పలు కేసులలో విచారణ ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ పై బయటకు వెళ్లిన వైనంపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లతో బోరుగడ్డ బెయిల్ పొందారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయనకు ఇచ్చిన బెయిల్ గడువు ముగియడం, ఆ తర్వాత కోర్టు మరోసారి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రాజమండ్రి జైలుకు వచ్చి ఈ రోజు ఉదయం బోరుగడ్డ లొంగిపోయారు. అయితే, ఆ వెంటనే బోరుగడ్డకు గుంటూరు పోలీసులు షాకిచ్చారు.
పాస్టర్ను బెదిరించిన కేసులో పీటీ వారెంట్పై అనిల్ను పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఈ రోజు ఉదయం గుంటూరు పోలీసులు రాజమండ్రి జైలుకు వెళ్లారు. గుంటూరు కోర్టులో బోరుగడ్డను పోలీసులు హాజరుపర్చనున్నారు. అంతకుముందు, బోరుగడ్డ అనిల్కు ఏపీ హైకోర్టు డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. తన తల్లి అనారోగ్యం కారణంగా చెన్నైలో ఉన్నానని బోరుగడ్డ చెప్పడంతో…వెంటనే ఫ్లైట్లో రాజమండ్రి వచ్చి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. రాజమండ్రి జైలులో లొంగిపోకుండా మధ్యంతర బెయిల్ పొడిగించాలంటూ హైకోర్టులో బోరుగడ్డ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, కోర్టు పైవిధంగా స్పందించింది. ఏది ఏమైనా..మధ్యంతర బెయిల్ పై మరిన్ని రోజులు బయట ఉండాలన్న బోరుగడ్డ కథ అడ్డం తిరిగింది.
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…