ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి సోమవారం మరో షాక్ తగిలింది. ఇప్పటికే గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. పోసానిని తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు… పోసానిని ఒక్క రోజు విచారించేందుకు పోలీసులకు అనుమతించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసానిని విచారించేందకు కోర్టు పోలీసులకు అనుమతించింది.
వైసీపీ అధికారంలో ఉండగా…ఆ పార్టీ నేతగా కొనసాగిన పోసాని…టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లతో పాటు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పదజాలంతో దూషించారు. పోసాని వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బ తీశాయంటూ టీడీపీ, జనసేనలకు చెందిన పలువురు కార్యకర్తలు తమ పరిదిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోసానిపై దాదాపుగా 17 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో కొన్ని కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న పోసాని.. హైకోర్టు ఆర్డర్స్ తో మరికొన్ని కేసుల్లో అరెస్టు నుంచి మినహాయింపు పొందారు.
ఇక విడుదలే తరువాయి అన్నట్లుగా పరిస్థితి మారిపోయిన సందర్భంగా సీఐడీ పోలీసులు ఎంట్రీ ఇచ్చి… వారు నమోదు చేసిన కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే పోసాని ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్నారు. ఈ కేసులోనూ బెయిల్ కోసం పోసాని దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం కోర్టు విచారణ చేపట్టనుంది. బెయిల్ పై విచారణ జరుగుతున్న రోజే పోసానిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ కేసుల్లో ఆయనను విచారించనున్నారు. మరి ఈ విచారణలో పోసాని పోలీసులకు ఎలాంటి వివరాలు చెబుతారోనన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
This post was last modified on March 17, 2025 9:05 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…