టీడీపీలో తరంతో పాటు స్వరమూ మారుతోంది. నేటి తరానికి అనుకూలంగా రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో ఆదిశగానే.. సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కష్టమే అయినా.. కొందరు సీనియర్లను పక్కన పెట్టాల్సి వస్తోంది. ఇలాంటివారిలో తాజాగా తెరమీదికి వచ్చిన పేరు యనమల రామకృష్ణుడు. ఈయన రాజకీయాలు ప్రారంభించింది టీడీపీతోనే. అన్నగారి పిలుపుతో రాజకీయ అరంగేట్రం చేసిన రామకృష్ణుడు.. తర్వాత కాలంలో స్పీకర్గా, మంత్రిగా కూడా పనిచేశారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి విజయాలు దక్కించుకున్న రామకృష్ణుడు.. వైఎస్ ప్రభావంతో 2004లో ఓడిపోయారు. ఆ తర్వాత.. మళ్లీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. కానీ, చంద్రబాబుకు, ఆయనకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా.. 2014లో ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రి పదవిని కూడా కట్టబెట్టారు. ఆతర్వాత.. యనమల తమ్ముడు కృష్ణుడికి అవకాశం కల్పించారు. తాజాగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కుమార్తె దివ్యకు వరుసగా రెండో సారి అవకాశం ఇచ్చారు.
ఈ దఫా ఎన్నికల్లో దివ్య విజయం దక్కించుకున్నారు. దీంతో యనమల కుటుంబం నుంచి యువ నాయకురాలు రంగంలోకి వచ్చినట్టు అయింది. ఇక, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న యనమల.. పదవీ కాలం ఈ నెల 29తో ముగియనుంది. అయితే.. ఈ దఫా ఆయనకు మరోసారి రెన్యువల్ ఉంటుందని అందరూ భావించారు. కానీ, కొత్తవారికి అవకాశం కల్పించాలన్న ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతుండడంతో చంద్రబాబు యనమలను పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే బీసీ యాదవ సామాజిక వర్గానికే చెందిన బీదకు అవకాశం ఇచ్చారు.
అన్నగారి నుంచి మెప్పులు-తిప్పలు!
యనమల రామకృష్ణుడుకు.. దివంగత ఎన్టీఆర్కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యువతగా ఉన్నప్పుడు యనమలను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చిన రామారావు.. అనేక సందర్భాల్లో బీసీల తరఫున ప్రతినిధిగా యనమలను ప్రస్తావించేవారు. బీసీలకు కీలక నాయకుడిగా ఎదుగుతాడని కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే టీడీపీలో ఏర్పడిన సంక్షోభం సమయంలో స్పీకర్గా ఉన్న రామకృష్ణుడిని.. అసెంబ్లీలో ఎన్టీఆర్ తప్పుబట్టారు. తనకు కనీసం ఒక్క నిమిషం కూడా మైకు ఇవ్వడం లేదని.. ఇదేనా మీ విజ్ఞత అని దుయ్యబట్టారు. ఇలా.. అన్నగారి నుంచి మెప్పులు పొందిన, తిప్పలు పొందిన నాయకుడు యనమల కావడం గమనార్హం.
This post was last modified on March 11, 2025 1:34 pm
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…