ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ సహా కొందరు జనసేన సభ్యులపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలా అయితే.. సభ నుంచి బయటకు వెళ్లండి! అని వ్యాఖ్యానించారు. దీంతో సభ్యులు ఉలిక్కిపడ్డారు. దీనిపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యలపై మాత్రం విస్మయం వ్యక్తం చేశారు. దీంతో సభలో కొన్ని నిమిషాల పాటు మౌనం ఆవహించింది.
ఏం జరిగింది?
సోమవారం.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కొన్ని బిల్లులను ప్రవేశ పెట్టారు. అయితే.. అదేసమయంలో కొందరు సభ్యులు ఫోన్లలో మెసేజ్లు చూసుకుంటున్నారు. మరికొందరు చేతిని అడ్డు పెట్టుకుని ఫోన్లు మాట్లాడుతున్నారు. ఇంకొందరు చాటింగ్ చేస్తున్నారు. ఈ పరిణామాలను గమనించిన డిప్యూటీ స్పీకర్.. రఘురామరాజు.. సభ్యులను కఠినంగానే హెచ్చరించారు.
“అసెంబ్లీలో కొందరు సభ్యులు ఫోన్ మాట్లాడుతున్నారు. మరికొందరు చాటింగ్ చేస్తున్నారు. ఇది పవిత్ర మైన సభలో సరికాదు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర వేదిక. ఇక్కడి గౌరవాన్ని అన్ని సందర్భాల్లో రక్షించాల్సిన బాధ్యత సభ్యులపై ఉంటుంది” అని వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటి వరకు సభ్యులకు సూచనలు చేయాల్సిన అవసరం రాదని తాను భావించినట్టు తెలిపారు. కానీ, సభ్యులు రోజు రోజు కు మాత్రం ఫోన్లలో మునిగి తేలుతున్నారని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హెచ్చరించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. సభలో పోన్లు మాట్లాడడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో అయితే.. ఫోన్లను లోపలికి తీసుకురానివ్వబోరని కూడా తెలిపా రు. కానీ, అసెంబ్లీలో అనుమతిస్తున్నామని చెప్పారు. ఫోన్లను సభ్యులు సైలెంట్లో పెట్టుకోవాలన్నారు. అంత అ్యతవసరంగా ఫోన్లు వినియోగించుకోవాల్సి వస్తే.. బయటకు వెళ్లి మాట్లాడాలని సూచించారు. లేకపోతే.. ఇకపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.
This post was last modified on March 17, 2025 6:46 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…