ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయంటే… కూటమి సర్కారు పెట్టుబడులకు ఏ మేర ప్రాధాన్యం ఇస్తుందో ఇట్టే చెప్పేయొచ్చు. సోమవారం నాటి కేబినెట్ భేటీలోనూ పెట్టుబడులపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సోలార్ ప్లేట్ల తయారీ కోసం ఏపీలో భారీ పెట్టుబడులు పెడుతున్న శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అంశం ప్రస్తావనకు వచ్చింది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద ఈ కంపెనీకి ఏకంగా 8,365 ఎకరాల భూమిని కేటాయించారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ వైసీపీ కీలక నేతల బినామీ కంపెనీగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
కేబినెట్ బేటీలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన పలువురు మంత్రులు వైసీపీ నేతలకు చెందిన కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున భూములు కేటాయించడం సరికాదేమోనని అన్నారట. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమే మంచిదని కూడా వారు అభిప్రాయపడ్డారట. ఈ సందర్బంగా కలుగజేసుకున్న సీఎం చంద్రబాబు…పెట్టుబడుల విషయంలో రాజకీయాల గోల ఎందుకని ప్రశ్నించారట. ఆయా కంపెనీలు పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తున్నప్పుడు.. వాటి ప్రతిపాదనలను పరిశీలించి… అవసరమైన మేరకు ప్రోత్సాహం ఇద్దామని తెలిపారట. అంతేకాకుండా పార్టీల గోలను పక్కనపెట్టి…ఆయా కంపెనీలు నిబంధనలను పాటిస్తున్నాయా? లేదా? అన్నదానిని ఆధారంగా చేసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన తేల్చేశారట.
నిజమే మరి… చాలా కంపెనీలకు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండటమో… లేదంటే రాజకీయ నేతల ఆధ్వర్యంలోనే ఆయా కంపెనీలు నడుస్తుండటమో కొత్తేమీ కాదు. రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడేలా… రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలను రావొద్దని చెప్పడం కుదరదు. అలా చేస్తే.. ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ కూడా ఆ నిందను మోయాల్సి వస్తుంది. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు సమర్పించే ప్రతిపాదనలు సరిగా ఉంటే ఓకే… లేదంటే వాటికవే రిజెక్ట్ అవుతాయి కదా. ఇందులో రాజకీయాల గోల అవసరం లేదంటూ చంద్రబాబు తేల్చేశారు. ఎలాగూ ఆయా కంపెనీలు నిబంధనలు పాటించకున్నా కూడా ఆ ఒప్పందాలను మధ్యలోనే రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది కదా అన్న బాబు మాటతో మంత్రులు మిన్నకుండిపోయారట,.
This post was last modified on March 18, 2025 4:33 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…