Political News

పిఠాపురంలో జగన్ పై నాగబాబు సెటైర్లు!

పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయ కేతనం సభకు జనసేన నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన ఎమ్మెల్సీ నాగబాబు…మాజీ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం తమదేనని జగన్ కలలుకంటున్నారని, ఆయన కన్నా అద్భుతంగా ఎవరూ హాస్యం పండించలేరని నాగబాబు చురకలంటించారు. జగన్ మరో 20 ఏళ్లు ఇలాగే కలలుకనాలని సలహా ఇచ్చారు.

కళ్ళు మూసి తెరిచేలోపు తొమ్మిది నెలలు గడిచిపోయాయని, కళ్ళు మూసి తెరిస్తే ఐదేళ్లు గడిచిపోతాయని ఆ తర్వాత అధికారం తమదేనని జగన్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారం వచ్చింది కదా అని జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు ఎవరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని నాగబాబు సూచించారు. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో వైసీపీ నేతలను చూసి నేర్చుకోవాలని అన్నారు. నోటి దురుసు ఉంది కాబట్టే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదని చెప్పారు.

రాబోయే రెండు మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి పవన్ అని ప్రశంసించారు. అనుక్షణం ప్రజా సంక్షేమం కోరే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అటువంటి గొప్ప వ్యక్తి కావాలని, లేదంటే ఆయన అనుచరుడిగా ఉండాలని అన్నారు. దేవుడు అడిగితేనే వరమిస్తాడని, పవన్ అడగకుండానే వరమిస్తాడని నాగబాబు అన్నారు. 12 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా పవన్ తట్టుకుని నిలబడ్డారని, రాబోయే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణ యుగం చూడబోతుందని అన్నారు.

పిఠాపురంలో పవన్ విజయానికి తానే కారణం అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పవన్ తో పాటు పిఠాపురం పౌరులే పవన్ విజయానికి కారణమని నాగబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

This post was last modified on March 14, 2025 9:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago