Political News

బీఆర్ఎస్ కార్యాలయంలో తీన్మార్ మల్లన్న

తెలంగాణలో సోమవారం మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఆ పార్టీ శాసన మండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న… సోమవారం శాసన సభా ప్రాంగణంలో అందరి దృష్టిని ఆకర్షించారు. మండలి సమావేశాలకు మల్లన్న హాజరయ్యారో, లేదో తెలియదు గానీ… ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు చెందిన పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు మరో మాజీ మంత్రి హరీశ్ రావులతో ఆయన భేటీ అయ్యారు.

బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో తీన్మార్ మల్లన్న కనిపించినంతనే… కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేస్తే… బీఆర్ఎస్ లో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారా? అన్న దిశగా అందరూ షాక్ కు గురై అలా చూస్తూ ఉండిపోయారు. అయితే బీఆర్ఎస్ లో చేరడానికి మల్లన్న ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లలేదట. ఇంకెందుకోసం వచ్చారన్న విషయానికి వస్తే.. బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా మల్లన్న ధర్నాు దిగబోతున్నారట. ఆ ధర్నాకు మద్దతు ఇవ్వాలని కోరేందుకు ఆయన కేటీఆర్, హరీశ్ రావులను కలిశారట. ఈ మేరకు తమ ధర్నాకు మద్దతు తెలపాలంటూ మల్లన్న.. కేటీఆర్, హరీశ్ రావులకు ఓ వినతి పత్రం కూడా సమర్పించారు. 

వాస్తవానికి బీఆర్ఎస్ తో మల్లన్నకు ఆది నుంచి వైరం ఉంది. గతంలో ఖమ్మం పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా… అప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేసిన మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. నాడు బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి బరిలోకి దిగారు. అయితే మల్లన్న తనదైన మార్కు ప్రచారం సాగించి గ్రాడ్యుయేట్స్ ను భారీ సంఖ్యలోనే తన వైపునకు తిప్పుకున్నారు. ఓ వైపు మల్లన్న, మరోవైపు రాజేశ్వరరెడ్డి హోరాహోరీ పోరు సాగించారు. బరిలో గట్టి పోటీ ఇచ్చిన మల్లన్న బీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించారు. ఒకానొక దశలో మల్లన్న విజయం సాధిస్తారేమోనన్న దిశగానే కౌంటింగ్ సాగింది. అయితే చివరకు అతి తక్కువ మెజారిటీతో రాజేశ్వర రెడ్డి విజయం సాధించారు. అలాంటి బీఆర్ఎస్ కార్యాలయంలో ఇప్పుడు మల్లన్న కనిపించడం ఆసక్తి రేకెత్తించింది. 

This post was last modified on March 17, 2025 2:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

3 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

8 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

9 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

9 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

9 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

9 hours ago