Political News

ఏయూ మాజీ వీసీ ప్రసాద రెడ్డిపై లోకేశ్ ఫైర్

వైసీపీ హయాంలో రెడ్డి కమ్యూనిటీకి చెందిన వారిని యూనివర్సిటీలకు వీసీలుగా నియమించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విశాఖలోని ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్సిటీని మాజీ వీసీ ప్రసాద రెడ్డి గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఆఫీసుగా మార్చేశారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీకి అనుకూలంగా ప్రసాదరెడ్డి ప్రచారం చేశారని, ఈ వ్యవహారంపై ఇన్చార్జి వీసీ ఒక కమిటీని నియమించారని, విజిలెన్స్ అకౌంట్ వేశామని అన్నారు. కమిటీ విచారణ జరిపి 60 రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ఇంకోసారి పొరపాటు చేయాలంటే భయపడేవిధంగా చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రమాణాలను పెంచి యూనివర్సిటీకి పూర్వ వైభవం తెస్తామని చెప్పారు.

ఆంధ్రా యూనివర్సిటీ ఒక సెంటిమెంటుతో కూడుకున్నదని, బ్యాంక్ ఆఫ్ అమెరికా చైర్మన్, జీఎమ్మార్ అధినేత ఏయూలో చదువుకున్న వారేనని గుర్తు చేశారు. ప్రపంచంలోని టాప్ 100లో ఏయూ ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారని, అందుకే ఐఐటి కరఖ్ పూర్ ప్రోఫెసర్‌ రాజశేఖర్‌ను ఏయూ వీసీగా నియమించారని చెప్పారు.

గత వీసీ ప్రసాద రెడ్డి జగన్ కు అనుకూలంగా పనిచేశారని, జగన్ విశాఖపట్నం వస్తే పిల్లలను రోడ్డుపైకి తెచ్చి రూసా గ్రాంట్స్, ఇస్రో గ్రాంట్‌ను దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఫండ్స్ డైవర్సన్, అక్రమ నియామకాలతో ఏయూను రాజకీయ కార్యాలయంగా ప్రసాదరెడ్డి మార్చారని ఆరోపించారు. సెనేట్ హలులో రాజకీయ నాయకుల పుట్టిన రోజు పార్టీలు చేశారని, ఇష్టానుసారం అపాయింట్మెంట్ ఇచ్చారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో దసపల్లా హోటల్‌లో మీటింగ్ పెట్టారని, దానిపై కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇటువంటి క్రిమినల్స్ విషయంలో ఉదాసీనంగా ఉండడం తగదని అన్నారు.

ఘన చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీని ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యాలయంగా మార్చాడని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో డబ్బు సంచులు మొదలుకొని అన్ని ఏయూలోనే జరిగాయని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆరోపించారు.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

11 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

17 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

31 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago