కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని పదవులు ఇచ్చినా.. ఇంకా వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పదవులు దక్కక ఎదురు చూస్తున్నారు. తాజాగా రెండు రోజుల కిందట.. మళ్లీ నామినేటెడ్ పదవుల వ్యవహారం తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలోని 21 ప్రముఖ దేవాలయాలకు బోర్డులు ఏర్పాటు చేసి.. వాటికి చైర్మన్లుగా కూటమి పార్టీల నాయకులను నియమించాలని భావించారు.
ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఆయా పదవులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. 21 ఆలయాల ట్రస్టు బోర్డు చైర్మన్ పదవులను ఆశించేవారు.. దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఇంకేముంది.. కేవలం రెండు రోజుల్లోనే 60 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా 40 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. మరో 20 వేల మందికి పైగా ఆఫ్ లైన్లో తన కార్యాలయానికి దరఖాస్తులు పంపారని చంద్రబాబు అన్నారు.
అంటే.. ఉన్న 21 పోస్టులకు 60 వేల దరఖాస్తులు వచ్చాయంటే.. ఒక్కొక్క పదవికి 3000 మంది చొప్పున పార్టీ నాయకులు పోటీ పడుతున్నారన్న విషయం స్పష్టమైంది. ఇప్పుడు వీరిని స్క్రూటినీ చేసే బాధ్యతను జిల్లాల నాయకులకు అప్పగించారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తులను నియోజకవర్గాల వారీగా అక్కడకే పంపించి.. ఎమ్మెల్యేలు వీరిలో ఉత్తమమైన నాయకులను, గత ఏడాది ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి ఎంపిక చేయాలని సూచించారు.
మరి ఏ మేరకు ఈ పదవులు ఎవరికి దక్కుతాయో చూడాలి. ఇవి కాకుండా.. సిఫారసులు, పార్టీలో సీనియర్ల ఒత్తిళ్లు.. ఇలా అనేకం కూడా ఉన్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. 21 పోస్టులకు ఎంత మంది ఎంపిక అవుతారో చూడాలి. ఇక, ఎమ్మెల్యేలు.. స్థానిక నాయకులు .. వీరిలో ఎంత మందికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది కూడా ఆసక్తిగానే మారింది. చూడాలి ఏం జరుగుతుందో. ఒకరకంగా వీరిని ఎంపిక చేసి ఆయా పదవులు ఇవ్వడం అనేది చంద్రబాబు కు ఒక పెద్ద టెస్టేనని చెప్పాలి.
This post was last modified on March 16, 2025 12:36 am
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…