వైసీపీ హయాంలో జగన్ కక్షా రాజకీయాలకు పాల్పడ్డారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు వైసీపీ నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో, తమపై సీఎం చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని వైసీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.
ఇక, జగన్ అయితే ఏకంగా గుడ్డలూడదీసి నిలబెడతా అంటూ పోలీసులు, అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ఈ కక్షా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో కక్షా రాజకీయాలనేవి ఉండవని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలో టీడీపీ ఆఫీసులపై దాడి జరిగిందని, ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదని అన్నారు. వైసీపీ నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే మాత్రం ఊరుకోబోనని వార్నింగ్ ఇచ్చారు. కొందరు యువత గంజాయి, డ్రగ్స్ కు అలవాటుపడిపోతున్నారని, అందుకే గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపామని తెలిపారు. ఈగల్ పేరుతో గంజాయి, డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించామని చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. ఆడబిడ్డలపై హత్యాచారాలకు పాల్పడిన నిందితులకు అదే చివరి రోజని హెచ్చరించారు.
This post was last modified on March 11, 2025 6:13 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…