Political News

తెలుగు రాష్ట్రాల‌కు ‘బీసీ’ జ్వ‌రం .. !

రెండు తెలుగు రాష్ట్రాల‌కు బీసీ జ్వ‌రం ప‌ట్టుకుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. తాజాగా జ‌రిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు సంబంధించిన టికెట్ల కేటాయింపును చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఒక్క‌రు కూడా.. జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థికి కేటాయించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అటు తెలంగాణ అయినా.. ఇటు ఏపీలో అయినా.. బీసీల‌కే ప‌ట్టం క‌ట్టారు. వారికే టికెట్లు కేటాయించారు. అయితే.. ఉన్న‌వి త‌క్కువ సంఖ్యే కాబ‌ట్టి ఇలా చేశార‌ని అనుకున్నా.. బీసీల‌కు చాలా వ్యూహాత్మ‌కంగానే టికెట్లు ఇచ్చారు.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. టీడీపీ త‌న‌కు ద‌క్కిన మూడు స్థానాల్లో రెండు బీసీల‌కు కేటాయించింది. రాష్ట్రంలో బీసీ జ‌నాభా సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో వారిని మ‌రింత చేరువ చేసుకునే క్ర‌మంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆచి తూచి అడుగులు వేశారు. అయితే.. బీసీ నాయ‌కుల్లోనూ చాలా మంది పోటీ ప‌డినా.. వీరిలో అత్యంత విధేయుల‌కు మాత్ర‌మే చంద్ర‌బాబు టికెట్లు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు.. తెలంగాణ‌లో మూడు స్థానాల‌ను అధికార పార్టీ కాంగ్రెస్ ద‌క్కించుకుంది. వీటిలో సంఖ్యా ప‌రంగా బీసీల‌కు ఒక‌టి ఇచ్చిన‌ప్ప‌టికీ.. ఎస్సీ, ఎస్టీల‌కు కూడా అదేస్థాయిలో ఒక్కొక్క సీటును కేటాయించింది. వీరిలో స్థానిక నాయ‌కుల‌ను కాద‌ని.. అధిష్టానం ద‌గ్గ‌రేతేల్చుకున్న విజ‌య‌శాంతి టికెట్ ద‌క్కించుకోవ‌డం అత్యంత కీల‌కంగా మారింది. అయితే.. సినీ రంగం ఇటీవ‌ల కాలంలో రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల కార‌ణంగా దూర‌మైంద‌న్న భావ‌న ఉంది.

ఈ నేప‌థ్యంలో సినీ రంగాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు విజ‌య‌శాంతికి టికెట్ ఇచ్చారన్న చ‌ర్చ ఉంది. అయితే.. విజ‌య‌శాంతికి పార్టీ పెద్ద‌లు స్థానిక నాయ‌కుల‌ను క‌లుపుకొని ముందుకు సాగాల‌ని తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం. దీనికి ఆమె ఏమేర‌కు స‌హ‌క‌రిస్తారో చూడాలి. ఇక‌, మ‌రో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ కూడా బీసీనాయ‌కుడు దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌కు టికెట్ ఇవ్వ‌డం ద్వారా.. కాంగ్రెస్ పదే ప‌దే చెబుతున్న బీసీల అనుకూల పార్టీ అనే నినాదం పెద్ద‌గా వినిపించ‌కుండా చేసే వ్యూహం దాగి ఉంద‌న్న చ‌ర్చ న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 11, 2025 1:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

భయం లేదు కాబట్టే… బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్

భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…

1 hour ago

11వ ఆవిర్భావం పూర్తి.. 11 స్థానాల‌కు ప‌రిమితం!: ప‌వ‌న్ కల్యాణ్‌

భార‌త దేశానికి బ‌హుభాషే మంచిద‌ని జ‌న‌సేన అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జ‌రిగిన…

2 hours ago

పిఠాపురంలో జగన్ పై నాగబాబు సెటైర్లు!

పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయ కేతనం సభకు…

2 hours ago

ఆమిర్ ప్రేయ‌సి చ‌రిత్ర మొత్తం త‌వ్వేశారు

ఇప్ప‌టికే రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఆమిర్ ఖాన్.. 60వ ఏట అడుగు పెడుతున్న…

3 hours ago

జగన్ నా ఆస్తులను లాక్కున్నారు: బాలినేని

జనసేన ఆవిర్భావ సభ జయకేతనం వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణ వినిపించింది. మొన్నటిదాకా…

3 hours ago

జన సైనికులను మించిన జోష్ లో పవన్

జనసేన ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ శ్రేణుల్లో ఏ మేర జోష్ ను నింపాయన్నది.. పిఠాపురం శివారు చిత్రాడలో జయకేతనం…

3 hours ago