Political News

వైసీపీ నేత‌లు.. కూలీల సొమ్ము 250 కోట్లు కొట్టేశారు:  ప‌వ‌న్‌

ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రో సారి త‌న విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించారు. గ‌త వైసీపీ పాల‌న‌పై ఆయ‌న దుమ్మెత్తి పోశారు. అనేక వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్ర‌భుత్వం.. చివ‌ర‌కు రెక్కాడితేకానీ.. డొక్కాడ‌ని కూలీల సొమ్మును కూడా కొట్టేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఉపాధి హామీ ప‌థ‌కం కింద‌.. కూలీల‌కు ద‌క్కాల్సిన రూ.250 కోట్ల‌ను వైసీపీ నాయ‌కులు సొంతం చేసుకున్నార‌ని ఆధారాల‌తో స‌హా స‌భ‌కు వివ‌రించారు.

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని రాజ‌కీయ ఉపాధి హామీ ప‌థ‌కంగా వైసీపీ నాయ‌కులు మార్చుకున్నార‌ని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. తాను పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే.. కూలీల‌కు న్యాయం చేసేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాన‌న్నారు. ఈ క్ర‌మంలోనే  ఉపాధి హామీ పథకాన్ని అంద‌రికీ చేరువ చేసి.. కూలీల క‌డుపు నింపాల‌ని భావించిన‌ట్టు చెప్పారు. అయితే.. వైసీపీ హ‌యాంలో ఈ ప‌థ‌కం అమ‌లు చేసిన‌ప్పుడు కోట్ల రూపాయ‌లను కొట్టేసిన విష‌యం వెలుగు చూసింద‌న్నారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ప‌థ‌కం నీరు గారిపోయింద‌న్నారు. ఉపాధి హామీ పథకం లో అవకతవకలు జరుగకుండా చూడాల్సిన వ్యక్తే అవినీతికి పాల్పడినట్లు గుర్తించామ‌న్నారు. రూ.250 కోట్ల అవినీతి ఉపాధి హామీ ప‌థ‌కంలో జ‌రిగింద‌ని తెలిసిన త‌ర్వాత‌.. నా నోట మాట రాలేద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అయితే.. ఈఅవినీతిని ప‌క్కాగా చేయ‌డంతో సాక్ష్యాధారాల‌ను కూడా లేకుండా చేశార‌ని తెలిపారు. దీంతో రూ.250 కోట్ల‌లో కేవ‌లం రూ.74 కోట్లు మాత్రమే రికవరీ  అవుతుంద‌ని అంచ‌నా వేసిన‌ట్టు చెప్పారు.

ఎలాంటి ఉపాధి ప‌నులు చేయకుండానే చేసినట్లు రాసి సొమ్ములు తీసుకున్నార‌ని ప‌వ‌న్ ఆరోపించారు. ఉపాధి హామీలో సభ్యులు అడిగినట్టు వేజెస్ పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంద ని.. ఇలా.. కేంద్రం నుంచి వ‌చ్చిన సొమ్మును కూడా.. కాజేశార‌ని.. ఒక్క‌రికి నెల‌కు 15 రోజుల పాటు ప‌ని క‌ల్పించాల్సి ఉంటుంద‌ని.. కానీ.. వైసీపీ హ‌యాంలో ఒకే వ్య‌క్తికి నెల‌లో రెండు సార్లు ప‌ని క‌ల్పించిన‌ట్టు రాసి సొమ్ములు కాజేశార‌ని ఆరోపించారు. దీనిపై నిశితంగా దృష్టి పెట్టిన‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ వివ‌రించారు. 

This post was last modified on March 17, 2025 3:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

9 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

47 minutes ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

1 hour ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

5 hours ago