టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి కలిశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న నాగం రాజకీయంగా అయితే పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి. అయితే చంద్రబాబుతో కలిసి తెలుగు నేలలో నాగం చేసిన రాజకీయాలు ఇప్పటికీ గుర్తున్నాయి. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో నాగం కూడా చంద్రబాబు చేతిలోని టీడీపీలోనే కొనసాగారు. కొనసాగడమే కాదు టీడీపీలో నాగంది క్రియాశీలక భూమికేనని చెప్పాలి. మంత్రిగా, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ విపక్షంలో ఉండగా… అధికార పార్టీని నిలదీసే క్రమంలో చంద్రబాబు దన్నుగా నిలవడంలో నాగం కీలక భూమిక పోషించారు.
నాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఓబుళాపురం అక్రమ మైనింగ్ పై టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. టీడీపీ పోరాటంతో అఖిలపక్ష బృందం ఓబుళాపురం మైనింగ్ ను పరిశీలించింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల క్రమంలో ఆ బృందానికి నేతృత్వం వహించిన నాగంపై కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులు విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. కేసుల విచారణను ముగించిన కోర్టు… వాటిని కొట్టేసింది. ఈ మేరకు కోర్టు తుది తీర్పును గురువారం వెలువరించగా…నాగం స్వయంగా హాజరు అయ్యారు. అనంతరం చంద్రబాబు వద్దకు ఆయన వెళ్లారు. తనను కలిసేందుకు వచ్చిన నాగంను చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు.
ఈ సందర్భంగా నాగంను చూసిన వెంటనే చంద్రబాబు కళ్లల్లో కనిపించిన వెలుగు… అదే సమయంలో తన మార్గదర్శకుడి వద్దకు వచ్చానన్న భావన నాగంలో వ్యక్తమయ్యాయి. అనంతరం నాగం బాగోగులను ఆరా తీసిన చంద్రబాబు నాగం పిల్లల గురించి అడిగారు. ఈ సందర్భంగా గతంలో వారిద్దరూ కలిసి చేసిన రాజకీయాలు…ఉమ్మడిగా చేపట్టిన చర్యల గురించి వారు మననం చేసుకున్నారు. ఆఫ్రో ఏసియన్ గేమ్స్ ను నిర్వహించిన సమయంలో అక్కడి అన్ని బాధ్యతలను నాగం భుజాల మీదే పెట్టగా… నాగం కూడా తన సత్తా చాటి గేమ్స్ ను దిగ్విజయంగా ముగించారు. చంద్రబాబు కేబినెట్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగానూ నాగం పనిచేశారు. వయసు మీద పడటంతో నాగం నడవడానికే ఇబ్బంది పడుతుండగా… చంద్రబాబు మాత్రం ఇంకా హుషారుగానే కనిపిస్తుండటం గమనార్హం.
This post was last modified on March 13, 2025 6:41 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…