నిజమే… తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి యావత్తు రాష్ట్రాన్ని గెలిచారు. అదేంటీ… 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే… ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చిన రేవంత్ సీఎం సీటుపై కూర్చున్నారు కదా. ఇప్పుడు తెలంగాణను ఆయన గెలవడం ఏమిటి అంటారా? సోమవారం నాటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కాస్తంత లోతుగా పరిశీలిస్తే… నిజంగానే రేవంత్ రెడ్డి తెలంగాణను గెలిచారు అని ఒప్పుకుని తీరతారు.
నిజమే మరి.. 2023 ఎన్నికల్లో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సగానికి పైగా అసెంబ్లీ సీట్లను మాత్రమే గెలిచింది గానీ… అన్ని సీట్లను గెలవలేదు కదా. అందుకేగా…ఇప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ అధికార పక్షంగా ఉండగా… బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ లాంటి పార్టీలు విపక్షాలుగా ఉన్నాయి కదా. అంటే… నాడు తెలంగాణను రేవంత్ సంపూర్ణంగా గెలవలేదు. అయితే సోమవారం రేవంత్ సర్కారు ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సభలోని అన్ని పక్షాలు మద్దతు పలికాయి. అంటే…రేవంత్ ప్రతిపాదనకు మిత్రపక్షం సీపీఐతో పాటుగా విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్… అందరూ రైట్ చెప్పేశారు. అంటే రేవంత్ తెలంగాణను గెలిచేసినట్టే కదా.
ఇటీవలే తెలంగాణలో రేవంత్ సర్కారు కుల గణనను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కుల గణనలో ఏ కుల జనాభా ఎంత ఉందో అంతే స్థాయిలో ఆ వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అందాలన్న దిశగా రేవంత్ సర్కారు సాగింది. కుల గణనలో బీసీల 42 శాతం ఉన్నట్లుగా తేలగా… ఆ మేరకు బీసీల రిజర్వేషన్లను ఒకేసారి 4 శాతానికి పెంచుతూ ఓ బిల్లు రూపొందించింది. సదరు బిల్లును సోమవారం నాటి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఎలాగూ అదికార పక్షం కాంగ్రెస్, మిత్రపక్షం సీపీఐ ఆమోదం తెలపగా… విపక్షాలుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు కూడా అనూహ్యంగా ఆమోదం తెలిపాయి. పలితంగా రేవంత్ రెడ్డి యావత్తు తెలంగాణను జయించేసినట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 17, 2025 6:59 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…