Political News

మార్షల్స్ ను పెట్టి వైసీపీ సభ్యులను సభలోకి తేవాలి: లోకేశ్

సాధారణంగా శాసన సభ లేదా శాసన మండలిలో ఏదైనా పార్టీకి చెందిన సభ్యులు హద్దుమీరి ప్రవర్తిస్తే మార్షల్స్ రంగ ప్రవేశం చేస్తారు. సభలో గందరగోళం సృష్టించి సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న సభ్యులను సభ నుంచి బయటకు పంపిస్తారు. ఇంకా మాట వినని సభ్యులెవరైనా ఉంటే వారిని మార్షల్స్ బలవంతంగా ఎత్తుకు తీసుకువెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, మంత్రి నారా లోకేశ్ మాత్రం మార్షల్స్ ను మరోలా ఉపయోగించుకోవచ్చంటూ శాసన మండలి ఛైర్మన్ మోషెస్ రాజుకు సరికొత్త ఐడియా ఇచ్చారు. సభ నుంచి పారిపోతున్న వైసీపీ సభ్యులను సభ లోపలికి తెచ్చేందుకు మార్షల్స్ సాయం తీసుకోవాలని లోకేశ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

2019-24 వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చను నిరసిస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఆ అంశంపై చర్చకు అనుమతిస్తూ మండలి ఛైర్మన్ ఆదేశాలు జారీ చేశారని, బీఏసీలో వైసీపీ సభ్యులు అంగీకరించారని లోకేశ్ గుర్తు చేశారు. ఆ అంశంపై సమాధానం ఇస్తుండగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారని లోకేశ్ ఫైర్ అయ్యారు. వైసీపీ సభ్యులు ఆరోపణలు చేసి పారిపోతారని, సమాధానానికి సమయం ఇవ్వరని, సమాధానం ఇచ్చే సమయంలో సభలో ఉండరని ఆగ్రహం వ్యక్తం చేశఆరు.

పదేపదే ఈ విధంగా చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. గతంలో మార్షల్స్‌ను పెట్టి సభను నడిపించిన పరిస్థితి ఉందని, ఇప్పుడు మార్షల్స్‌ను పెట్టి బయట ఉన్న వైసీపీ సభ్యులను సభకు తీసుకు వచ్చే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఆ అధికారం ఛైర్మన్‌కు ఉందని గుర్తు చేశారు. మార్షల్స్ ను పెట్టి బయటకు వెళ్లిన వైసీపీ సభ్యులను లోపలికి తీసుకురావాలని ఛైర్మన్‌ను లోకేశ్ కోరిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This post was last modified on March 17, 2025 6:57 pm

Share
Show comments
Published by
Satya
Tags: LokeshYSRCP

Recent Posts

రోహిత్ శర్మ… ఒక్క ఫోటోతో పొలిటికల్ అలజడి!

ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవడం…

7 minutes ago

గోవింద‌ప్ప‌కు జైలు.. ఇక నోరు విప్పడమే తరువాయి

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ స్కాంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితుడు(ఏ-33)కి విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్…

10 minutes ago

పాక్ కు మద్దతు ఇచ్చిన దేశాలకు ఊహించని నష్టాలు

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా దేశభక్తి జ్వాలలు మిన్నంటుతున్నాయి. పాక్‌కు మద్దతు పలికిన…

33 minutes ago

ఉన్నది ఇద్దరే!.. ప్రాధాన్యం ఎనలేనిదే!

నిజమే.. ఏపీలోని కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి లోక్ సభలో ఉన్నది ఇద్దరంటే ఇద్దరు సభ్యులు మాత్రమే.…

36 minutes ago

నాని ప్లస్ అనిరుధ్ – అదిరిపోయే రేటు

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ సెట్లో ఇంకా హీరో అడుగు పెట్టకుండానే…

1 hour ago

ప్రభాస్ ఉండగా దీపికకు అంత రెమ్యునరేషనా

కల్కి 2898 ఏడిలో హీరోయిన్ గా కనిపించేది ఎక్కువసేపు కాకపోయినా ప్రాధాన్యం దక్కించుకున్న దీపికా పదుకునే రెండో భాగంలో ఉంటుందో…

2 hours ago