Political News

వైసీపీ నేత‌లు.. కూలీల సొమ్ము 250 కోట్లు కొట్టేశారు:  ప‌వ‌న్‌

ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రో సారి త‌న విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించారు. గ‌త వైసీపీ పాల‌న‌పై ఆయ‌న దుమ్మెత్తి పోశారు. అనేక వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్ర‌భుత్వం.. చివ‌ర‌కు రెక్కాడితేకానీ.. డొక్కాడ‌ని కూలీల సొమ్మును కూడా కొట్టేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఉపాధి హామీ ప‌థ‌కం కింద‌.. కూలీల‌కు ద‌క్కాల్సిన రూ.250 కోట్ల‌ను వైసీపీ నాయ‌కులు సొంతం చేసుకున్నార‌ని ఆధారాల‌తో స‌హా స‌భ‌కు వివ‌రించారు.

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని రాజ‌కీయ ఉపాధి హామీ ప‌థ‌కంగా వైసీపీ నాయ‌కులు మార్చుకున్నార‌ని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. తాను పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే.. కూలీల‌కు న్యాయం చేసేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాన‌న్నారు. ఈ క్ర‌మంలోనే  ఉపాధి హామీ పథకాన్ని అంద‌రికీ చేరువ చేసి.. కూలీల క‌డుపు నింపాల‌ని భావించిన‌ట్టు చెప్పారు. అయితే.. వైసీపీ హ‌యాంలో ఈ ప‌థ‌కం అమ‌లు చేసిన‌ప్పుడు కోట్ల రూపాయ‌లను కొట్టేసిన విష‌యం వెలుగు చూసింద‌న్నారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ప‌థ‌కం నీరు గారిపోయింద‌న్నారు. ఉపాధి హామీ పథకం లో అవకతవకలు జరుగకుండా చూడాల్సిన వ్యక్తే అవినీతికి పాల్పడినట్లు గుర్తించామ‌న్నారు. రూ.250 కోట్ల అవినీతి ఉపాధి హామీ ప‌థ‌కంలో జ‌రిగింద‌ని తెలిసిన త‌ర్వాత‌.. నా నోట మాట రాలేద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అయితే.. ఈఅవినీతిని ప‌క్కాగా చేయ‌డంతో సాక్ష్యాధారాల‌ను కూడా లేకుండా చేశార‌ని తెలిపారు. దీంతో రూ.250 కోట్ల‌లో కేవ‌లం రూ.74 కోట్లు మాత్రమే రికవరీ  అవుతుంద‌ని అంచ‌నా వేసిన‌ట్టు చెప్పారు.

ఎలాంటి ఉపాధి ప‌నులు చేయకుండానే చేసినట్లు రాసి సొమ్ములు తీసుకున్నార‌ని ప‌వ‌న్ ఆరోపించారు. ఉపాధి హామీలో సభ్యులు అడిగినట్టు వేజెస్ పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంద ని.. ఇలా.. కేంద్రం నుంచి వ‌చ్చిన సొమ్మును కూడా.. కాజేశార‌ని.. ఒక్క‌రికి నెల‌కు 15 రోజుల పాటు ప‌ని క‌ల్పించాల్సి ఉంటుంద‌ని.. కానీ.. వైసీపీ హ‌యాంలో ఒకే వ్య‌క్తికి నెల‌లో రెండు సార్లు ప‌ని క‌ల్పించిన‌ట్టు రాసి సొమ్ములు కాజేశార‌ని ఆరోపించారు. దీనిపై నిశితంగా దృష్టి పెట్టిన‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ వివ‌రించారు. 

This post was last modified on March 17, 2025 3:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

1 hour ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

2 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

2 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

4 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

4 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

6 hours ago