Political News

అలా అయితే.. స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లండి: ర‌ఘురామ‌

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ‌రాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌భ‌లో టీడీపీ స‌హా కొందరు జ‌న‌సేన స‌భ్యుల‌పై ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అలా అయితే.. స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లండి! అని వ్యాఖ్యానించారు. దీంతో స‌భ్యులు ఉలిక్కిప‌డ్డారు. దీనిపై ఎవ‌రూ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌క‌పోయినా.. డిప్యూటీ స్పీక‌ర్ వ్యాఖ్య‌ల‌పై మాత్రం విస్మ‌యం వ్య‌క్తం చేశారు. దీంతో స‌భ‌లో కొన్ని నిమిషాల పాటు మౌనం ఆవ‌హించింది.

ఏం జ‌రిగింది?

సోమ‌వారం.. అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో కొన్ని బిల్లుల‌ను ప్ర‌వేశ పెట్టారు. అయితే.. అదేస‌మ‌యంలో కొంద‌రు స‌భ్యులు ఫోన్ల‌లో మెసేజ్‌లు చూసుకుంటున్నారు. మ‌రికొంద‌రు చేతిని అడ్డు పెట్టుకుని ఫోన్లు మాట్లాడుతున్నారు. ఇంకొంద‌రు చాటింగ్ చేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన డిప్యూటీ స్పీక‌ర్‌.. ర‌ఘురామ‌రాజు.. స‌భ్యుల‌ను క‌ఠినంగానే హెచ్చ‌రించారు.

“అసెంబ్లీలో కొంద‌రు సభ్యులు ఫోన్ మాట్లాడుతున్నారు. మ‌రికొంద‌రు చాటింగ్ చేస్తున్నారు. ఇది ప‌విత్ర మైన స‌భ‌లో స‌రికాదు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర వేదిక. ఇక్కడి గౌరవాన్ని అన్ని సందర్భాల్లో రక్షించాల్సిన బాధ్యత సభ్యులపై ఉంటుంది” అని వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు స‌భ్యుల‌కు సూచ‌న‌లు చేయాల్సిన అవ‌స‌రం రాద‌ని తాను భావించిన‌ట్టు తెలిపారు. కానీ, స‌భ్యులు రోజు రోజు కు మాత్రం ఫోన్లలో మునిగి తేలుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు హెచ్చ‌రించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌న్నారు. స‌భ‌లో పోన్లు మాట్లాడ‌డానికి వీల్లేద‌ని వ్యాఖ్యానించారు. పార్ల‌మెంటులో అయితే.. ఫోన్ల‌ను లోప‌లికి తీసుకురానివ్వ‌బోర‌ని కూడా తెలిపా రు. కానీ, అసెంబ్లీలో అనుమతిస్తున్నామ‌ని చెప్పారు. ఫోన్‌ల‌ను సభ్యులు సైలెంట్‌లో పెట్టుకోవాలన్నారు. అంత అ్య‌త‌వ‌స‌రంగా ఫోన్లు వినియోగించుకోవాల్సి వ‌స్తే.. బ‌య‌ట‌కు వెళ్లి మాట్లాడాల‌ని సూచించారు. లేక‌పోతే.. ఇక‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌న్నారు.

Satya

Recent Posts

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

7 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago