Political News

వంగ‌వీటి రాధా రాజ‌కీయ స‌న్యాసం?

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. అనూహ్య‌మైన పొలిటిక‌ల్ బాంబు పేలింది. దీనికి కార‌ణం.. వంగ‌వీటి రాధా.. రాజ‌కీయ స‌న్యాసం చేయ‌నుండ‌డ‌మే. విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ఇక‌, రాధా పేరు వినిపిం చే అవ‌కాశం లేక‌పోవ‌డ‌మే. ఈ విష‌యంపై అంత్యంత స‌న్నిహిత వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఔన‌నే అంటున్నారు రాధా అనుచ‌రులు. దీంతో విజ‌య‌వాడలో ఇక‌, రంగా పేరు మాత్ర‌మే వినిపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఆత్మాభిమానమే ప్ల‌స్సు-మైన‌స్సు!

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ ప్ర‌వేశం చేసిన రాధా.. అవే గుణాల‌ను కూడా అందిపుచ్చుకున్నారు. ఇది కొన్ని కొన్ని సార్లు ప్ల‌స్ అయినా.. అదేస‌మ‌యంలో అనేక సార్లు మైన‌స్ అయింది. త‌న‌కు టికెట్ ఇవ్వ ని పార్టీలో ఉండ‌లేన‌ని భీష్మించి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌త్వం రాధాది. గ‌తంలో ఇదే ప‌రిస్థితి రంగాకు కూడా ఎదురైంది. అయితే.. ఆయ‌న అప్ప‌ట్లో అధిష్టానాన్ని మెప్పించి టికెట్ తెచ్చుకున్నారు. ఈ లౌక్యం వంగ‌వీ టి రాధాలో లోపించింది. పైగా ఆత్మాభిమానం ఆయ‌న‌కు పెట్ట‌ని ఆభ‌ర‌ణంగా ఉన్నా.. అదే ప్ల‌స్సు.. అదే మైన‌స్సు కూడా అయింది.

నాలుగు స్తంభాలాట‌…
రంగాతో పోల్చుకుంటే.. రాధా రాజ‌కీయంగా ప్ర‌యోగాలు చేశార‌నే చెప్పాలి. రంగా కేవ‌లం రెండు పార్టీలకు మాత్ర‌మే నాయ‌కుడిగా ప‌నిచేశారు. త‌ర్వాత చివ‌ర‌కు ఒకే పార్టీలో ప‌రిమిత‌మ‌య్యారు. కానీ రాధా విష‌యా నికి వ‌స్తే.. కాంగ్రెస్‌-ప్ర‌జారాజ్యం-వైసీపీ-టీడీపీ అంటూ నాలుగు స్తంభాలాట ఆడారు. ఇది.. ఆయ‌న ఓటు బ్యాంకును తీవ్రంగా ప్ర‌భావితం చేసింద‌నే చెప్పాలి. అంతేకాదు.. నిల‌క‌డ‌లేని మ‌న‌స్త‌త్వం వంటివి కూడా రాధా గ్రాఫ్‌కు అడ్డంకిగానే మారాయి. ఫ‌లితంగా 2004 విజ‌యం త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు రాధా ప్ర‌జ‌ల మ‌ధ్య విజ‌యం సాధించ‌లేక‌పోయారు.

కీల‌క నిర్ణ‌యం వెనుక‌?
తాజాగా రాధా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు సంచ‌ల‌న బాంబు పేలింది. అయితే.. ఈ నిర్ణ‌యం వెనుక రాజ‌కీయ కార‌ణంతోపాటు.. కుటుంబ కార‌ణాలు కూడా ఉన్నాయ‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ప‌ద‌వుల కోసం.. పాకులాడ‌కుండా.. పార్టీలో ప‌నిచేసినా త‌న‌కు గుర్తింపు లేద‌న్న ఆవేద‌న‌.. అడిగితే త‌ప్ప ప‌దవులు ద‌క్కే ప‌రిస్థితి లేద‌న్న ఆందోళ‌న వ్య‌క్తిగ‌తంగా రాధాను కుంగదీస్తున్నాయి. మ‌రోవైపు.. కుటుంబ స‌మ‌స్య‌ల కార‌ణంగా కూడా ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరం జ‌ర‌గాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు రాధా రంగా మిత్ర‌మండ‌లిలోని కీల‌క వ్య‌క్తి ఒక‌రు చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on March 11, 2025 1:23 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

4 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

4 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

5 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

6 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

6 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

6 hours ago