వైసీపీ కీలక నాయకుడు, బీసీ నేత, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాసరావు అరెస్టుపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయననే ఏక్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి అన్నట్టుగా పోలీసులు కూడా వేచి చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో దువ్వాడపై కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో దువ్వాడపై జనసేన నాయకులు కేసులు పెట్టారు.
గతంలో జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆయన దూషించారని.. కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని.. జనసేన నాయకులు గత పదిహేను రోజుల్లో రెండు కేసులు పెట్టారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన జనసేన నాయకుడు ఒకరు దువ్వాడపై కేసు పెట్టారు. ఎన్నికలకు ముందు పవన్ను అసభ్య పదజాలంతో దూషించారని ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ఇక, ఇప్పటికే నమోదైన రెండు కేసులు ఉండడంతో మొత్తం విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రభుత్వం దువ్వాడ అరెస్టుకు ఓకే అంటే.. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోనున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ, జనసేనలపై విరుచుకుపడిన వైసీపీ నాయకుల్లో దువ్వాడ ఒకరు. జగన్ మెప్పు కోసం.. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాటా అనేసి.. మీడియాలో రచ్చ రచ్చ చేశారు. అయితే.. ఇప్పుడు వారిపై కేసులు నమోదవుతున్నాయి.
ఇలాంటి కేసుల్లోనే చిక్కుకున్న పోసాని కృష్ణ మురళి.. ఇంకా కర్నూలు జైల్లోనే ఉన్నారు. మరోవైపు.. ఆయనపై.. శ్రీకాకుళం, విజయనగరంలోనూ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా.. ఒక్కొక్కరుగా జగన్పై విరాభిమానంతో నోరు చేసుకున్న నాయకులు జైలు పాలవుతుండడం గమనార్హం. ఈ పరంపరలో ఇప్పుడు దువ్వాడ శ్రీను వ్యవహారం తెరమీదికి వచ్చింది.
This post was last modified on March 11, 2025 1:39 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…