భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) తన ఆట తిరిగి మొదలుపెట్టారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు అప్పుడే మొదలైపోయాయి. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ పెద్దగా బయటకే రావడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్ పరిధిలోని ఎరవలి ఫాం హౌస్ లో చాలా కాలం పాటు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ ఇటీవలే తిరిగి యాక్టివేట్ అయ్యారు. బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయనను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. కేసీఆర్ ఆశీస్సులను మహిపాల్ రెడ్డి తీసుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసినంతనే.. కేసీఆర్ తిరిగి తన వ్యూహాలకు పదును పెట్టారన్న వాదనలు మొదలయ్యాయి.
వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ పైనే పటాన్ చెరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి… అధికారం చేజిక్కించుకోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. మహిపాల్ రెడ్డితో పాటుగా మరో 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. వీరంతా బీఆర్ఎస్ కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లో అనధికారికంగా కొనసాగుతున్నారు. వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మహిపాల్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మహిపాల్ రెడ్డికి ఆది నుంచి కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే పటాన్ చెరు కాంగ్రెస్ లో ఇప్పుడు మూడు ముక్కలాటలా పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నేతలు పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే తన అనుచరులతో జరిగిన ఓ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై మహిపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అధిష్ఠానం చెవిన కూడా పడ్డాయి. ఫలితంగా మహిపాల్ రెడ్డిపై చర్యల దిశగానూ కాంగ్రెస్ సాగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మహిపాల్ రెడ్డికి కేసీఆర్ కబురు పెట్టారని.. దీంతోనే అందరి ముందే కేసీఆర్ వద్దకు వచ్చిన మహిపాల్ రెడ్డి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరితే… కేసీఆర్ ఆట నిజంగానే మొదలైందని చెప్పక తప్పదు.
This post was last modified on March 13, 2025 12:47 pm
మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. ఎల్-2: ఎంపురాన్. ఆ ఇండస్ట్రీలో అత్యధిక హైప్ తెచ్చుకున్న సినిమా కూడా…
విశాఖపట్టణంలోని సుందర తీరం రిషికొండ బీచ్ కు తిరిగి బ్లూఫాగ్ గుర్తింపు దక్కింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఈ…
ఏపీలోని కూటమి ప్రభుత్వం.. త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన చేస్తుందా? లేక.. మంత్రివర్గంలో కూర్పు వరకు పరిమితం అవుతుందా? అంటే..…
అగ్ర రాజ్యం అమెరికాలో డబ్బులిచ్చి పౌరసత్వం కొనుక్కొనే వెసులుబాటు అప్పుడే మొదలైపోయింది. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే... గోల్డ్ కార్డ్…
పీకే.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటి. 2014లో వచ్చిన ఈ చిత్రం ఆల్ టైం బ్లాక్…
కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల రాజకీయాలు చేస్తున్నారా? లేక ఎండ వేడిమి తట్టుకోలేక.. ఇంటి పట్టునే ఉంటున్నారా? అంటే..…