వైసీపీ కీలక నాయకుడు, బీసీ నేత, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాసరావు అరెస్టుపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయననే ఏక్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి అన్నట్టుగా పోలీసులు కూడా వేచి చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో దువ్వాడపై కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో దువ్వాడపై జనసేన నాయకులు కేసులు పెట్టారు.
గతంలో జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆయన దూషించారని.. కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని.. జనసేన నాయకులు గత పదిహేను రోజుల్లో రెండు కేసులు పెట్టారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన జనసేన నాయకుడు ఒకరు దువ్వాడపై కేసు పెట్టారు. ఎన్నికలకు ముందు పవన్ను అసభ్య పదజాలంతో దూషించారని ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ఇక, ఇప్పటికే నమోదైన రెండు కేసులు ఉండడంతో మొత్తం విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రభుత్వం దువ్వాడ అరెస్టుకు ఓకే అంటే.. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోనున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ, జనసేనలపై విరుచుకుపడిన వైసీపీ నాయకుల్లో దువ్వాడ ఒకరు. జగన్ మెప్పు కోసం.. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాటా అనేసి.. మీడియాలో రచ్చ రచ్చ చేశారు. అయితే.. ఇప్పుడు వారిపై కేసులు నమోదవుతున్నాయి.
ఇలాంటి కేసుల్లోనే చిక్కుకున్న పోసాని కృష్ణ మురళి.. ఇంకా కర్నూలు జైల్లోనే ఉన్నారు. మరోవైపు.. ఆయనపై.. శ్రీకాకుళం, విజయనగరంలోనూ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా.. ఒక్కొక్కరుగా జగన్పై విరాభిమానంతో నోరు చేసుకున్న నాయకులు జైలు పాలవుతుండడం గమనార్హం. ఈ పరంపరలో ఇప్పుడు దువ్వాడ శ్రీను వ్యవహారం తెరమీదికి వచ్చింది.
This post was last modified on March 11, 2025 1:39 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…