ఏపీలో విపక్ష పార్టీ వైసీపీ బుధవారం ఫీజు పోరు పేరిట రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. అయితే ఈ పోరు బాట కాస్తా రణరంగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఫీజు పోరుకు అక్కడికక్కడే సమాధానం చెబుతామంటూ అధికార టీడీపీ రంగంలోకి దిగిపోయింది. ఈ మేరకు టీడీపీ విద్యార్థి విభాగం తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ మంగళవారం ఓ కీలక ప్రకటన చేశారు. వైసీపీ ఫీజు పోరు చేపట్టే కలెక్టరేట్ల వద్దే వారికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని… అక్కడే తాము వైసీపీతో చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు.
టీడీపీ నేతృత్వంలోని కూటమి ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువతకు భారీ ఎత్తున హామీలు ఇచ్చిందని వైసీపీ వాదిస్తోంది. అయితే కూటమిని నమ్మి ఓట్లు వేసిన యువతను మోసం చేసేలా కూటమి సర్కారు వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. ఇప్పటిదాకా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి నిధులను విడుదల చేయలేదని చెబుతోంది. అంతేకాకుండా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద రూ3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిందని.. అయితే ఇప్పటిదాకా కూటమి సర్కారు భృతి గురించే మాట్లాడటం లేదని కూడా వైసీపీ వాదిస్తోంది.
అయితే వైసీపీ వాదనను టీఎన్ఎస్ఎఫ్ తిప్పి కొడుతోంది. నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్లుగా రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పామని… అందులో ఇప్పటిదాకా 4 లక్షల మేర ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయని వెల్లడిస్తోంది. అంతేకాకుండా పేద విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలు, విద్యార్థుల హాస్టల్ బకాయిలను కూడా ఎప్పటికప్పుడు విడుదల అవుతూనే ఉన్నాయని వాదిస్తోంది. వైసీపీ బకాయి పెట్టి వెళ్లిన ఫీజు బకాయిలను కూడా కూటమి సర్కారే చెల్లించిందని గుర్తు చేస్తోంది. ఇవే అంశాలపై జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైసీపీతో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రణవ్ తెలిపారు. వెరసి బుధవారం నాటి ఫీజు పోరు కాస్తా… టీఎన్ఎస్ఎఫ్ ఎంట్రీతో రణరంగంగా మారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on March 12, 2025 7:26 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…