ఏపీ సీఎం చంద్రబాబు ఎంత లక్కీ అంటే… ఎమ్మెల్సీ సీటుపై ప్రగాఢ ఆశలు పెట్టుకున్న వారు కూడా.. కించిత్తు మాట అనకుండా.. సర్దుకుపోతున్నారనేంతగా ఆయన లక్కీ అనే చెప్పాలి. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల టికెట్లను పంచేశారు. అయితే.. ఆశావహులకు ఒక్కరికీ దీనిలో చోటు దక్కలేదు. దీంతో ఇంకేముంది.. పార్టీలో పెద్ద ఎత్తున ముసలం పుడుతుందని.. పార్టీ చిన్నాభిన్నం అవుతుందని పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు ఎదురు చూశారు.
కానీ, అనూహ్యంగా టికెట్లు ఆశించిన వారు చంద్రబాబుపై విధేయతను చూపించారు. ఆయన పరిస్థితిని తాము అర్ధం చేసుకున్నామని చెప్పారు. అంతేకాదు.. చంద్రబాబు అడుగుజాడల్లో నదవడం కంటే తమ కు పెద్ద పెద్ద పదవులు ఏముంటాయని కూడా ముక్తాయించారు. ఇలా.. ఈ ఎమ్మెల్సీ టికెట్లు ఆశించిన పిఠాపురం వర్మ నుంచి విజయవాడకు చెందిన బుద్దా వెంకన్న వరకు అందరూ.. ఇదే సూత్రాన్ని పాటిం చారు. నిజానికి ఇంత మార్పు వస్తుందని పార్టీ అధినేత కూడా భావించి ఉండరు.
ఇక, తాజా పరిణామాలను గమనిస్తే.. వర్మకు టికెట్ ఖాయమని దాదాపు అందరూ అనుకున్నారు. ఎమ్మె ల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, పైగా ఐదు స్థానాలు భర్తీ అవుతున్నాయని అనుకుంటే.. వాటిలో ఖచ్చితం గా వర్మ పేరు ఉంటుందన్న చర్చ వచ్చింది. ఇక, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఇటీవల కాలంంలో యాక్టివ్ అయిన టీడీ జనార్దన్, వంటివారి పేర్లు కూడా వినిపించాయి. కానీ, చంద్రబాబు అనూహ్యంగా తనదైన శైలిలో టికెట్లు కేటాయించారు.
ఈ పరిణామం తర్వాత.. వైసీపీ నాయకులు వర్మ కు గేలం వేశారు. ఆయన వచ్చేస్తే పార్టీలోకి తీసుకుంటా మన్న సంకేతాలు వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో టీడీపీ లో ఈ వ్యవహారంపై యాగీ జరిగి.. పార్టీ నేతల మధ్య విభేదాలు రావాలని కోరుకున్న వారు కూడా ఉన్నారు. కానీ, చంద్రబాబు పట్ల విధేయత ఉన్న నాయకులు .. అందరూ.. తమ బాట, మాట.. చంద్రబాబేనని తేల్చి చెప్పడంతో ప్రతిపక్ష నాయకులు సైలెంట్ అయిపోయారు. ఇలాంటి వీర విధేయ నాయకులను పొందిన చంద్రబాబు లక్కీనే కదా! అంటున్నారు పరిశీలకులు
This post was last modified on March 11, 2025 6:05 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…