పలు కేసులలో విచారణ ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ పై బయటకు వెళ్లిన వైనంపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లతో బోరుగడ్డ బెయిల్ పొందారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయనకు ఇచ్చిన బెయిల్ గడువు ముగియడం, ఆ తర్వాత కోర్టు మరోసారి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రాజమండ్రి జైలుకు వచ్చి ఈ రోజు ఉదయం బోరుగడ్డ లొంగిపోయారు. అయితే, ఆ వెంటనే బోరుగడ్డకు గుంటూరు పోలీసులు షాకిచ్చారు.
పాస్టర్ను బెదిరించిన కేసులో పీటీ వారెంట్పై అనిల్ను పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఈ రోజు ఉదయం గుంటూరు పోలీసులు రాజమండ్రి జైలుకు వెళ్లారు. గుంటూరు కోర్టులో బోరుగడ్డను పోలీసులు హాజరుపర్చనున్నారు. అంతకుముందు, బోరుగడ్డ అనిల్కు ఏపీ హైకోర్టు డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. తన తల్లి అనారోగ్యం కారణంగా చెన్నైలో ఉన్నానని బోరుగడ్డ చెప్పడంతో…వెంటనే ఫ్లైట్లో రాజమండ్రి వచ్చి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. రాజమండ్రి జైలులో లొంగిపోకుండా మధ్యంతర బెయిల్ పొడిగించాలంటూ హైకోర్టులో బోరుగడ్డ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, కోర్టు పైవిధంగా స్పందించింది. ఏది ఏమైనా..మధ్యంతర బెయిల్ పై మరిన్ని రోజులు బయట ఉండాలన్న బోరుగడ్డ కథ అడ్డం తిరిగింది.
This post was last modified on March 12, 2025 11:49 am
'ఫౌజీ' సినిమా నుంచి ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్లు చూస్తుంటే మేకర్స్ ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమవుతోంది. ప్రభాస్ ను సాఫ్ట్…
ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…