రెండు తెలుగు రాష్ట్రాలకు బీసీ జ్వరం పట్టుకుందా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన టికెట్ల కేటాయింపును చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఒక్కరు కూడా.. జనరల్ అభ్యర్థికి కేటాయించకపోవడం గమనార్హం. అటు తెలంగాణ అయినా.. ఇటు ఏపీలో అయినా.. బీసీలకే పట్టం కట్టారు. వారికే టికెట్లు కేటాయించారు. అయితే.. ఉన్నవి తక్కువ సంఖ్యే కాబట్టి ఇలా చేశారని అనుకున్నా.. బీసీలకు చాలా వ్యూహాత్మకంగానే టికెట్లు ఇచ్చారు.
ఏపీ విషయానికి వస్తే.. టీడీపీ తనకు దక్కిన మూడు స్థానాల్లో రెండు బీసీలకు కేటాయించింది. రాష్ట్రంలో బీసీ జనాభా సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారిని మరింత చేరువ చేసుకునే క్రమంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆచి తూచి అడుగులు వేశారు. అయితే.. బీసీ నాయకుల్లోనూ చాలా మంది పోటీ పడినా.. వీరిలో అత్యంత విధేయులకు మాత్రమే చంద్రబాబు టికెట్లు ఇవ్వడం గమనార్హం.
మరోవైపు.. తెలంగాణలో మూడు స్థానాలను అధికార పార్టీ కాంగ్రెస్ దక్కించుకుంది. వీటిలో సంఖ్యా పరంగా బీసీలకు ఒకటి ఇచ్చినప్పటికీ.. ఎస్సీ, ఎస్టీలకు కూడా అదేస్థాయిలో ఒక్కొక్క సీటును కేటాయించింది. వీరిలో స్థానిక నాయకులను కాదని.. అధిష్టానం దగ్గరేతేల్చుకున్న విజయశాంతి టికెట్ దక్కించుకోవడం అత్యంత కీలకంగా మారింది. అయితే.. సినీ రంగం ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా దూరమైందన్న భావన ఉంది.
ఈ నేపథ్యంలో సినీ రంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు విజయశాంతికి టికెట్ ఇచ్చారన్న చర్చ ఉంది. అయితే.. విజయశాంతికి పార్టీ పెద్దలు స్థానిక నాయకులను కలుపుకొని ముందుకు సాగాలని తేల్చి చెప్పినట్టు సమాచారం. దీనికి ఆమె ఏమేరకు సహకరిస్తారో చూడాలి. ఇక, మరో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా బీసీనాయకుడు దాసోజు శ్రవణ్కుమార్కు టికెట్ ఇవ్వడం ద్వారా.. కాంగ్రెస్ పదే పదే చెబుతున్న బీసీల అనుకూల పార్టీ అనే నినాదం పెద్దగా వినిపించకుండా చేసే వ్యూహం దాగి ఉందన్న చర్చ నడుస్తుండడం గమనార్హం.
This post was last modified on March 11, 2025 1:50 pm
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…
గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…