పలు కేసులలో విచారణ ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ పై బయటకు వెళ్లిన వైనంపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లతో బోరుగడ్డ బెయిల్ పొందారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయనకు ఇచ్చిన బెయిల్ గడువు ముగియడం, ఆ తర్వాత కోర్టు మరోసారి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రాజమండ్రి జైలుకు వచ్చి ఈ రోజు ఉదయం బోరుగడ్డ లొంగిపోయారు. అయితే, ఆ వెంటనే బోరుగడ్డకు గుంటూరు పోలీసులు షాకిచ్చారు.
పాస్టర్ను బెదిరించిన కేసులో పీటీ వారెంట్పై అనిల్ను పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఈ రోజు ఉదయం గుంటూరు పోలీసులు రాజమండ్రి జైలుకు వెళ్లారు. గుంటూరు కోర్టులో బోరుగడ్డను పోలీసులు హాజరుపర్చనున్నారు. అంతకుముందు, బోరుగడ్డ అనిల్కు ఏపీ హైకోర్టు డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. తన తల్లి అనారోగ్యం కారణంగా చెన్నైలో ఉన్నానని బోరుగడ్డ చెప్పడంతో…వెంటనే ఫ్లైట్లో రాజమండ్రి వచ్చి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. రాజమండ్రి జైలులో లొంగిపోకుండా మధ్యంతర బెయిల్ పొడిగించాలంటూ హైకోర్టులో బోరుగడ్డ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, కోర్టు పైవిధంగా స్పందించింది. ఏది ఏమైనా..మధ్యంతర బెయిల్ పై మరిన్ని రోజులు బయట ఉండాలన్న బోరుగడ్డ కథ అడ్డం తిరిగింది.
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…