Political News

పార్టీ విధేయులకు అన్యాయం జరగదు: నారా లోకేశ్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరుకు ఐదేసి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న సంగతి తెలిసిందే. ఈ స్థానాలు భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా… మొత్తం 10 స్థానాలకు 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఫలితంగా ఈ ఎన్నికల్లో పోలింగ్ కు అవకాశం లేదనే చెప్పాలి. నామినేషన్లు వేసిన వారంతా దాదాపుగా శాసన మండలికి ఎన్నికవడం లాంఛనమే.

ఏపీలో 5 స్థానాలకు గాను టీడీపీ మూడు సీట్లకు… జనసేన, బీజేపీలు ఒక్కో సీటు చొప్పున అభ్యర్థులను ఖరారు చేశాయి. టీడీపీ సభ్యులుగా ఎంపికైన బీద మస్తాన్ రావు, బీటీ నాయుడు, కావలి గ్రీష్మలు సోమవారం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెంట రాగా… తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పటికీ అన్యాయం జరగదని ఆయన అన్నారు. పార్టీ విధేయులకు తప్పనిసరిగా అవకాశాలు వస్తాయని, అప్పటిదాకా వేచి చూడక తప్పదన్నారు. ఈ దఫా అందుబాటులోకి వచ్చిన 3 సీట్లను బలహీన వర్గాలకు కేటాయించాలని అనుకున్నామని… ఆ మేరకే ముగ్గురు అభ్యర్థులను కూడా బలహీన వర్గాలకు చెందిన వారినే ఎంపిక చేశామని తెలిపారు. జనసేన అభ్యర్థి నాగబాబు ఇదివరకే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక బీజేపీ అభ్యర్థిగా ఖరారు అయిన మాజీ ఎమ్మెల్యే సోము వీర్రాజు కూడా తన నామినేషన్ ను దాఖలు చేశారు. అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతిలు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీప్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం యాదవ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇక విపక్షం బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ నేత దాసోజు శ్రావణ్ కూడా తన నామినేషన్ ను దాఖలు చేశారు.

Satya

Recent Posts

ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం దొరికిందా

బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…

2 hours ago

అమెరికా వెళ్లే వారికి అలెర్ట్‌… నాలుగేళ్లే గ‌డువు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేష‌న్…

2 hours ago

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

4 hours ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

5 hours ago

OG 2… ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…

7 hours ago

హీరోల్లో గుబులు రేపుతున్న సమంత

హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్‌ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…

7 hours ago