Political News

వంగ‌వీటి రాధా రాజ‌కీయ స‌న్యాసం?

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. అనూహ్య‌మైన పొలిటిక‌ల్ బాంబు పేలింది. దీనికి కార‌ణం.. వంగ‌వీటి రాధా.. రాజ‌కీయ స‌న్యాసం చేయ‌నుండ‌డ‌మే. విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ఇక‌, రాధా పేరు వినిపిం చే అవ‌కాశం లేక‌పోవ‌డ‌మే. ఈ విష‌యంపై అంత్యంత స‌న్నిహిత వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఔన‌నే అంటున్నారు రాధా అనుచ‌రులు. దీంతో విజ‌య‌వాడలో ఇక‌, రంగా పేరు మాత్ర‌మే వినిపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఆత్మాభిమానమే ప్ల‌స్సు-మైన‌స్సు!

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ ప్ర‌వేశం చేసిన రాధా.. అవే గుణాల‌ను కూడా అందిపుచ్చుకున్నారు. ఇది కొన్ని కొన్ని సార్లు ప్ల‌స్ అయినా.. అదేస‌మ‌యంలో అనేక సార్లు మైన‌స్ అయింది. త‌న‌కు టికెట్ ఇవ్వ ని పార్టీలో ఉండ‌లేన‌ని భీష్మించి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌త్వం రాధాది. గ‌తంలో ఇదే ప‌రిస్థితి రంగాకు కూడా ఎదురైంది. అయితే.. ఆయ‌న అప్ప‌ట్లో అధిష్టానాన్ని మెప్పించి టికెట్ తెచ్చుకున్నారు. ఈ లౌక్యం వంగ‌వీ టి రాధాలో లోపించింది. పైగా ఆత్మాభిమానం ఆయ‌న‌కు పెట్ట‌ని ఆభ‌ర‌ణంగా ఉన్నా.. అదే ప్ల‌స్సు.. అదే మైన‌స్సు కూడా అయింది.

నాలుగు స్తంభాలాట‌…
రంగాతో పోల్చుకుంటే.. రాధా రాజ‌కీయంగా ప్ర‌యోగాలు చేశార‌నే చెప్పాలి. రంగా కేవ‌లం రెండు పార్టీలకు మాత్ర‌మే నాయ‌కుడిగా ప‌నిచేశారు. త‌ర్వాత చివ‌ర‌కు ఒకే పార్టీలో ప‌రిమిత‌మ‌య్యారు. కానీ రాధా విష‌యా నికి వ‌స్తే.. కాంగ్రెస్‌-ప్ర‌జారాజ్యం-వైసీపీ-టీడీపీ అంటూ నాలుగు స్తంభాలాట ఆడారు. ఇది.. ఆయ‌న ఓటు బ్యాంకును తీవ్రంగా ప్ర‌భావితం చేసింద‌నే చెప్పాలి. అంతేకాదు.. నిల‌క‌డ‌లేని మ‌న‌స్త‌త్వం వంటివి కూడా రాధా గ్రాఫ్‌కు అడ్డంకిగానే మారాయి. ఫ‌లితంగా 2004 విజ‌యం త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు రాధా ప్ర‌జ‌ల మ‌ధ్య విజ‌యం సాధించ‌లేక‌పోయారు.

కీల‌క నిర్ణ‌యం వెనుక‌?
తాజాగా రాధా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు సంచ‌ల‌న బాంబు పేలింది. అయితే.. ఈ నిర్ణ‌యం వెనుక రాజ‌కీయ కార‌ణంతోపాటు.. కుటుంబ కార‌ణాలు కూడా ఉన్నాయ‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ప‌ద‌వుల కోసం.. పాకులాడ‌కుండా.. పార్టీలో ప‌నిచేసినా త‌న‌కు గుర్తింపు లేద‌న్న ఆవేద‌న‌.. అడిగితే త‌ప్ప ప‌దవులు ద‌క్కే ప‌రిస్థితి లేద‌న్న ఆందోళ‌న వ్య‌క్తిగ‌తంగా రాధాను కుంగదీస్తున్నాయి. మ‌రోవైపు.. కుటుంబ స‌మ‌స్య‌ల కార‌ణంగా కూడా ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరం జ‌ర‌గాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు రాధా రంగా మిత్ర‌మండ‌లిలోని కీల‌క వ్య‌క్తి ఒక‌రు చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on March 11, 2025 1:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

50 minutes ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

3 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

3 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

4 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

7 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

8 hours ago