనీలు నిబంధనలు పాటించకున్నా కూడా ఆ ఒప్పందాలను మధ్యలోనే రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది కదా అన్న బాబు మాటతో మంత్రులు మిన్నకుండిపోయారట,.
వారణాసి విడుదల ఇంకో ఏడాది టైం ఉందని, పదే పదే మహేష్ బాబు రీ రిలీజులను క్యూ కట్టడం ఎంత…
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…