Political News

అమ‌రావ‌తి పై అనుమానాలొద్దు.. ఇక పరుగులే

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌తిప‌క్షం వైసీపీ నాయ‌కులు సృష్టిస్తున్న విషప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు నమ్మ‌రాద‌ని ఏపీ మంత్రులు కోరారు. రాజ‌ధాని కోసం వేల కోట్ల రూపాయ‌ల‌ను అప్పుగా తీసుకువ‌చ్చి పెడుతున్నార‌ని, ఈ అప్పులు ఎలా తీరుస్తార‌ని, తిరిగి ప్ర‌జ‌ల‌పై భారాలు మోపుతార‌ని గ‌త నాలుగు రోజులుగా వైసీపీ అనుకూల మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని మంత్రులు నారాయ‌ణ‌, కేశవ్‌, కందుల దుర్గేష్ ఖండించారు. రాజ‌ధాని పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు న‌మ్మ‌రాద‌ని వారు సూచించారు. రాజ‌ధాని స్వ‌యంప్ర‌తి ప‌త్తి క‌లిగిన ఆర్థిక సంస్థ‌గా వారు పేర్కొన్నారు.

రాజ‌ధాని కోసం ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయినీ తిరిగి రాబ‌ట్టుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. పైగా రాష్ట్ర ప్ర‌జ‌లపై ఒక్క రూపాయి కూడా భారం ప‌డ‌బోద‌న్నారు. చాలా సూక్ష్మ స్థాయిలో ఆలోచించి.. రాజ‌ధానిని ప్లాన్ చేసిన‌ట్టు వివ‌రించారు. ఇక్క‌డ ఎవ‌రూ ఎవ‌రి రూపాయి పోగొట్టుకోర‌ని.. ఇది ఆర్థిక రాజ‌ధానిగా కూడా భాసిల్లుతుంద‌న్నారు. అప్పులు చేసినా.. వాటిని తీర్చు కునే సామ‌ర్థ్యం అమ‌రావ‌తికి ఉంటుంద‌న్నారు. కాబ‌ట్టి అమ‌రావ‌తి పై జ‌రుగుతున్న వ్య‌తిరేక ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు తిప్పి కొట్టాల‌ని మంత్రులు పిలుపునిచ్చారు.

మ‌రోవైపు… రాజ‌ధానిలో భూముల కేటాయింపు పై అధ్య‌య‌నం చేసిన మంత్రివ‌ర్గ స‌భ్యులు.. ఇక్క‌డ గ‌తంలో కేటాయించిన భూముల‌ను మార్పు చేయ‌డం లేద‌న్నారు. గ‌తంలో 131 సంస్థ‌ల‌కు భూములు కేటాయించ‌గా.. 31 సంస్థ‌లు వ‌చ్చాయ‌ని.. మ‌రో 13 సంస్థ‌లు వ‌ద్ద‌ని వెళ్లిపోయాయ‌ని వివ‌రించారు. అయితే.. వాటికి కేటాయించిన భూముల విష‌యంలో పెద్ద‌గా మార్పులు చేయ‌డం లేద‌న్నారు. ఇదేస‌మ‌యంలో మ‌రికొన్ని సంస్థ‌ల విజ్ఞ‌ప్తి మేర‌కు.. భూముల ప‌రిదిని విస్త‌రిస్తున్న‌ట్టు మంత్రి నారాయణ తెలిపారు. ఆయా సంస్థ‌లు సాధ్య‌మైనంత వేగంగా ప‌నులు చేప‌ట్టేందుకు అవ‌కాశం ఉంద‌న్నారు.

మ‌రో రెండు సంస్థలకు గతంలో కేటాయించిన భూములు కాకుండా వేరే చోట ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరో 16 సంస్థలకు స్థలంతోపాటు పరిధినీ మార్చనున్న‌ట్టు మంత్రి తెలిపారు. రైతుల నుంచి సేక‌రించిన 34 వేల ఎకరాల భూమిలో రాజ ధాని నిర్మించేందుకు రూ.43 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్టు తెలిపారు. ఈ నెల 12 నుంచి ప‌నులు ప్రారంభం అవుతాయ‌ని వివ‌రించారు. వైసీపీ హ‌యాంలో ప‌నులు చేప‌ట్టి ఉంటే.. రాజ‌ధాని నిర్మాణాలు పూర్త‌య్యేవ‌ని తెలిపారు. కానీ, వైసీపీ ప్ర‌భుత్వం మూడుముక్క‌లాట ఆడ‌డంతో ప‌నులు ఆగిపోయి.. ఇప్పుడు భారం పెరిగిపోయింద‌ని తేల్చి చెప్పారు.

This post was last modified on March 11, 2025 10:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గ‌ద్ద‌ర్ అవార్డుల్లో గందరగోళం.. ఏం జరిగింది?

గ‌త ఏడాది ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను మొద‌లుపెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఒకేసారి చాలా ఏళ్ల‌కు క‌లిపి అవార్డులు ప్ర‌క‌టించిన సంగ‌తి…

19 minutes ago

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

3 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

7 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

7 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

7 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

8 hours ago