భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) తన ఆట తిరిగి మొదలుపెట్టారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు అప్పుడే మొదలైపోయాయి. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ పెద్దగా బయటకే రావడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్ పరిధిలోని ఎరవలి ఫాం హౌస్ లో చాలా కాలం పాటు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ ఇటీవలే తిరిగి యాక్టివేట్ అయ్యారు. బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయనను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. కేసీఆర్ ఆశీస్సులను మహిపాల్ రెడ్డి తీసుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసినంతనే.. కేసీఆర్ తిరిగి తన వ్యూహాలకు పదును పెట్టారన్న వాదనలు మొదలయ్యాయి.
వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ పైనే పటాన్ చెరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి… అధికారం చేజిక్కించుకోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. మహిపాల్ రెడ్డితో పాటుగా మరో 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. వీరంతా బీఆర్ఎస్ కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లో అనధికారికంగా కొనసాగుతున్నారు. వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మహిపాల్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మహిపాల్ రెడ్డికి ఆది నుంచి కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే పటాన్ చెరు కాంగ్రెస్ లో ఇప్పుడు మూడు ముక్కలాటలా పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నేతలు పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే తన అనుచరులతో జరిగిన ఓ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై మహిపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అధిష్ఠానం చెవిన కూడా పడ్డాయి. ఫలితంగా మహిపాల్ రెడ్డిపై చర్యల దిశగానూ కాంగ్రెస్ సాగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మహిపాల్ రెడ్డికి కేసీఆర్ కబురు పెట్టారని.. దీంతోనే అందరి ముందే కేసీఆర్ వద్దకు వచ్చిన మహిపాల్ రెడ్డి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరితే… కేసీఆర్ ఆట నిజంగానే మొదలైందని చెప్పక తప్పదు.
This post was last modified on March 13, 2025 12:47 pm
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…