Political News

తెలంగాణ అసెంబ్లీలో ‘చంద్ర‌బాబు’ రాజ‌కీయం.. ఏం జ‌రిగింది?

తెలంగాణ అసెంబ్లీలో బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా శ‌నివారం.. అనూహ్యంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు గురించిన ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. దీంతో స‌భ‌లో ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మైంది. బీఆర్ఎస్ స‌భ్యుడు.. ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా న‌ది యాజ‌మాన్య సంస్థ(కేఆర్ ఎంబీ) వ్య‌వహారంపై స్పందించారు. కేఆర్ ఎంబీ వ్య‌వ‌హారంపై సీఎం రేవంత్‌రెడ్డి చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, దీనివ‌ల్ల రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతోంద‌ని చెప్పారు.

“ఇప్పుడు కేఆర్ ఎంబీ ప‌రిస్థితి ఎలా ఉందంటే.. అధ్య‌క్షా.. చంద్ర‌బాబు చెబితే కూర్చుంటారు. చంద్ర‌బాబు చెబితే నిల‌బ‌డతారు. అంతా చంద్ర‌బాబు చెప్పిన‌ట్టే కేఆర్ ఎంబీ చేస్తోంది. దీంతో మ‌న ప్ర‌జ‌ల‌కు నీటి క‌ష్టాలు వ‌స్తున్నాయి. ఈ విష‌యం తెలిసి కూడా.. సీఎం రేవంత్ రెడ్డి ఏమీ చేయ‌డం లేదు. ఇదేదో తెర‌వెనుక ఏదో జ‌రుగుతున్న‌ద‌న్న సందేహాలు వ‌చ్చేలా చేస్తోంది. అంతా చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు చేస్తే.. కేఆర్ ఎంబీని.. చంద్ర‌బాబు ఎంబీగా మార్చేయా” అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

అంతేకాదు.. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు తాగు నీటి కొర‌త ప్రారంభ‌మైంద‌ని చెప్పారు. అలా కాద‌ని మంత్రి చెప్ప‌గ‌ల‌రా? అంటూ.. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నీటి కొర‌త లేన‌ప్పు డు.. హైద‌రాబాద్‌లోని వాట‌ర్ ట్యాంకులు ఎందుకు వ‌స్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు. ఈ విష‌యంలోనూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.ఈ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న మంత్రి భ‌ట్టి.. ప‌ల్లా చాలా విజ్ఞానవంతుడ‌ని అనుకున్నామ‌ని.. కానీ, ఆయ‌న బీఆర్ఎస్ క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని బీఆర్ఎస్ మైకులో మాట్లాడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

తాము అధికారంలోకి వ‌చ్చాక‌.. అనేక స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. కృష్ణా న‌ది నుంచి మన‌కు రావాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క కూడా వ‌దులుకోకుండా.. చేస్తున్నామ‌ని, దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వ‌యంగా కేంద్రానికి లేఖ‌లు కూడా రాశార‌ని.. ఈ విష‌యం తెలిసి కూడా ప‌ల్లా రాజ‌కీయం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. హైద‌రాబాద్‌లో ట్యాంక‌ర్లు రావ‌డం అనేది ఇప్పుడు కొత్త‌కాద‌ని.. గ‌తం నుంచే ఉంద‌ని.. నీటి స‌మ‌స్య రాకుండా త‌మ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌న్నారు.

This post was last modified on March 15, 2025 12:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

1 hour ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago