Political News

పిఠాపురంలో జగన్ పై నాగబాబు సెటైర్లు!

పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయ కేతనం సభకు జనసేన నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన ఎమ్మెల్సీ నాగబాబు…మాజీ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం తమదేనని జగన్ కలలుకంటున్నారని, ఆయన కన్నా అద్భుతంగా ఎవరూ హాస్యం పండించలేరని నాగబాబు చురకలంటించారు. జగన్ మరో 20 ఏళ్లు ఇలాగే కలలుకనాలని సలహా ఇచ్చారు.

కళ్ళు మూసి తెరిచేలోపు తొమ్మిది నెలలు గడిచిపోయాయని, కళ్ళు మూసి తెరిస్తే ఐదేళ్లు గడిచిపోతాయని ఆ తర్వాత అధికారం తమదేనని జగన్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారం వచ్చింది కదా అని జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు ఎవరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని నాగబాబు సూచించారు. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో వైసీపీ నేతలను చూసి నేర్చుకోవాలని అన్నారు. నోటి దురుసు ఉంది కాబట్టే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదని చెప్పారు.

రాబోయే రెండు మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి పవన్ అని ప్రశంసించారు. అనుక్షణం ప్రజా సంక్షేమం కోరే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అటువంటి గొప్ప వ్యక్తి కావాలని, లేదంటే ఆయన అనుచరుడిగా ఉండాలని అన్నారు. దేవుడు అడిగితేనే వరమిస్తాడని, పవన్ అడగకుండానే వరమిస్తాడని నాగబాబు అన్నారు. 12 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా పవన్ తట్టుకుని నిలబడ్డారని, రాబోయే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణ యుగం చూడబోతుందని అన్నారు.

పిఠాపురంలో పవన్ విజయానికి తానే కారణం అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పవన్ తో పాటు పిఠాపురం పౌరులే పవన్ విజయానికి కారణమని నాగబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

2 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

2 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

2 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

2 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

4 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

5 hours ago