తెలుగులో ఇంతకుముందు ప్రయాణం, ఊసరవెల్లి లాంటి సినిమాల్లో నటించిన ముంబయి భామ పాయల్ ఘోష్ ఈ మధ్య కాలంలో ఏమీ సినిమాలు చేసినట్లు లేదు కానీ.. వార్తల్లో మాత్రం బాగానే నిలుస్తోంది. ముఖ్యంగా గత నెలలో బాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన అనురాగ్ కశ్యప్ మీద ఆమె చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ ఆరోపణల్లో భాగంగా రిచా చద్దా సహా ఒకరిద్దరు హీరోయిన్లను తక్కువ చేసి మాట్లాడటం, రిచా పరువు నష్టం దావా వేయడంతో తప్పయిపోయిందని క్షమాపణ చెప్పడం తెలిసిన సంగతే.
ఆ వ్యవహారం తర్వాత ఇప్పుడు పాయల్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఆమె చడీచప్పుడు లేకుండా రాజకీయ అరంగేట్రం చేయడం విశేషం. ప్రస్తుతం మోడీ కేబినెట్లో మంత్రిగా ఉన్న రామ్దాస్ అథవాలె నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో పాయిల్ చేరింది. సోమవారం పార్టీలో చేరగా.. అదే రోజు పాయల్ను పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమించారు రామ్దాస్ అథవాలె. అప్పుడే ప్రెస్ మీట్లో పాల్గొనడంతో పాటు మహిళా నేతలతో కలిసి సందడి చేసిన పాయల్.. ఆరితేరిన రాజకీయ నాయకురాలి లాగా మీడియా ముందు పోజులు కూడా ఇచ్చింది.
పాయల్ సినీ కెరీర్లో పెద్దగా సాధించిందేమీల లేదు. ఆమె కెరీర్లో చేసినవే తక్కువ సినిమాలు. అందులో చెప్పుకోదగ్గ హిట్లు లేవు. అనురాగ్ మీద ఆరోపణలు చేయడానికి ముందు వరకు పాయల్ లైమ్ లైట్లోనే లేదు. ఆ ఆరోపణలతోనే మీడియా ఆమెకు బాగా కవరేజీ ఇచ్చింది.
అసలు అనురాగ్తో ఎప్పుడూ కలిసి సినిమా చేయని పాయల్.. అతడి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగించింది అందరికీ. ఆ ఆరోపణలు చేస్తూ ఆమె రిచా చద్దా, హ్యూమా ఖురేషి లాంటి హీరోయిన్లను కించ పరిచేలా మాట్లాడటం.. రిచాకు సారీ బేషరతుగా సారీ చెప్పడంతో పాయల్ ఇమేజే దెబ్బ తింది. ఐతే ఎలాగైతేనేం వార్తల్లో నిలిచింది కదా, ఆమె పాపులారిటీ ఉపయోగపడుతుందని రామ్ దాస్ ఆమెను పార్టీలో చేర్చుకుని పదవి కట్టబెట్టినట్లున్నారు.
This post was last modified on October 27, 2020 12:15 pm
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…