Political News

లోకేష్‌కు కీల‌క ప‌ద‌వి: మ‌హానాడు.. మామూలుగా ఉండేలా లేదే.. !

టీడీపీకి మ‌హానాడు అనేది ప్రాణ ప్ర‌దం. ఈ విష‌యంలో ఎలాంటి తేడా లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అనేక సంస్క‌ర‌ణ‌ల‌కు పెద్ద‌పీట వేసిన పార్టీలో మ‌హానాడుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. గ‌తంలో అన్నగారు ప్రారంభించిన ఈ సంస్కృతిని ప్ర‌స్తుతం చంద్ర‌బాబు వ‌ర‌కు అంద‌రూ పాటిస్తున్నారు. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు.. కీల‌క ప్రాంతాల‌ను ఎంపిక చేసుకుని నిర్వ‌హించే మ‌హానాడుకు ఈ ద‌ఫా క‌డ‌ప వేదిక‌గా మార‌నుంది.

క‌డ‌ప‌లోనూ.. వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లోనే మ‌హానాడును నిర్వ‌హించాలని నిర్ణ‌యించారు. అయితే.. వేదిక‌పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలావుంటే.. క‌డ‌ప‌లో ఎక్క‌డ నిర్వ‌హించినా.. మ‌హానాడుకు ఒక చ‌రిత్రను తొడిగిన‌ట్టే అవుతుంది. 45 సంవ‌త్స‌రాల పార్టీ చ‌రిత్ర‌లో తొలిసారి క‌డ‌ప‌లో నిర్వ‌హిస్తుండ‌డం ఇదే తొలిసారి. అంతేకాదు.. ఈ వేదిక‌గా.. పార్టీకి భ‌విత‌వ్యాన్ని మ‌రింత గ‌ట్టిగా తీర్చిదిద్దే వుద్దేశం కూడా క‌నిపిస్తోంది.

ఈ మ‌హానాడు వేదిక‌గానే.. నారా లోకేష్‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా టీడీపీని బ‌లంగా ముందుకు తీసుకువెళ్తున్న నారా లోకేష్‌కు కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్ష ప‌ద‌విని క్రియేట్ చేసి ఇస్తార‌ని.. పార్టీలో అత్యంత సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు. నిజానికి నాలుగేళ్ల కింద‌ట కూడా.. ఇదే మాట వినిపించింది. కానీ, అప్ప‌ట్లో సాకారం కాలేదు. ఈ ద‌ఫా ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

అదేస‌మయంలో పాత త‌రం నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్టి యువ త‌రానికి ప‌గ్గాలు అప్ప‌గించే విష‌యంపైనా మ‌హానాడు వేదిక‌గా మార‌నుంద‌ని తెలుస్తోంది. నారా లోకేష్ ఇటీవ‌ల కాలంలో చెబుతున్న‌ట్టు 33 శాతం మంది యువ‌త కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్న విషయం ఈ వేదిక నుంచే సాకారం అయ్యే అవ‌కాశం ఉంటుం దని తెలుస్తోంది. అదేస‌మ‌యంలో పార్టీ భ‌విత‌వ్యం.. 2047 వ‌రకుఅధికారంలో కొన‌సాగేందుకు అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను కూడా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

This post was last modified on March 16, 2025 9:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

33 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago