ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయంటే… కూటమి సర్కారు పెట్టుబడులకు ఏ మేర ప్రాధాన్యం ఇస్తుందో ఇట్టే చెప్పేయొచ్చు. సోమవారం నాటి కేబినెట్ భేటీలోనూ పెట్టుబడులపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సోలార్ ప్లేట్ల తయారీ కోసం ఏపీలో భారీ పెట్టుబడులు పెడుతున్న శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అంశం ప్రస్తావనకు వచ్చింది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద ఈ కంపెనీకి ఏకంగా 8,365 ఎకరాల భూమిని కేటాయించారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ వైసీపీ కీలక నేతల బినామీ కంపెనీగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
కేబినెట్ బేటీలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన పలువురు మంత్రులు వైసీపీ నేతలకు చెందిన కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున భూములు కేటాయించడం సరికాదేమోనని అన్నారట. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమే మంచిదని కూడా వారు అభిప్రాయపడ్డారట. ఈ సందర్బంగా కలుగజేసుకున్న సీఎం చంద్రబాబు…పెట్టుబడుల విషయంలో రాజకీయాల గోల ఎందుకని ప్రశ్నించారట. ఆయా కంపెనీలు పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తున్నప్పుడు.. వాటి ప్రతిపాదనలను పరిశీలించి… అవసరమైన మేరకు ప్రోత్సాహం ఇద్దామని తెలిపారట. అంతేకాకుండా పార్టీల గోలను పక్కనపెట్టి…ఆయా కంపెనీలు నిబంధనలను పాటిస్తున్నాయా? లేదా? అన్నదానిని ఆధారంగా చేసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన తేల్చేశారట.
నిజమే మరి… చాలా కంపెనీలకు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండటమో… లేదంటే రాజకీయ నేతల ఆధ్వర్యంలోనే ఆయా కంపెనీలు నడుస్తుండటమో కొత్తేమీ కాదు. రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడేలా… రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలను రావొద్దని చెప్పడం కుదరదు. అలా చేస్తే.. ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ కూడా ఆ నిందను మోయాల్సి వస్తుంది. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు సమర్పించే ప్రతిపాదనలు సరిగా ఉంటే ఓకే… లేదంటే వాటికవే రిజెక్ట్ అవుతాయి కదా. ఇందులో రాజకీయాల గోల అవసరం లేదంటూ చంద్రబాబు తేల్చేశారు. ఎలాగూ ఆయా కంపెనీలు నిబంధనలు పాటించకున్నా కూడా ఆ ఒప్పందాలను మధ్యలోనే రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది కదా అన్న బాబు మాటతో మంత్రులు మిన్నకుండిపోయారట,.
This post was last modified on March 18, 2025 4:33 pm
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…