Political News

సాయిరెడ్డి వంతు వచ్చేసింది!

వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన నిర్వాకాలపై కూటమి పాలనలో వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ కేసుల్లో కొందరు అరెస్టు అవుతూ వస్తున్నారు. మరికొందరు కోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిళ్లు తీసుకుంటూ ప్రస్తుతానికి అరెస్టుల నుంచి ఉపశమనం పొందుతున్నారు. రోజులు గడిచే కొద్దీ ఈ జాబితా పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు ఈ జాబితాలోకి మాజీ వైసీపీ నేత, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి కూడా చేరిపోయారు.

ఏపీ సీఐడీ అధికారులు సాయిరెడ్డికి సోమవారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు. ఈ బుధవారం ఓ కేసు నిమిత్తం విచారణకు హాజరు కావాలంటూ సదరు నోటీసుల్లో సీఐడీ ఆయనను ఆదేశించింది. కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో ఆ సంస్థ యజమాని కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాయిరెడ్డిపై సీఐడీ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే విచారణకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో సీఐడీ అధికారులు సాయిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై విక్రాంత్ రెడ్డి కీలక నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టును ఆశ్రయించిన విక్రాంత్ రెడ్డి రెండు రోజుల క్రితమే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఈ కేసులో తాను తప్పేం చేయలేదని, తాను బెయిల్ కోరబోనని కూడా సాయిరెడ్డి ప్రకటించారు.

ఇదిలా ఉంటే… వైసీపీ ప్రారంభం అయిన నాటి నుంచి పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన సాయిరెడ్డి..ఢిల్లీలో పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా చాలా కాలం పాటు పనిచేశారు. బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలను మెయింటైన్ చేసిన సాయిరెడ్డి… జగన్ అక్రమాస్తుల కేసులకు ఎక్కడికక్కడ కళ్లెం వేయడంలో సఫలీకృతులు అయ్యారన్న వాదనలూ లేకపోలేదు. అయితే వైసీపీ అదికారం నుంచి దిగిపోగా… అనూహ్యంగా సాయిరెడ్డి రాజకీయాలకు సన్యాసం ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్న సాయిరెడ్డి… ఇక వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. చెప్పినట్లుగానే సాగు మొదలుపెట్టేసిన సాయిరెడ్డి.. సీఐడీ పోలీసుల నోటీసులకు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

This post was last modified on March 11, 2025 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

7 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

7 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

8 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

8 hours ago