Political News

సభలో వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

వైసీపీ హయాంలో జగన్ కక్షా రాజకీయాలకు పాల్పడ్డారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు వైసీపీ నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో, తమపై సీఎం చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని వైసీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.

ఇక, జగన్ అయితే ఏకంగా గుడ్డలూడదీసి నిలబెడతా అంటూ పోలీసులు, అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ఈ కక్షా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో కక్షా రాజకీయాలనేవి ఉండవని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.

వైసీపీ హయాంలో టీడీపీ ఆఫీసులపై దాడి జరిగిందని, ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదని అన్నారు. వైసీపీ నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే మాత్రం ఊరుకోబోనని వార్నింగ్ ఇచ్చారు. కొందరు యువత గంజాయి, డ్రగ్స్ కు అలవాటుపడిపోతున్నారని, అందుకే గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపామని తెలిపారు. ఈగల్ పేరుతో గంజాయి, డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించామని చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. ఆడబిడ్డలపై హత్యాచారాలకు పాల్పడిన నిందితులకు అదే చివరి రోజని హెచ్చరించారు.

This post was last modified on March 11, 2025 6:13 pm

Share

Recent Posts

పవన్… కళాకారులకో వరం

నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…

60 minutes ago

మహేష్ వెనుకడుగుకు కారణం ఏంటో

గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…

2 hours ago

ట్విట్టర్ టాక్స్… ప్రీమియర్ మాటలు… నిజాలు కావా

గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది  తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…

9 hours ago

సర్దార్ 2 ఈసారి మరింత సీరియస్

కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…

9 hours ago

టాలీవుడ్ గాయాల జాబితాలోకి కొత్త పేరు

ఎన్న‌డూ లేని విధంగా ఈ మ‌ధ్య టాలీవుడ్ స్టార్లు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు గాయ‌ప‌డ‌డం ఆందోళ‌నక‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

10 hours ago

గలీజు పనులు చేస్తే కఠిన చర్యలు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత…

10 hours ago