Political News

జగన్ కు సాయిరెడ్డి తలనొప్పి మొదలైనట్టే!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి తేరుకోకముందే… వైసీపీని వదిలి చాలా మంది కీలక నేతలు వైరి వర్గాల్లో చేరి ప్రత్యర్థులుగా మారిపోయారు. ఇప్పుడేమో… రాజకీయాలే వద్దంటూ సాగు చేసుకుంటానంటూ వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన వేణుంబాక విజయసాయిరెడ్డి మొన్నటికి మొన్న జగన్ పద్దతి బాగోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదేదో బయటకు వచ్చారు కాబట్టి మాట్లాడారు అనుకుంటే…తాజాగా శనివారం సోషల్ మీడియా వేదికగా జగన్ ను ఉద్దేశించి ఓ ఆసక్తికర పోస్టును పెట్టారు. వెరసి జగన్ కు సాయిరెడ్డి కొత్త తలనొప్పిగా పరిణమించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కాకినాడ సీ పోర్టు వాటాల బదలాయింపు వ్యవహారంలో సీఐడీ విచారణకు హాజరైన సందర్బంగా విజయవాడలో మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి…జగన్ చుట్టూ ఓ కోటరీ ఉందని… దానిని దాటి జగన్ బయటకు రాలేకపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తనపైనే జగన్ అనుమానపడ్డారన్న సాయిరెడ్డి… జగన్ తీరుతోనే తాను రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న కోణంలోనూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టులో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖరరెడ్డిలు కీలక పాత్రధారులని కూడా ఆయన చెప్పేశారు. అయితే ఈ వ్యవహారాలు జగన్ కు తెలియవంటూ జగన్ ను కాస్తంత వెనకేసుకొచ్చినట్టే కనిపించారు.

అయితే శనివారం రాత్రి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో జగన్ తీరు సాయిరెడ్డి ఓ రేంజిలో తులనాడారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ ను మహారాజుతో పోల్చిన సాయిరెడ్డి… ఆయన చుట్టూ ఉండే కోటరీని పూర్వ కాలంలో రాజుల చుట్టూ ఉండే కోటరీలతో పోల్చారు. నాడు రాజులు తమ చుట్టూ ఉన్న కోటరీల మాటలు విని రాజుతో పాటు రాజ్యాలు కూడా కాల గర్బంలో కలిసిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ కూడా తన చుట్టూ ఉన్న కోటరీని దాటి బయటకు రాకపోతే…జగన్ కూడా రాణించలేరని, ఆయన పార్టీ వైసీపీ కూడా కాల గర్భంలో కలిసిపోక తప్పదన్న రీతిలో సెటైరిక్ కామెంట్లను చేశారు. కోటరీ కుట్రలను గమనించిన నాటి రాజులు..కోటరీకి తెలియకుండా మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి కోటరీ చేస్తున్న దురాగతాలను తెలుసుకుని తన రాజ్యాన్ని రక్షించుకున్నాడని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ కూడా ఆ తెలివైన రాజులా తన కోటను కాపాడుకుంటారా? లేదంటే పార్టీని కాలగర్బంలో కలిపేసుకుంటారా? అన్న అర్థం వచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on March 15, 2025 8:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

4 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago