ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ సహా కొందరు జనసేన సభ్యులపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలా అయితే.. సభ నుంచి బయటకు వెళ్లండి! అని వ్యాఖ్యానించారు. దీంతో సభ్యులు ఉలిక్కిపడ్డారు. దీనిపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యలపై మాత్రం విస్మయం వ్యక్తం చేశారు. దీంతో సభలో కొన్ని నిమిషాల పాటు మౌనం ఆవహించింది.
ఏం జరిగింది?
సోమవారం.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కొన్ని బిల్లులను ప్రవేశ పెట్టారు. అయితే.. అదేసమయంలో కొందరు సభ్యులు ఫోన్లలో మెసేజ్లు చూసుకుంటున్నారు. మరికొందరు చేతిని అడ్డు పెట్టుకుని ఫోన్లు మాట్లాడుతున్నారు. ఇంకొందరు చాటింగ్ చేస్తున్నారు. ఈ పరిణామాలను గమనించిన డిప్యూటీ స్పీకర్.. రఘురామరాజు.. సభ్యులను కఠినంగానే హెచ్చరించారు.
“అసెంబ్లీలో కొందరు సభ్యులు ఫోన్ మాట్లాడుతున్నారు. మరికొందరు చాటింగ్ చేస్తున్నారు. ఇది పవిత్ర మైన సభలో సరికాదు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర వేదిక. ఇక్కడి గౌరవాన్ని అన్ని సందర్భాల్లో రక్షించాల్సిన బాధ్యత సభ్యులపై ఉంటుంది” అని వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటి వరకు సభ్యులకు సూచనలు చేయాల్సిన అవసరం రాదని తాను భావించినట్టు తెలిపారు. కానీ, సభ్యులు రోజు రోజు కు మాత్రం ఫోన్లలో మునిగి తేలుతున్నారని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హెచ్చరించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. సభలో పోన్లు మాట్లాడడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో అయితే.. ఫోన్లను లోపలికి తీసుకురానివ్వబోరని కూడా తెలిపా రు. కానీ, అసెంబ్లీలో అనుమతిస్తున్నామని చెప్పారు. ఫోన్లను సభ్యులు సైలెంట్లో పెట్టుకోవాలన్నారు. అంత అ్యతవసరంగా ఫోన్లు వినియోగించుకోవాల్సి వస్తే.. బయటకు వెళ్లి మాట్లాడాలని సూచించారు. లేకపోతే.. ఇకపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.
This post was last modified on March 17, 2025 6:46 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…