Political News

బాబుతో వీర్రాజు ప్యాచప్ అయినట్టే!

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా… పోటీకి దూరంగా ఉండిపోయిన జనసేన.. ఆ రెండు పార్టీల కూటమికి మద్దతుగా నిలిచింది. వెరసి టీడీపీ, బీజేపీ విజయం సాధించాయి. రెండు పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ క్రమంలోనే బీజేపీకి చెందిన సీనియర్ నేత సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. నాడు చంద్రబాబు విధానాలను విమర్శిస్తూ సాగిన వీర్రాజు… తాజాగా ఇప్పుడు మరోమారు టీడీపీ సభ్యుల మద్దతుతోనే మరోమారు ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి 5 స్థానాలు దక్కగా.. వాటిలో ఓ స్థానం బీజేపీకి దక్కగా… ఆ స్థానం నుంచి వీర్రాజే నామినేషన వేశారు. అనంతరం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. మరి ఈ సారి అయినా చంద్రబాబుతో వీర్రాజు కలిసి సాగుతారా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.

2014లో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగానే ఉన్నా గానీ ఎందుకనో గానీ… వీర్రాజు నిత్యం బాబు విధానాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించేవారు. బీజేపీ నేతలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపణలు గుప్పించేవారు. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కూడా ఆరోపించేవారు. ఫలితంగా స్వపక్షంలోనే చంద్రబాబుకు ఆయన ఓ విపక్షంలా మారిపోయారన్న వాదనలు వినిపించాయి. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన సమయంలో వీర్రాజు మరింతగా తన నోటికి పని చెప్పారు. తానేదో వైసీపీ సభ్యుడినన్నట్లుగా వీర్రాజు వ్యవహరించేవారు. చంద్రబాబు పాలనలో ప్రజలకు గానీ, రాష్ట్రానికి గానీ పెద్దగా ఒరిగిందేమీ లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసేవారు.

నాటి విషయాలన్నింటినీ చంద్రబాబు అయితే పక్కనపెట్టేశారనే చెప్పాలి. పొత్తు ధర్మంలో భాగంగా తనకు దక్కిన 5 ఎమ్మెల్సీల్లో ఓ స్థానాన్ని బీజేపీకి, మరో సీటును బీజేపీకి ఆయన కేటాయించారు. బీజేపీ తన సీటును వీర్రాజుకు కేటాయించింది. ఈ ప్రతిపాదనకు చంద్రబాబు ఓకే అన్న తర్వాతే బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వచ్చిందని చెప్పక తప్పదు. గతంలో తన విధానాలనే విమర్శిస్తూ సాగిన వీర్రాజు అభ్యర్థిత్వాన్ని కాదనకుండా చంద్రబాబు పరిణతితో సాగారు. మరి అదే పరిణతి, పొత్తు ధర్మాన్ని వీర్రాజు పాటిస్తారా? లేదా? అన్నది చూడాలి. నామినేషన్ తర్వాత తనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చిన బీజేపీ పెద్దలతో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు కూడా వీర్రాజు థ్యాంక్స్ చెప్పారు. అంతటితో ఆగకుండా పురంధేశ్వరి వెంట రాగా… ఆయన చంద్రబాబును నేరుగా వెళ్లి కలిశారు. ఇదంతా చూస్తుంటే… చంద్రబాబు మాదిరే వీర్రాజు కూడా గతాన్ని గుర్తు చేయకుండా సాగుతారన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి.

This post was last modified on March 10, 2025 6:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

58 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago