Political News

21 ప‌ద‌వులు.. 60 వేల ద‌రఖాస్తులు..

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అనేక మందికి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. నామినేటెడ్ ప‌ద‌వుల‌తో సంతృప్తి క‌లిగిస్తున్నారు. ఎన్ని ప‌ద‌వులు ఇచ్చినా.. ఇంకా వేలాది మంది పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప‌ద‌వులు ద‌క్క‌క ఎదురు చూస్తున్నారు. తాజాగా రెండు రోజుల కింద‌ట‌.. మ‌ళ్లీ నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. రాష్ట్రంలోని 21 ప్ర‌ముఖ దేవాల‌యాల‌కు బోర్డులు ఏర్పాటు చేసి.. వాటికి చైర్మ‌న్‌లుగా కూట‌మి పార్టీల నాయ‌కుల‌ను నియ‌మించాల‌ని భావించారు.

ఈ క్ర‌మంలోనే సీఎం చంద్ర‌బాబు ఆయా ప‌ద‌వుల‌కు ఓపెన్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. 21 ఆల‌యాల ట్ర‌స్టు బోర్డు చైర్మ‌న్‌ ప‌ద‌వుల‌ను ఆశించేవారు.. ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని కోరారు. ఇంకేముంది.. కేవ‌లం రెండు రోజుల్లోనే 60 వేల‌కుపైగా ద‌ర‌ఖాస్తులు అందాయి. ఈ విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌త్యేక పోర్ట‌ల్ ద్వారా 40 వేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. మ‌రో 20 వేల మందికి పైగా ఆఫ్ లైన్‌లో త‌న కార్యాల‌యానికి ద‌ర‌ఖాస్తులు పంపార‌ని చంద్ర‌బాబు అన్నారు.

అంటే.. ఉన్న 21 పోస్టుల‌కు 60 వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయంటే.. ఒక్కొక్క ప‌ద‌వికి 3000 మంది చొప్పున పార్టీ నాయ‌కులు పోటీ ప‌డుతున్నార‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంది. ఇప్పుడు వీరిని స్క్రూటినీ చేసే బాధ్య‌తను జిల్లాల నాయ‌కుల‌కు అప్ప‌గించారు. ఆయా జిల్లాల నుంచి వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అక్క‌డ‌కే పంపించి.. ఎమ్మెల్యేలు వీరిలో ఉత్త‌మ‌మైన నాయ‌కుల‌ను, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి ఎంపిక చేయాల‌ని సూచించారు.

మ‌రి ఏ మేర‌కు ఈ ప‌ద‌వులు ఎవ‌రికి ద‌క్కుతాయో చూడాలి. ఇవి కాకుండా.. సిఫార‌సులు, పార్టీలో సీనియ‌ర్ల ఒత్తిళ్లు.. ఇలా అనేకం కూడా ఉన్నాయి. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. 21 పోస్టుల‌కు ఎంత మంది ఎంపిక అవుతారో చూడాలి. ఇక‌, ఎమ్మెల్యేలు.. స్థానిక నాయ‌కులు .. వీరిలో ఎంత మందికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తార‌నేది కూడా ఆస‌క్తిగానే మారింది. చూడాలి ఏం జ‌రుగుతుందో. ఒక‌ర‌కంగా వీరిని ఎంపిక చేసి ఆయా ప‌ద‌వులు ఇవ్వ‌డం అనేది చంద్ర‌బాబు కు ఒక పెద్ద టెస్టేన‌ని చెప్పాలి.

This post was last modified on March 16, 2025 12:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

39 minutes ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

3 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

3 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago