తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం.. అనూహ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు గురించిన ప్రస్తావన వచ్చింది. దీంతో సభలో ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తమైంది. బీఆర్ఎస్ సభ్యుడు.. పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా నది యాజమాన్య సంస్థ(కేఆర్ ఎంబీ) వ్యవహారంపై స్పందించారు. కేఆర్ ఎంబీ వ్యవహారంపై సీఎం రేవంత్రెడ్డి చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు.
“ఇప్పుడు కేఆర్ ఎంబీ పరిస్థితి ఎలా ఉందంటే.. అధ్యక్షా.. చంద్రబాబు చెబితే కూర్చుంటారు. చంద్రబాబు చెబితే నిలబడతారు. అంతా చంద్రబాబు చెప్పినట్టే కేఆర్ ఎంబీ చేస్తోంది. దీంతో మన ప్రజలకు నీటి కష్టాలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి కూడా.. సీఎం రేవంత్ రెడ్డి ఏమీ చేయడం లేదు. ఇదేదో తెరవెనుక ఏదో జరుగుతున్నదన్న సందేహాలు వచ్చేలా చేస్తోంది. అంతా చంద్రబాబు చెప్పినట్టు చేస్తే.. కేఆర్ ఎంబీని.. చంద్రబాబు ఎంబీగా మార్చేయా” అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
అంతేకాదు.. హైదరాబాద్ ప్రజలకు తాగు నీటి కొరత ప్రారంభమైందని చెప్పారు. అలా కాదని మంత్రి చెప్పగలరా? అంటూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నీటి కొరత లేనప్పు డు.. హైదరాబాద్లోని వాటర్ ట్యాంకులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఈ విషయంలోనూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.ఈ సమయంలో జోక్యం చేసుకున్న మంత్రి భట్టి.. పల్లా చాలా విజ్ఞానవంతుడని అనుకున్నామని.. కానీ, ఆయన బీఆర్ఎస్ కళ్లద్దాలు పెట్టుకుని బీఆర్ఎస్ మైకులో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
తాము అధికారంలోకి వచ్చాక.. అనేక సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కృష్ణా నది నుంచి మనకు రావాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క కూడా వదులుకోకుండా.. చేస్తున్నామని, దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్రానికి లేఖలు కూడా రాశారని.. ఈ విషయం తెలిసి కూడా పల్లా రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్లో ట్యాంకర్లు రావడం అనేది ఇప్పుడు కొత్తకాదని.. గతం నుంచే ఉందని.. నీటి సమస్య రాకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
This post was last modified on March 15, 2025 12:49 pm
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…