వైసీపీ హయాంలో జగన్ కక్షా రాజకీయాలకు పాల్పడ్డారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు వైసీపీ నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో, తమపై సీఎం చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని వైసీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.
ఇక, జగన్ అయితే ఏకంగా గుడ్డలూడదీసి నిలబెడతా అంటూ పోలీసులు, అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ఈ కక్షా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో కక్షా రాజకీయాలనేవి ఉండవని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలో టీడీపీ ఆఫీసులపై దాడి జరిగిందని, ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదని అన్నారు. వైసీపీ నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే మాత్రం ఊరుకోబోనని వార్నింగ్ ఇచ్చారు. కొందరు యువత గంజాయి, డ్రగ్స్ కు అలవాటుపడిపోతున్నారని, అందుకే గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపామని తెలిపారు. ఈగల్ పేరుతో గంజాయి, డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించామని చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. ఆడబిడ్డలపై హత్యాచారాలకు పాల్పడిన నిందితులకు అదే చివరి రోజని హెచ్చరించారు.
This post was last modified on March 11, 2025 6:13 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…