Political News

రోజా, బైరెడ్డిలకు కష్టాలు… ఏం జరుగుతోంది?

ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు చెందిన యువ నేత, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలకు గుర్తింపు ఉంది. వైరి వర్గాలను టార్గెట్ చేయడంలో వీరిద్దరిదీ అందె వేసిన చేయి అని చెప్పక తప్పదు. అయితే వీరిద్దరికీ జాయింట్ గానే కష్టాలు మొదలైపోయాయని చెప్పాలి. ఎందుకంటే… వైసీపీ అధికారంలో ఉండగా… రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు అంటూ ఆడుదాం ఆంధ్రా పేరిట ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రాష్ట్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్ లో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ ఆరోపణలపై కూటమి సర్కారు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా అటు రోజాతో పాటు ఇటు బైరెడ్డి కూడా జాయింట్ గానే ఈ కుంభకోణంలో ఇరుక్కునే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం నాటి సమావేశాల్లో ఈ అంశాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియా రెడ్డి ప్రస్తావించారు. ఆడుదాం ఆంధ్రా పేరిట రూ.400 కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పిన వైసీపీ ప్రభుత్వం… అందులో క్రీడలతో కాకుండా ప్రజల సొమ్ముతో జగన్ సర్కారు ఆటలాడిందని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేవలం ప్రచారానికే రూ.35 కోట్లను ఖర్చు చేశారని కూడా ఆమె తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

భూమా వాదనను మరింతగా బలపరచిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గౌతు శిరీషలు విచారణకు ఆదేశించాల్సిందేనని పట్టుబట్టారు. దీనికి సమాధానం ఇచ్చి న మంత్రి రాంప్రసాద్ రెడ్డి… ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు జారీ చేశామని, విచారణ పూర్తి కాగానే… నివేదికను ప్రభుత్వం ముందు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

వాస్తవానికి ఆడుదాం ఆంధ్ర కోసం నాటి ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేసిన మాటలో వాస్తవం లేదన్న మంత్రి… 45 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రూ.119 కోట్లను ఖర్చు చేశారని వివరించారు. అయితే అందులో మెజారిటీ నిధులను క్రీడా పరికరాలు కొనుగోలు చేసేందుకే వినియోగించినట్లుగా పేర్కొన్నారని ఆయన వివరించారు. అయితే ఆ క్రీడా పరికరాల నాణ్యతపై నాడే విమర్శలు వచ్చాయని… ఈ కారణంగానే కూటమి సర్కారు అధికారంలోకి రాగానే… దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ఇక ప్రచారం కోసం కూడా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు అయినట్లుగా చూపారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంత మంది క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చారన్న వివరాలేమీ లేవన్న మంత్రి… మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్టుగా తెలిపారు. ఈ విచారణలో అక్రమాలు ఉన్నాయని తేలితే మాత్రం అటు రోజాతో పాటుగా ఇటు బైరెడ్డికి కూడా కష్టాలు తప్పేలా లేవన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

This post was last modified on March 11, 2025 1:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర‌వింద స‌మేత తరువాత బాధపడ్డ హీరోయిన్

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అత్యుత్త‌మమైన‌, విభిన్న‌మైన చిత్రాల్లో అర‌వింద స‌మేత ఒక‌టి. అందులో కీల‌క పాత్ర‌లు పోషించిన ఆర్టిస్టులంద‌రికీ మంచి…

3 hours ago

ఎవ‌రా హీరోయిన్… ద‌ర్శ‌కుడికి మినిస్ట‌ర్ల ఫోన్లు

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ కెరీర్లో చూడాల‌ని ఉంది, ఒక్క‌డు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో పాటు సైనికుడు, వ‌రుడు, నిప్పు లాంటి దారుణ‌మైన…

5 hours ago

10 వేల కెపాసిటీ బ్యాటరీతో ఫోన్ వచ్చేసింది

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రియల్‌మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్‌ను విడుదల చేసింది.…

10 hours ago

వెండి కూడా బంగారానికి చేరువయ్యేలా..

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…

11 hours ago

కూతురు కాదు కసాయి… షాకింగ్ ఘటన

అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…

11 hours ago

జగన్ పాదయాత్రపై షర్మిల సంచలన వ్యాఖలు

ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…

14 hours ago