భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) తన ఆట తిరిగి మొదలుపెట్టారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు అప్పుడే మొదలైపోయాయి. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ పెద్దగా బయటకే రావడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్ పరిధిలోని ఎరవలి ఫాం హౌస్ లో చాలా కాలం పాటు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ ఇటీవలే తిరిగి యాక్టివేట్ అయ్యారు. బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయనను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. కేసీఆర్ ఆశీస్సులను మహిపాల్ రెడ్డి తీసుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసినంతనే.. కేసీఆర్ తిరిగి తన వ్యూహాలకు పదును పెట్టారన్న వాదనలు మొదలయ్యాయి.
వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ పైనే పటాన్ చెరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి… అధికారం చేజిక్కించుకోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. మహిపాల్ రెడ్డితో పాటుగా మరో 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. వీరంతా బీఆర్ఎస్ కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లో అనధికారికంగా కొనసాగుతున్నారు. వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మహిపాల్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మహిపాల్ రెడ్డికి ఆది నుంచి కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే పటాన్ చెరు కాంగ్రెస్ లో ఇప్పుడు మూడు ముక్కలాటలా పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నేతలు పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే తన అనుచరులతో జరిగిన ఓ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై మహిపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అధిష్ఠానం చెవిన కూడా పడ్డాయి. ఫలితంగా మహిపాల్ రెడ్డిపై చర్యల దిశగానూ కాంగ్రెస్ సాగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మహిపాల్ రెడ్డికి కేసీఆర్ కబురు పెట్టారని.. దీంతోనే అందరి ముందే కేసీఆర్ వద్దకు వచ్చిన మహిపాల్ రెడ్డి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరితే… కేసీఆర్ ఆట నిజంగానే మొదలైందని చెప్పక తప్పదు.
This post was last modified on March 13, 2025 12:47 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…