Political News

కేసీఆర్ ఆట మొదలైనట్టేనా..?

భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) తన ఆట తిరిగి మొదలుపెట్టారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు అప్పుడే మొదలైపోయాయి. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ పెద్దగా బయటకే రావడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్ పరిధిలోని ఎరవలి ఫాం హౌస్ లో చాలా కాలం పాటు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ ఇటీవలే తిరిగి యాక్టివేట్ అయ్యారు. బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయనను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. కేసీఆర్ ఆశీస్సులను మహిపాల్ రెడ్డి తీసుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసినంతనే.. కేసీఆర్ తిరిగి తన వ్యూహాలకు పదును పెట్టారన్న వాదనలు మొదలయ్యాయి.

వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ పైనే పటాన్ చెరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి… అధికారం చేజిక్కించుకోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. మహిపాల్ రెడ్డితో పాటుగా మరో 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. వీరంతా బీఆర్ఎస్ కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లో అనధికారికంగా కొనసాగుతున్నారు. వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మహిపాల్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మహిపాల్ రెడ్డికి ఆది నుంచి కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే పటాన్ చెరు కాంగ్రెస్ లో ఇప్పుడు మూడు ముక్కలాటలా పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నేతలు పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే తన అనుచరులతో జరిగిన ఓ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై మహిపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అధిష్ఠానం చెవిన కూడా పడ్డాయి. ఫలితంగా మహిపాల్ రెడ్డిపై చర్యల దిశగానూ కాంగ్రెస్ సాగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మహిపాల్ రెడ్డికి కేసీఆర్ కబురు పెట్టారని.. దీంతోనే అందరి ముందే కేసీఆర్ వద్దకు వచ్చిన మహిపాల్ రెడ్డి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరితే… కేసీఆర్ ఆట నిజంగానే మొదలైందని చెప్పక తప్పదు.

This post was last modified on March 13, 2025 12:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

19 minutes ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

1 hour ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

1 hour ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

2 hours ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

2 hours ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

5 hours ago