టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి కలిశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న నాగం రాజకీయంగా అయితే పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి. అయితే చంద్రబాబుతో కలిసి తెలుగు నేలలో నాగం చేసిన రాజకీయాలు ఇప్పటికీ గుర్తున్నాయి. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో నాగం కూడా చంద్రబాబు చేతిలోని టీడీపీలోనే కొనసాగారు. కొనసాగడమే కాదు టీడీపీలో నాగంది క్రియాశీలక భూమికేనని చెప్పాలి. మంత్రిగా, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ విపక్షంలో ఉండగా… అధికార పార్టీని నిలదీసే క్రమంలో చంద్రబాబు దన్నుగా నిలవడంలో నాగం కీలక భూమిక పోషించారు.
నాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఓబుళాపురం అక్రమ మైనింగ్ పై టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. టీడీపీ పోరాటంతో అఖిలపక్ష బృందం ఓబుళాపురం మైనింగ్ ను పరిశీలించింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల క్రమంలో ఆ బృందానికి నేతృత్వం వహించిన నాగంపై కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులు విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. కేసుల విచారణను ముగించిన కోర్టు… వాటిని కొట్టేసింది. ఈ మేరకు కోర్టు తుది తీర్పును గురువారం వెలువరించగా…నాగం స్వయంగా హాజరు అయ్యారు. అనంతరం చంద్రబాబు వద్దకు ఆయన వెళ్లారు. తనను కలిసేందుకు వచ్చిన నాగంను చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు.
ఈ సందర్భంగా నాగంను చూసిన వెంటనే చంద్రబాబు కళ్లల్లో కనిపించిన వెలుగు… అదే సమయంలో తన మార్గదర్శకుడి వద్దకు వచ్చానన్న భావన నాగంలో వ్యక్తమయ్యాయి. అనంతరం నాగం బాగోగులను ఆరా తీసిన చంద్రబాబు నాగం పిల్లల గురించి అడిగారు. ఈ సందర్భంగా గతంలో వారిద్దరూ కలిసి చేసిన రాజకీయాలు…ఉమ్మడిగా చేపట్టిన చర్యల గురించి వారు మననం చేసుకున్నారు. ఆఫ్రో ఏసియన్ గేమ్స్ ను నిర్వహించిన సమయంలో అక్కడి అన్ని బాధ్యతలను నాగం భుజాల మీదే పెట్టగా… నాగం కూడా తన సత్తా చాటి గేమ్స్ ను దిగ్విజయంగా ముగించారు. చంద్రబాబు కేబినెట్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగానూ నాగం పనిచేశారు. వయసు మీద పడటంతో నాగం నడవడానికే ఇబ్బంది పడుతుండగా… చంద్రబాబు మాత్రం ఇంకా హుషారుగానే కనిపిస్తుండటం గమనార్హం.
This post was last modified on March 13, 2025 6:41 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…