Political News

వైసీపీ నేత‌లు.. కూలీల సొమ్ము 250 కోట్లు కొట్టేశారు:  ప‌వ‌న్‌

ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రో సారి త‌న విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించారు. గ‌త వైసీపీ పాల‌న‌పై ఆయ‌న దుమ్మెత్తి పోశారు. అనేక వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్ర‌భుత్వం.. చివ‌ర‌కు రెక్కాడితేకానీ.. డొక్కాడ‌ని కూలీల సొమ్మును కూడా కొట్టేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఉపాధి హామీ ప‌థ‌కం కింద‌.. కూలీల‌కు ద‌క్కాల్సిన రూ.250 కోట్ల‌ను వైసీపీ నాయ‌కులు సొంతం చేసుకున్నార‌ని ఆధారాల‌తో స‌హా స‌భ‌కు వివ‌రించారు.

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని రాజ‌కీయ ఉపాధి హామీ ప‌థ‌కంగా వైసీపీ నాయ‌కులు మార్చుకున్నార‌ని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. తాను పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే.. కూలీల‌కు న్యాయం చేసేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాన‌న్నారు. ఈ క్ర‌మంలోనే  ఉపాధి హామీ పథకాన్ని అంద‌రికీ చేరువ చేసి.. కూలీల క‌డుపు నింపాల‌ని భావించిన‌ట్టు చెప్పారు. అయితే.. వైసీపీ హ‌యాంలో ఈ ప‌థ‌కం అమ‌లు చేసిన‌ప్పుడు కోట్ల రూపాయ‌లను కొట్టేసిన విష‌యం వెలుగు చూసింద‌న్నారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ప‌థ‌కం నీరు గారిపోయింద‌న్నారు. ఉపాధి హామీ పథకం లో అవకతవకలు జరుగకుండా చూడాల్సిన వ్యక్తే అవినీతికి పాల్పడినట్లు గుర్తించామ‌న్నారు. రూ.250 కోట్ల అవినీతి ఉపాధి హామీ ప‌థ‌కంలో జ‌రిగింద‌ని తెలిసిన త‌ర్వాత‌.. నా నోట మాట రాలేద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అయితే.. ఈఅవినీతిని ప‌క్కాగా చేయ‌డంతో సాక్ష్యాధారాల‌ను కూడా లేకుండా చేశార‌ని తెలిపారు. దీంతో రూ.250 కోట్ల‌లో కేవ‌లం రూ.74 కోట్లు మాత్రమే రికవరీ  అవుతుంద‌ని అంచ‌నా వేసిన‌ట్టు చెప్పారు.

ఎలాంటి ఉపాధి ప‌నులు చేయకుండానే చేసినట్లు రాసి సొమ్ములు తీసుకున్నార‌ని ప‌వ‌న్ ఆరోపించారు. ఉపాధి హామీలో సభ్యులు అడిగినట్టు వేజెస్ పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంద ని.. ఇలా.. కేంద్రం నుంచి వ‌చ్చిన సొమ్మును కూడా.. కాజేశార‌ని.. ఒక్క‌రికి నెల‌కు 15 రోజుల పాటు ప‌ని క‌ల్పించాల్సి ఉంటుంద‌ని.. కానీ.. వైసీపీ హ‌యాంలో ఒకే వ్య‌క్తికి నెల‌లో రెండు సార్లు ప‌ని క‌ల్పించిన‌ట్టు రాసి సొమ్ములు కాజేశార‌ని ఆరోపించారు. దీనిపై నిశితంగా దృష్టి పెట్టిన‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ వివ‌రించారు. 

This post was last modified on March 17, 2025 3:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

7 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

8 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

8 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

8 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

9 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

9 hours ago