Political News

అలా అయితే.. స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లండి: ర‌ఘురామ‌

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ‌రాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌భ‌లో టీడీపీ స‌హా కొందరు జ‌న‌సేన స‌భ్యుల‌పై ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అలా అయితే.. స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లండి! అని వ్యాఖ్యానించారు. దీంతో స‌భ్యులు ఉలిక్కిప‌డ్డారు. దీనిపై ఎవ‌రూ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌క‌పోయినా.. డిప్యూటీ స్పీక‌ర్ వ్యాఖ్య‌ల‌పై మాత్రం విస్మ‌యం వ్య‌క్తం చేశారు. దీంతో స‌భ‌లో కొన్ని నిమిషాల పాటు మౌనం ఆవ‌హించింది.

ఏం జ‌రిగింది?

సోమ‌వారం.. అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో కొన్ని బిల్లుల‌ను ప్ర‌వేశ పెట్టారు. అయితే.. అదేస‌మ‌యంలో కొంద‌రు స‌భ్యులు ఫోన్ల‌లో మెసేజ్‌లు చూసుకుంటున్నారు. మ‌రికొంద‌రు చేతిని అడ్డు పెట్టుకుని ఫోన్లు మాట్లాడుతున్నారు. ఇంకొంద‌రు చాటింగ్ చేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన డిప్యూటీ స్పీక‌ర్‌.. ర‌ఘురామ‌రాజు.. స‌భ్యుల‌ను క‌ఠినంగానే హెచ్చ‌రించారు.

“అసెంబ్లీలో కొంద‌రు సభ్యులు ఫోన్ మాట్లాడుతున్నారు. మ‌రికొంద‌రు చాటింగ్ చేస్తున్నారు. ఇది ప‌విత్ర మైన స‌భ‌లో స‌రికాదు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర వేదిక. ఇక్కడి గౌరవాన్ని అన్ని సందర్భాల్లో రక్షించాల్సిన బాధ్యత సభ్యులపై ఉంటుంది” అని వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు స‌భ్యుల‌కు సూచ‌న‌లు చేయాల్సిన అవ‌స‌రం రాద‌ని తాను భావించిన‌ట్టు తెలిపారు. కానీ, స‌భ్యులు రోజు రోజు కు మాత్రం ఫోన్లలో మునిగి తేలుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు హెచ్చ‌రించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌న్నారు. స‌భ‌లో పోన్లు మాట్లాడ‌డానికి వీల్లేద‌ని వ్యాఖ్యానించారు. పార్ల‌మెంటులో అయితే.. ఫోన్ల‌ను లోప‌లికి తీసుకురానివ్వ‌బోర‌ని కూడా తెలిపా రు. కానీ, అసెంబ్లీలో అనుమతిస్తున్నామ‌ని చెప్పారు. ఫోన్‌ల‌ను సభ్యులు సైలెంట్‌లో పెట్టుకోవాలన్నారు. అంత అ్య‌త‌వ‌స‌రంగా ఫోన్లు వినియోగించుకోవాల్సి వ‌స్తే.. బ‌య‌ట‌కు వెళ్లి మాట్లాడాల‌ని సూచించారు. లేక‌పోతే.. ఇక‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌న్నారు.

This post was last modified on March 17, 2025 6:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

53 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago