కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని పదవులు ఇచ్చినా.. ఇంకా వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పదవులు దక్కక ఎదురు చూస్తున్నారు. తాజాగా రెండు రోజుల కిందట.. మళ్లీ నామినేటెడ్ పదవుల వ్యవహారం తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలోని 21 ప్రముఖ దేవాలయాలకు బోర్డులు ఏర్పాటు చేసి.. వాటికి చైర్మన్లుగా కూటమి పార్టీల నాయకులను నియమించాలని భావించారు.
ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఆయా పదవులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. 21 ఆలయాల ట్రస్టు బోర్డు చైర్మన్ పదవులను ఆశించేవారు.. దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఇంకేముంది.. కేవలం రెండు రోజుల్లోనే 60 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా 40 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. మరో 20 వేల మందికి పైగా ఆఫ్ లైన్లో తన కార్యాలయానికి దరఖాస్తులు పంపారని చంద్రబాబు అన్నారు.
అంటే.. ఉన్న 21 పోస్టులకు 60 వేల దరఖాస్తులు వచ్చాయంటే.. ఒక్కొక్క పదవికి 3000 మంది చొప్పున పార్టీ నాయకులు పోటీ పడుతున్నారన్న విషయం స్పష్టమైంది. ఇప్పుడు వీరిని స్క్రూటినీ చేసే బాధ్యతను జిల్లాల నాయకులకు అప్పగించారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తులను నియోజకవర్గాల వారీగా అక్కడకే పంపించి.. ఎమ్మెల్యేలు వీరిలో ఉత్తమమైన నాయకులను, గత ఏడాది ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి ఎంపిక చేయాలని సూచించారు.
మరి ఏ మేరకు ఈ పదవులు ఎవరికి దక్కుతాయో చూడాలి. ఇవి కాకుండా.. సిఫారసులు, పార్టీలో సీనియర్ల ఒత్తిళ్లు.. ఇలా అనేకం కూడా ఉన్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. 21 పోస్టులకు ఎంత మంది ఎంపిక అవుతారో చూడాలి. ఇక, ఎమ్మెల్యేలు.. స్థానిక నాయకులు .. వీరిలో ఎంత మందికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది కూడా ఆసక్తిగానే మారింది. చూడాలి ఏం జరుగుతుందో. ఒకరకంగా వీరిని ఎంపిక చేసి ఆయా పదవులు ఇవ్వడం అనేది చంద్రబాబు కు ఒక పెద్ద టెస్టేనని చెప్పాలి.
This post was last modified on March 16, 2025 12:36 am
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…