రెండు తెలుగు రాష్ట్రాలకు బీసీ జ్వరం పట్టుకుందా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన టికెట్ల కేటాయింపును చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఒక్కరు కూడా.. జనరల్ అభ్యర్థికి కేటాయించకపోవడం గమనార్హం. అటు తెలంగాణ అయినా.. ఇటు ఏపీలో అయినా.. బీసీలకే పట్టం కట్టారు. వారికే టికెట్లు కేటాయించారు. అయితే.. ఉన్నవి తక్కువ సంఖ్యే కాబట్టి ఇలా చేశారని అనుకున్నా.. బీసీలకు చాలా వ్యూహాత్మకంగానే టికెట్లు ఇచ్చారు.
ఏపీ విషయానికి వస్తే.. టీడీపీ తనకు దక్కిన మూడు స్థానాల్లో రెండు బీసీలకు కేటాయించింది. రాష్ట్రంలో బీసీ జనాభా సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారిని మరింత చేరువ చేసుకునే క్రమంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆచి తూచి అడుగులు వేశారు. అయితే.. బీసీ నాయకుల్లోనూ చాలా మంది పోటీ పడినా.. వీరిలో అత్యంత విధేయులకు మాత్రమే చంద్రబాబు టికెట్లు ఇవ్వడం గమనార్హం.
మరోవైపు.. తెలంగాణలో మూడు స్థానాలను అధికార పార్టీ కాంగ్రెస్ దక్కించుకుంది. వీటిలో సంఖ్యా పరంగా బీసీలకు ఒకటి ఇచ్చినప్పటికీ.. ఎస్సీ, ఎస్టీలకు కూడా అదేస్థాయిలో ఒక్కొక్క సీటును కేటాయించింది. వీరిలో స్థానిక నాయకులను కాదని.. అధిష్టానం దగ్గరేతేల్చుకున్న విజయశాంతి టికెట్ దక్కించుకోవడం అత్యంత కీలకంగా మారింది. అయితే.. సినీ రంగం ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా దూరమైందన్న భావన ఉంది.
ఈ నేపథ్యంలో సినీ రంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు విజయశాంతికి టికెట్ ఇచ్చారన్న చర్చ ఉంది. అయితే.. విజయశాంతికి పార్టీ పెద్దలు స్థానిక నాయకులను కలుపుకొని ముందుకు సాగాలని తేల్చి చెప్పినట్టు సమాచారం. దీనికి ఆమె ఏమేరకు సహకరిస్తారో చూడాలి. ఇక, మరో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా బీసీనాయకుడు దాసోజు శ్రవణ్కుమార్కు టికెట్ ఇవ్వడం ద్వారా.. కాంగ్రెస్ పదే పదే చెబుతున్న బీసీల అనుకూల పార్టీ అనే నినాదం పెద్దగా వినిపించకుండా చేసే వ్యూహం దాగి ఉందన్న చర్చ నడుస్తుండడం గమనార్హం.
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…