Political News

రాములమ్మ రీ ఎంట్రీ అదిరిపోయినట్టే

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి రాజకీయాల్లోకి పున:ప్రవేశం అదిరిపోయిందని చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన రాములమ్మ… అప్పట్లో మెదక్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఆమెకు అంతగా కలిసి రాలేదు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఆమెకు అవకాశం దక్కింది. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు దక్కగా .. వాటిలో ఓ స్థానాన్ని పార్టీ అధిష్ఠానం విజయశాంతికి కేటాయించింది. పార్టీ మరో ఇద్దరు అభ్యర్థులు అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్ లతో కలిసి సోమవారం ఆమె తన నామినేషన్ ను దాఖలు చేశారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళి ఆమె నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందని ఆమె తెలిపారు. ఎవరినో అడుక్కుంటే తనకు సీటు రాలేదని కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ బీసీ మహిళా నేతగా తనకు పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను పోషించిన పాత్రను గుర్తించిన తర్వాతే పార్టీ తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిందని కూడా విజయశాంతి తెలిపారు. తన సేవలను గుర్తింపుగానే ఎమ్మెల్సీ టికెట్ తనకు దక్కిందన్న రాములమ్మ… ఎమ్మెల్సీ సీటు కోసం తాను ఎవరినీ అడగలేదని కూడా తెలిపారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన అధిష్ఠానం… మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటుందో, లేదో తనకు తెలియదని ఆమె ఓ ప్రశ్నకు బదులు ఇచ్చారు.

ఇదిలా ఉంటే… విపక్ష బీఆర్ఎస్, బీజేపీలపై రాములమ్మ సంచలన ఆరోపణలు గుప్పించారు. తాను బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాట వాస్తవమేనని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ ను ఓడించేందుకే తనను బీజేపీ చేర్చుకుందని తెలిపారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీఆర్ఎస్ ను ఓడించే వ్యూహంతో సాగుతున్నామని బీజేపీ చెప్పడంతోనే ఆ పార్టీలో చేరానని ఆమె తెలిపారు. అయితే బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆమె సంచలన ఆరోపణ చేశారు. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం గుర్తించిన వెంటనే తాను బీజేపీ నుంచి బయటకు వచ్చానని ఆమె తెలిపారు. అటు కాంగ్రెస్ స్థానిక నాయకత్వంతో తనకు అవసరం లేదన్నట్లుగా మాట్లాడిన రాములమ్మ… ఇటు విపక్షాల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందంటూ సంచలన ఆరోపణలు చేయడం ద్వారా తన రీ ఎంట్రీని ఆమె గ్రాండ్ గా చాటుకున్నారన్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on March 10, 2025 6:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

1 hour ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

5 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago