Political News

జగన్ దుబారాతోనూ బాబు సంపద సృష్టి

సంపద సృష్టి అనే పదం విన్నంతనే… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడే అందరికీ గుర్తుకు వస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఆర్థిక కార్యకలాపాలను పరుగులు పెట్టించడం, వాటి ద్వారా సర్కారీ ఖజానాకు ఆదాయాన్ని ఆర్జించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. వైసీపీ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… సీఎం అధికారిక నివాసం కోసమంటూ విశాఖలోని రిషికొండపై వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంద్రభవనం లాంటి భవన సముదాయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే రెండో సారి సీఎం కావాలన్న జగన్ కల నెరవేరలేదు. ఐదేళ్లతో జగన్ పై విసుగు వచ్చేసిన జనం… టీడీపీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు మరోమారు ఏపీకి సీఎం అయ్యారు.

ఈ క్రమంలో తిరిగి అమరావతికి పూర్వ వైభవం వచ్చేసింది. ఫలితంగా విశాఖలో జగన్ కట్టిన భవన సముదాయం సీఎం అధికారిక నివాసంగా మారే అవకాశం లేదు. మరి ప్రజా ధనంతో నిర్మించిన ఈ భవనాలను ఏం చేయాలి? ప్రజా వేదికను జగన్ కూల్చేసినట్లుగా రిషికొండ భవనాలను చంద్రబాబు కూల్చేయలేదు కదా. మరింకేం చేయాలి? జగన్ దుబారా చేసినా అది ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్ముతోనే నిర్మించిన ఆ భవనాల నుంచి సంపదను సృష్టిద్దామంటూ బాబు తీర్మానం చేశారు.

ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటే లాభసాటిగా ఉంటుందన్న విషయంపై మీమీ అభిప్రాయాలు తెలపండి అంటూ చంద్రబాబు సర్కారు ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్లింది. ప్రజలు సూచించిన పలు సలహాలు, సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇంకో 7 నుంచి 8 లక్షల ఖర్చు చేస్తే… ఈ భవనాలను వినిగించుకునేలా ఏర్పాట్లు జరిగిపోతాయని అధికారులు ఇప్పటికే నిర్ధారించారు.

ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమకు తోచిన అభిప్రాయాలను ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇటీవలే నేపాల్ హైకమిషనర్ ఒకరు విశాఖ వచ్చినప్పుడు ఆయన ఈ భవనాలను చూసి… అందులో తమ విదేశాంగ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పారట. ఇందుకోసం ఆయన ఏకంగా కేంద్రానికి వినతి పత్రం కూడా సమర్పించారట. ఇందుకు కేంద్రం సరేనంటే…నేపాల్ హై కమిషన్ తో పాటు మరికొన్ని దేశాల హై కమిషన్లు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.

మిగలిన వాటిలో కొన్నింటిని వాణిజ్య, ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటే… ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఓ విద్యావేత్త చెప్పారు. మరొకరు టూరిజం ప్రాజెక్టుగా వినియోగించుకోవాలని, ఇంకొకరు అయితే ఓ కన్వెన్షన్ హాల్ గా వినియోగించుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చారు. వీటిలో దేనికో ఒకదానికి ఈ భవనాలను ప్రభుత్వం వినియోగించడం ఖాయమే. అంటే జగన్ తన జల్సాల కోసం కట్టారన్న ప్రచారం ఉన్న ఈ భవనాలతో చంద్రబాబు సంపదను సృష్టించడం ఖాయమేనన్న మాట.

This post was last modified on March 10, 2025 9:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

6 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

7 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

8 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

8 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

9 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

11 hours ago