Political News

వైసీపీ నేత‌లు.. కూలీల సొమ్ము 250 కోట్లు కొట్టేశారు:  ప‌వ‌న్‌

ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రో సారి త‌న విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించారు. గ‌త వైసీపీ పాల‌న‌పై ఆయ‌న దుమ్మెత్తి పోశారు. అనేక వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్ర‌భుత్వం.. చివ‌ర‌కు రెక్కాడితేకానీ.. డొక్కాడ‌ని కూలీల సొమ్మును కూడా కొట్టేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఉపాధి హామీ ప‌థ‌కం కింద‌.. కూలీల‌కు ద‌క్కాల్సిన రూ.250 కోట్ల‌ను వైసీపీ నాయ‌కులు సొంతం చేసుకున్నార‌ని ఆధారాల‌తో స‌హా స‌భ‌కు వివ‌రించారు.

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని రాజ‌కీయ ఉపాధి హామీ ప‌థ‌కంగా వైసీపీ నాయ‌కులు మార్చుకున్నార‌ని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. తాను పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే.. కూలీల‌కు న్యాయం చేసేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాన‌న్నారు. ఈ క్ర‌మంలోనే  ఉపాధి హామీ పథకాన్ని అంద‌రికీ చేరువ చేసి.. కూలీల క‌డుపు నింపాల‌ని భావించిన‌ట్టు చెప్పారు. అయితే.. వైసీపీ హ‌యాంలో ఈ ప‌థ‌కం అమ‌లు చేసిన‌ప్పుడు కోట్ల రూపాయ‌లను కొట్టేసిన విష‌యం వెలుగు చూసింద‌న్నారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ప‌థ‌కం నీరు గారిపోయింద‌న్నారు. ఉపాధి హామీ పథకం లో అవకతవకలు జరుగకుండా చూడాల్సిన వ్యక్తే అవినీతికి పాల్పడినట్లు గుర్తించామ‌న్నారు. రూ.250 కోట్ల అవినీతి ఉపాధి హామీ ప‌థ‌కంలో జ‌రిగింద‌ని తెలిసిన త‌ర్వాత‌.. నా నోట మాట రాలేద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అయితే.. ఈఅవినీతిని ప‌క్కాగా చేయ‌డంతో సాక్ష్యాధారాల‌ను కూడా లేకుండా చేశార‌ని తెలిపారు. దీంతో రూ.250 కోట్ల‌లో కేవ‌లం రూ.74 కోట్లు మాత్రమే రికవరీ  అవుతుంద‌ని అంచ‌నా వేసిన‌ట్టు చెప్పారు.

ఎలాంటి ఉపాధి ప‌నులు చేయకుండానే చేసినట్లు రాసి సొమ్ములు తీసుకున్నార‌ని ప‌వ‌న్ ఆరోపించారు. ఉపాధి హామీలో సభ్యులు అడిగినట్టు వేజెస్ పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంద ని.. ఇలా.. కేంద్రం నుంచి వ‌చ్చిన సొమ్మును కూడా.. కాజేశార‌ని.. ఒక్క‌రికి నెల‌కు 15 రోజుల పాటు ప‌ని క‌ల్పించాల్సి ఉంటుంద‌ని.. కానీ.. వైసీపీ హ‌యాంలో ఒకే వ్య‌క్తికి నెల‌లో రెండు సార్లు ప‌ని క‌ల్పించిన‌ట్టు రాసి సొమ్ములు కాజేశార‌ని ఆరోపించారు. దీనిపై నిశితంగా దృష్టి పెట్టిన‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ వివ‌రించారు. 

This post was last modified on March 17, 2025 3:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

47 minutes ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

51 minutes ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

3 hours ago

తమిళంలో అదరగొట్టిన చంద్రబాబు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…

3 hours ago

ధనుష్ కూడా ఇలా చేస్తే ఎలా?

పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్‌గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…

9 hours ago

ముంబై కమ్ బ్యాక్.. ఇది భయంకరమే..

​ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…

10 hours ago