Political News

మూడో సంతానం ఉందా?… అయితే రూ.50 వేలు మీవే!

మొన్నటిదాకా ఇద్దరు పిల్లలు ముద్దు…అంతకు మించి వద్దు అనేది నినాదం. ఇప్పుడు ఎంత మంది వీలయితే అంత మంది పిల్లలను కనేయండి అనేది కొత్త నినాదం. అంతకంతకూ తగ్గిపోతున్న జనాభాను పెంచేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందుకున్న కొత్త నినాదం ఇది. ఈ నినాదాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ సీనియర్ నేత, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు మరో కీలక అడుగు వేశారు.

మీకు మూడో సంతానం ఉందా… అయితే రూ.50 వేలు తీసుకెళ్లండి అంటూ ఆయన తన నియోజకవర్గ ప్రజలకు సరికొత్త ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఎంపీగా పార్లమెంటులో తనదైన శైలితో దూసుకువెళుతున్న నాయుడు… నిత్యం వార్తల్లో ఉంటున్నారు. తాజాగా తన పార్టీ అధినేత ఇచ్చిన నూతన నినాదాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు అందరికంటే ముందుగా రంగంలోకి దిగి… మిగిలిన ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్దగా జనాభా తరుగుదల అయితే లేదు గానీ… దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న దాని కంటే కూడా జనాభా పెరుగుదల మందగించింది. గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల అమలులో దక్షిణాది రాష్ట్రాలు సత్తా చాటాయి. కోట్లాదిగా వేసెక్టమీ ఆపరేషన్లు చేసి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించారు. తీరా చూస్తే… ఇప్పుడు ఆ ఆపరేషన్ల ఫలితంగా జనాభా తగ్గిపోయింది. కొత్తగా పెళ్లి చేసుకుంటున్న జంటలు కూడా పరిమితంగానే పిల్లలను కంటూ సాగుతున్నారు. ఇందుకు సామాజిక, ఆర్థిక కారణాలు కూడా దోహదం చేస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం జరగబోతున్న డీలిమిటేషన్ లో జనాభా తగ్గిపోయిన ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలు భారీగా నష్టపోతున్నాయి. ఈ పరిణామాలను ముందుగానే గమనించిన చంద్రబాబు జనాభా పెరుగుదలకు పకడ్బందీ చర్యలు ప్రారంభించారు.

చంద్రబాబు అడుగు జాడల్లో నడిచిన అప్పలనాయుడు… మూడో సంతానం కలిగిన దంపతులకు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అప్పలనాయుడు ప్రకటన ప్రకారం విజయనగరం పార్లమెంటు పరిధిలో మూడో సంతానం కలిగిన దంపతులకు రూ.50 వేల నగదు ప్రోత్సాహకాన్ని ఇవ్వనున్నారు. నగదు ప్రోత్సహకం వద్దనుకుంటే జంటలకు మూడో సంతానం ఆడ పిల్ల అయితే ఆవును, మగ పిల్లవాడు అయితే దూడను కూడా అందజేస్తానంటూ అప్పలనాయుడు ప్రకటించారు. ఈ ప్రకటన విజయనగరంలో కొత్త జంటలను అమితంగా ఆకట్టుకనే అవకాశం ఉందని చెప్పాలి. అదే సమయంలో ఏపీలోని మిగిలిన జిల్లాలు, దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు కూడా అప్పలనాయుడు తరహాలో జనాభా పెరుగుదలకు ఈ తరహా ప్రోత్సాహకాలను ప్రకటించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on March 10, 2025 12:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

2 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

4 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

4 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

5 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

13 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

13 hours ago